అయోధ్య రామ మందిరం, మసీదు గొడవ ఇప్పుడు ముగిసింది. ఇప్పుడు ఆ స్థానంలో రామ మందిరం స్థాపించబడింది. అయితే, ఇప్పుడు జ్ఞానవాపి మసీదుకు ప్రాంతంలో కూడా అక్కడ ఉన్న హిందువులు పూజ చేసుకునేందుకు కోర్టు అవకాశం కల్పించింది.
ఇది దాదాపు 37 సంవత్సరాల తర్వాత వచ్చింది. కానీ ఇక్కడ ములాయం సింగ్ యాదవ్ పేరు వినిపిస్తోంది. దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. దాదాపు 1990 అక్టోబర్ సమయంలో ములాయం సింగ్ యాదవ్ సీఎం గా ఉన్నారు.

అప్పుడు రామ మందిరం నిర్మాణం చేయాలి అని విశ్వహిందూ పరిషత్ వారు కరసేవ నిర్వహించారు. అప్పుడు అందుకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలి అని ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం దాదాపు 28 వేల మంది పోలీసుల సిబ్బందిని మోహరించారు. అయినా కూడా కరసేవకులు బారీకేడ్లని దాటుకొని మరి మసీదు దగ్గరికి వెళ్లారు. మసీదు మీద కాషాయపు రంగు జెండాలని ఎగరవేశారు. అప్పుడు జరిగిన సంఘటనలో కాల్పులు జరిగాయి. అందులో 20 మంది మరణించారు.

కానీ ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఇంకా ఎక్కువ మంది మరణించారు అని చెప్పారు. 1991 లో ఈ ఘటన తర్వాత యూపీలో ఎన్నికలు జరిగాయి. అక్కడ బిజెపి పార్టీకి చెందిన కళ్యాణ్ సింగ్ అధికారంలోకి వచ్చారు. 1992లో డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీద్ కూల్చివేసిన సంఘటన జరిగింది. ఇవన్నీ ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఆ సమయంలో కేంద్రంలో ఉన్న పీవీ నరసింహారావు ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత సంవత్సరం ఎన్నికలు జరిగాయి. అందులో మళ్లీ ములాయం సింగ్ యాదవ్ అధికారంలోకి వచ్చారు.

అప్పుడు జ్ఞానవాపి సెల్లార్ లో హిందువులు పూజలు చేయకూడదు అంటూ ములాయం యాదవ్ ప్రభుత్వం ఆదేశించింది. హిందువుల పూజల మీద అక్కడ నిషేధం విధించింది. 1993 వరకు అక్కడ పూజలు జరిగాయి. అక్కడ వ్యాస్ అనే ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు 200 ఏళ్ళకి పైగా పూజలు చేశారు. అందుకే వారి పేరు మీద ఆ సెల్లార్ కి వ్యాస్ జీ కా తెహ్ ఖానా అని పేరు కూడా వచ్చింది. కానీ ములాయం సింగ్ ప్రభుత్వం వచ్చాక పూజలు నిలిపివేసింది. ఇందుకు లా అండ్ ఆర్డర్ సమస్యని కారణంగా చూపింది.

అయితే మరొక పక్క శైలేంద్ర వ్యాస్ ఎలాంటి న్యాయ ఉత్తర్వులు జారీ చేయకుండానే ఉక్కు కంచెను నిర్మించారు అని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో హిందూ దేవాలయం ఒకటి ఉన్నట్లు, ఈ విషయాన్ని ఏఎస్ఐ సర్వే తెలిపింది అని హిందువుల తరపు న్యాయవాది అయిన విష్ణశంకర్ జైన్ చెప్పారు. ఇది 800 ఏళ్ల చరిత్ర ఉన్న గుడి. ఈ కాలక్రమంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. విధ్వంసాలు జరిగి, ఆ తర్వాత పునర్నిర్మాణాలు కూడా జరిగాయి.

మహారాజా జయచంద్ర, ఆయన పట్టాభిషేకం తర్వాత, దాదాపు 1170 నుండి 89 మధ్యలో ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించారు అని దక్షిణాసియా అధ్యయనయాలలో ఎంతో నైపుణ్యం కలిగిన పండితుడు అయిన యుగేశ్వర్ కౌశల్ తెలిపారు. అయితే 1669 లో కాశీ విశ్వేశ్వర్ ఆలయాన్ని ధ్వంసం చేసి, ఆ శిథిలాల పైనే జ్ఞానవాపి మసీదుని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు నిర్మించారు అని ఇప్పటికీ ఒక కథనం అయితే ఉంది. దీన్ని అక్కడ చాలా మంది విశ్వసిస్తారు. అలా ఈ జ్ఞానవాపి మసీదు గొడవలో ములాయం సింగ్ పాత్ర కూడా ఉంది.
ALSO READ : సమ్మక్క సారలమ్మ జాతరలో కోళ్లను ఎందుకు ఎగురవేస్తారో తెలుసా..? దీనికి కారణం ఏంటంటే..?


బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, దేశంలో డిజిటల్ పేమెంట్ యాప్స్ లో పేటీఎమ్ కూడా ఒకటి. డిజిటల్ పేమెంట్ మార్కెట్ లో పేటీఎమ్ వాటా 16 నుండి 17 శాతం ఉంటుంది. బుధవారం నాడు రిజర్వ్ బ్యాంక్ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకు పై ఆంక్షలు విధిస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. పేటీఎం ఆడిట్ రిపోర్ట్ తో పాటు ఇతర బాహ్య ఆడిటర్ల రిపోర్ట్స్ ప్రకారం, తరచుగా పేటీఎం రూల్స్ ని ఉల్లంఘించినట్లుగా తేలింది. అందువల్ల బ్యాంకుల నియంత్రణ చట్టంలో ఉన్న ’35ఏ’ రూల్ ప్రకారంగా, ఫిబ్రవరి 29 అనంతరం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో లావాదేవీలు, వ్యాలెట్, క్రెడిట్ డిపాజిట్, ఫాస్టాగ్ టాప్అప్లు ఆపేస్తున్నాము.
కస్టమర్ల బ్యాలెన్స్ ఉపసంహరించుకోవడానికి, ఉపఎగిన్చుకోవడానికి పూర్తిగా పేటీఎం సహకరించాలి. అందుకు తగిన సౌకర్యాలు కల్పించాలి. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ఫాస్టాగ్లలో ఉన్న డబ్బును విత్డ్రా, లేదా వాడుకోవడానికి కస్టమర్ల పై ఎటువంటి ఆంక్షలు ఉండవు’’ అంటూ ఆర్బిఐ ప్రకటనలో వెల్లడించింది. అందువల్ల ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు దానిని వినియోగించలేరు. మార్చి 15 లోగా నోడల్ అకౌంట్ను కూడా సెటిల్ చేయాలని ఆర్బీఐ పేటీఎంను కోరింది.





ఫుడ్ కు ఫేమస్ అయిన హైదరాబాద్ లో ఇటీవల కాలంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ లు బాగా పెరిగిపోయాయి. ఆ ఫుడ్ కి రోజు రోజుకి అభిమానులు పెరిగిపోటున్నారు. రోడ్డు పక్కన మంచి రుచికరమైన ఫుడ్ దొరకడం, అది కూడా చాలా తక్కువ ధరకు లభిస్తుండడంతో వాటి దగ్గరకి జనాలు క్యూ కడుతున్నారు. ఇందుకు ఉదాహరణగా కుమారి ఆంటీ పేరు చెప్పుకోవచ్చు. ఆమె ఫుడ్ బిజినెస్ తో చాలా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఏక్కడ చూసిన ఆమె గురించిన వార్తలే కనిపిస్తున్నాయి. అయితే అదే ప్రాంతంలో అనురాధ ఆంటీ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు.
ఆమె స్టాల్ లో టేస్టీ దాల్ రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, జీరా రైస్, టమాటా రైస్, పెరుగన్నం అందుబాటులో ఉన్నాయి. ఇక నాన్ వెజ్ లో మటన్, చికెన్, లివర్, ఫిష్, తలకాయ, ఫ్రాన్స్ వంటి కర్రీస్ ఉంటాయి. వెజ్ ప్లేట్కు 80 రూపాయలు కాగా, రైస్ అన్లిమిటెడ్ గా ఉంది. చికెన్ కర్రీ రూ.120 (అన్లిమిటెడ్ వైట్ రైస్/ బగారా రైస్ ),చికెన్ ఫ్రై రూ.150 (అన్లిమిటెడ్ వైట్ రైస్/ బగారా రైస్), మటన్ కర్రీ –రూ.200 (అన్లిమిటెడ్ వైట్ రైస్/ బగారా రైస్), లివర్ కర్రీతో రైస్ 150 రూపాయలు, ప్రాన్స్ కర్రీతో రైస్ 150 రూపాయలు, ఫిష్ కర్రీతో రైస్ 150 రూపాయలు,కాగా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటితో కలిపి తీసుకుంటే 450 రూపాయలు.
ఆమె వద్ద రోజుకు మూడు వందల మంది దాకా ఫుడ్ తింటారు. ఆ లెక్కన ఒక్కోక్కరికి యావరేజ్ గా రూ. 100 చొప్పున రోజుకు 30000 వస్తుంది. ఖర్చులన్ని పోగా 10 వేల రూపాయల వరకు మిగిలే ఛాన్స్ ఉంది. ఈ విధంగా చూస్తే నెలకు మూడు లక్షల దాకా ఆమెకు లాభం వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. తక్కువ ధరకు వందల మందికి ఆహారం అందిస్తున్న ఇలాంటి మహిళలను అందరు మెచ్చుకుంటున్నారు.




