కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతూనే ఉంది ఎంతకు శాంతించడం లేదు ఒక వైపు రోజువారీ మరణాల సంఖ్య కూడా పెరుగుదల కనిపిస్తుంది.గత 24 గంటల్లో భారతదేశం 263,533 పాజిటివ్ కేసులను చూసింది.దీనితో మొత్తం మీద పాజిటివ్ కేసుల సంఖ్య 25,228,996 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (మోహెచ్ఎఫ్డబ్ల్యూ) డాష్బోర్డ్ మంగళవారం ఉదయం ప్రకటించింది.అలాగే, ఇప్పటి వరకు వైరస్ వ్యాధితో 4,329 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం మీద కోవిడ్ మరణాల సంఖ్య 278,719 కు చేరుకుంది,కరోనా మొదలైనప్పటినుంచి అత్యధికంగా మరణించిన వారి సంఖ్య ఇదే.భారత్ లో కొత్త కోవిడ్ -19 కేసులలో స్వల్ప పెరుగుదలను నమోదు చేసినప్పటికీ, వరుసగా రెండవ రోజు 300,000 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. మునుపటి రోజు 24 గంటల్లో 281,386 మంది ప్రజలు కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించారని సోమవారం మంత్రిత్వ శాఖ డాష్బోర్డ్ లో ప్రకటించింది.మంగళవారం గణాంకాల ప్రకారం, కోలుకున్న కేసులు సంఖ్య 422,436 .
also read : శేఖర్ కమ్ములకు కోపం వస్తే ఎలా ఉంటుందో చెప్పేసిన చై..నవ్వులే నవ్వులు..!










