సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వింత ప్రపంచం. ఇక్కడ ఎవరికి ఎప్పుడు గుర్తింపు వస్తుందో తెలియదు. ఎలా తరబడి కష్టపడ్డ ఒక్కొక్కరికి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాదు. కానీ ఒక్కొక్కరికి మాత్రం ఒక చిన్న పాత్ర ఎంతో మంచి గుర్తింపు తీసుకువస్తుంది. తాజాగా ఈటీవి విన్ యాప్ లో #90’s వెబ్ సిరీస్ వచ్చింది.

ఈటీవీ విన్ యాప్ కు ఊహించని స్థాయిలో సబ్ స్క్రైబర్లు పెరగడంలో ఈ వెబ్ సిరీస్ కీలక పాత్ర పోషించింది.ఈ వెబ్ సిరీస్ కు సీక్వెల్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది.1990 నుంచి 2000 మధ్య పుట్టిన వ్యక్తుల రియల్ లైఫ్ ను ప్రతిబింబించేలా ఉండటం ఈ వెబ్ సిరీస్ కు బాగా ప్లస్ అయింది. ఈ సీరీస్ లో నటించడం ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో మాస్టర్ రోల్ లో నటించిన నటుడు సందీప్ తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశారు. తాజా ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ పలు విషయాలు పంచుకున్నాడు.
ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నా రూమ్ మేట్ అని సందీప్ వెల్లడించారు. ఈటీవి లో ప్రసారం అయ్యే జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లు చేశానని ఆయన తెలిపారు.నా స్వస్థలం కామారెడ్డి అని ఇంటర్ లో ఇండస్ట్రీపై ఆసక్తి పెరిగిందని సందీప్ అన్నారు.చలాకీ చంటి ఛాన్స్ ఇచ్చారని సందీప్ వెల్లడించారు.డైరెక్టర్ తో ఉన్న స్నేహం వల్ల ఈ వెబ్ సిరిస్ లో ఛాన్స్ దక్కిందని అన్నారు.

ఆదిత్య హాసన్ కథలు చెప్పేవాడని ఆయన కథలు విని షాకయ్యేవాడినని సందీప్ పేర్కొన్నారు.కథ విని క్యారెక్టర్ అడగగా అడిషన్ చేసి తీసుకున్నారని ఆయన వెల్లడించారు. జబర్దస్త్ లో ఎన్ని స్కిట్ లు చేసిన రాని గుర్తింపు ఈ ఒక్క వెబ్ సిరీస్ తో వచ్చింది అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.బయట అందరూ మ్యాథ్స్ టీచర్ అని పిలుస్తున్నారని సందీప్ తెలిపారు.






60 సీట్లు ఇస్తారు, 70 సీట్లు ఇస్తారనే భ్రమల్లో ఉండవద్దని ఏ ఇరవై ఐదు సీట్లో ముష్టి వేస్తాడు” అని అన్నారు. జనసేన, టీడీపీ ఎలెక్షన్స్ కు సిద్ధంగా లేవని, సీట్ల లెక్కల్లో ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఒకే ఒక ముఖ్యమంత్రిగా చరిత్రలో వైఎస్ జగన్ నిలిచిపోతారని వెల్లడించారు. ఎవరెన్ని చీలికలు చేసినా, పద్మ వ్యూహాలు పన్నినా వాటిని ఛేదించి రాగల అర్జునుడు జగన్ అని అన్నారు.
అన్యాయాలు, అక్రమాలు చేసిన బాలశౌరి బఫూన్ బాలశౌరి బఫూన్ అని విమర్శించారు. టికెట్ రాకపోవడంతో పార్టీ మారుతున్నాడని అన్నారు. ఇది ఇలా ఉంటే ఆదివారం నాడు జరిగిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల భేటీ పై కూడా మినిస్టర్ అంబటి రాంబాబు స్పందించారు. ‘‘మోయటానికి ఎందుకులే భేటీలు..!’’ అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ షేర్ చేశారు.
ఆ పోస్ట్ లో ఒక కార్టూన్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబులను తన భుజాల పై మోస్తున్నట్టుగా ఆ కార్టూన్ ఉంది. ఆ తరువాత మీడియాతో ఆయన మాట్లాడుతూ, వీరిద్దరూ భేటీ అవడం కొత్త విషయం కాదన్నారు. సీట్ల కోసం లేదా నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లిద్దరే చెప్పాలని కామెంట్స్ చేశారు. రెండేళ్లుగా రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెబుతున్నా, ఇప్పటికీ సీట్ల విషయం తేల్చుకోలేకపోయారని విమర్శించారు.










బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, దేశంలో డిజిటల్ పేమెంట్ యాప్స్ లో పేటీఎమ్ కూడా ఒకటి. డిజిటల్ పేమెంట్ మార్కెట్ లో పేటీఎమ్ వాటా 16 నుండి 17 శాతం ఉంటుంది. బుధవారం నాడు రిజర్వ్ బ్యాంక్ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకు పై ఆంక్షలు విధిస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. పేటీఎం ఆడిట్ రిపోర్ట్ తో పాటు ఇతర బాహ్య ఆడిటర్ల రిపోర్ట్స్ ప్రకారం, తరచుగా పేటీఎం రూల్స్ ని ఉల్లంఘించినట్లుగా తేలింది. అందువల్ల బ్యాంకుల నియంత్రణ చట్టంలో ఉన్న ’35ఏ’ రూల్ ప్రకారంగా, ఫిబ్రవరి 29 అనంతరం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో లావాదేవీలు, వ్యాలెట్, క్రెడిట్ డిపాజిట్, ఫాస్టాగ్ టాప్అప్లు ఆపేస్తున్నాము.
కస్టమర్ల బ్యాలెన్స్ ఉపసంహరించుకోవడానికి, ఉపఎగిన్చుకోవడానికి పూర్తిగా పేటీఎం సహకరించాలి. అందుకు తగిన సౌకర్యాలు కల్పించాలి. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ఫాస్టాగ్లలో ఉన్న డబ్బును విత్డ్రా, లేదా వాడుకోవడానికి కస్టమర్ల పై ఎటువంటి ఆంక్షలు ఉండవు’’ అంటూ ఆర్బిఐ ప్రకటనలో వెల్లడించింది. అందువల్ల ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు దానిని వినియోగించలేరు. మార్చి 15 లోగా నోడల్ అకౌంట్ను కూడా సెటిల్ చేయాలని ఆర్బీఐ పేటీఎంను కోరింది.
