అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ట వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఇంకా ఎంతో మంది వ్యాపారవేత్తలు కూడా అయోధ్య రామ మందిరానికి హాజరయ్యారు. రాజకీయ రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులని ఈ వేడుకకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అందులో, తెలుగు రాష్ట్ర ప్రముఖులు కూడా ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ వేడుకకి వెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా అయోధ్య రామ మందిరానికి వెళ్లారు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న మాత్రం నెలకొంది. అదేంటంటే, వైయస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఈ వేడుకకి వెళ్ళలేదు. వారికి ఆహ్వానాలు అందలేదు అని అంటున్నారు. అయితే, “అసలు వైయస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఈ వేడుకకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి?” అని అంటున్నారు. దీనిపై పలు సమాధానాలు వస్తున్నాయి. జగన్ ప్రస్తుతం వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాన్ని ఖరారు చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు.

అయితే మరొక పక్క వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డితో పాటు, మరి కొంత మంది నేతలు, రామ మందిర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ లు చేయడంతో జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది అని చాలా మంది అనుకున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ చీఫ్ అయిన రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి కూడా ఆహ్వానాలు అందాయి. అయినా కూడా వాళ్ళు వెళ్లలేదు. జగన్ దంపతులు కూడా రామ మందిరానికి వెళ్లలేదు. “జగన్ క్రిస్టియానిటీ మతాన్ని నమ్ముతారు కాబట్టి, ఈ వేడుకకి వెళ్ళలేదు” అని కొంత మంది అంటున్నారు.

“ఈ ఆహ్వానాలు కేవలం బీజేపీకి మద్దతు తెలిపిన వారికి మాత్రమే అందాయి” అని కూడా అన్నారు. మరి కొంత మంది అయితే, “జగన్ బీజేపీకి దూరంగా ఉండాలి అని నిర్ణయించుకొని ఈ వేడుకకి వెళ్ళలేదు” అని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. అసలు జగన్ కి ఆహ్వానం అందిందా లేదా అనే విషయం కూడా ఇంకా ప్రశ్నగానే ఉంది. ఒకవేళ ఆహ్వానం అంది ఉంటే వెళ్లలేకపోవడానికి కారణాలు ఇవి అయ్యుండొచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ALSO READ : రామ్ చరణ్ ని అలా అన్నప్పుడు ఉపాసన లేకపోవడమే వెలితి… ఆహ్వానం అందినా కూడా ఆమె ఎందుకు వెళ్ళలేదు.!














 మహారాష్ట్రకు బీద్ జిల్లా రాజేగాన్ గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ లలితా సాల్వే 1988 లో జన్మించింది. ఆమె 2010 లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. అయితే లలితా సాల్వేకి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమె శరీరంలో పలు మార్పులు రావడాన్నిఆమె గుర్తించింది. దాంతో హాస్పటల్ వెళ్లి మెడికల్ టెస్ట్లు అన్ని చేయించుకోగా, అసలు సంగతి బయటికి వచ్చింది.
మహారాష్ట్రకు బీద్ జిల్లా రాజేగాన్ గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ లలితా సాల్వే 1988 లో జన్మించింది. ఆమె 2010 లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. అయితే లలితా సాల్వేకి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమె శరీరంలో పలు మార్పులు రావడాన్నిఆమె గుర్తించింది. దాంతో హాస్పటల్ వెళ్లి మెడికల్ టెస్ట్లు అన్ని చేయించుకోగా, అసలు సంగతి బయటికి వచ్చింది. ఆమె శరీరంలో పురుషులలో ఉండే వై క్రోమోజోమ్లు ఉన్నాయని తేలింది. దాంతో లలిత జెండర్ డిస్ఫోరియా ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. వారి సూచనతో లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని పురుషుడిగా మారింది. లింగ మార్పిడి వల్ల తన ఉద్యోగానికి ఇబ్బంది రాకుండా 2017లో గవర్నమెంట్ ను, బాంబే హైకోర్టును లలిత ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. దీంతో బాంబే హైకోర్టు మరియు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అలా లింగమార్పిడి సర్జరీ చేయించుకుంది.
ఆమె శరీరంలో పురుషులలో ఉండే వై క్రోమోజోమ్లు ఉన్నాయని తేలింది. దాంతో లలిత జెండర్ డిస్ఫోరియా ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. వారి సూచనతో లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని పురుషుడిగా మారింది. లింగ మార్పిడి వల్ల తన ఉద్యోగానికి ఇబ్బంది రాకుండా 2017లో గవర్నమెంట్ ను, బాంబే హైకోర్టును లలిత ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. దీంతో బాంబే హైకోర్టు మరియు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అలా లింగమార్పిడి సర్జరీ చేయించుకుంది. 2018 – 2020 వరకు మూడు సర్జరీలు చేయించుకుని  పురుషుడిగా మారింది. ఆ తరువాత లలిత్ కుమార్ సాల్వేగా పేరు మార్చుకుంది. 2020లో లలిత్ కుమార్ సాల్వే ఛత్రపతి శంభాజీనగర్కు చెందిన సీమాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు  పెళ్లి అయిన నాలుగేళ్ల అనంతరం, జనవరి 15న మగబిడ్డ జన్మించాడు. తనకు మగబిడ్డ జన్మించడంతో లలిత్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, ఒడిదుడుకుల గురించి తెలిపాడు.
 2018 – 2020 వరకు మూడు సర్జరీలు చేయించుకుని  పురుషుడిగా మారింది. ఆ తరువాత లలిత్ కుమార్ సాల్వేగా పేరు మార్చుకుంది. 2020లో లలిత్ కుమార్ సాల్వే ఛత్రపతి శంభాజీనగర్కు చెందిన సీమాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు  పెళ్లి అయిన నాలుగేళ్ల అనంతరం, జనవరి 15న మగబిడ్డ జన్మించాడు. తనకు మగబిడ్డ జన్మించడంతో లలిత్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, ఒడిదుడుకుల గురించి తెలిపాడు.




