watch video:
News
స్టార్ హీరో పార్టీలో ఆ డైరెక్టర్ మిస్సింగ్.. హీరో పై ఫాన్స్ ఎలా ఫైర్ అవుతున్నారో చూడండి!
సంక్రాతి విన్నర్ “అల వైకుంఠపురంలో”. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ కొట్టిన సినిమా.సీనియర్ నటి టబు, రాహుల్ రామకృష్ణ, సునీల్, సుశాంత్, జయ రామ్, మురళి శర్మ, తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటించారు. ఇక బుట్ట బొమ్మ పూజ హెగ్డే కి అయితే కుర్రాళ్లందరూ ఫిదా అయిపోయారు.
సంక్రాంతి పండగకి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించి రికార్డు సృష్టించింది. వందల కోట్లు వసూలు చేసి దూసుకెళ్లింది. అయితే తాజాగా ఈ చిత్రం మంచి హిట్ అవడంతో అల్లు అర్జున్ టాలీవుడ్ లోని ప్రముఖ దర్శకులకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు.
ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే…ఈ పార్టీకి ఎంతో మంది టాప్ డైరెక్టర్స్ వచ్చారు. కానీ సంక్రాంతి మరో విన్నర్ “సరిలేరు నీకెవ్వరూ” దర్శకుడు “అనిల్ రావిపూడి” మాత్రం మిస్ అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. బన్నీ దర్శకులందరూ పిలిచారు కాబట్టి అనిల్ రావిపూడి కూడా పిలవల్సిందని అంటున్నారు. సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలు పోటీ పడిన విషయం అందరికి తెలిసిందే.
అల్లు అర్జున్ దర్శకుడు అనిల్ రావిపూడి పిలిచినప్పటికీ ఆయన తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ పార్టీకి హాజరు అవ్వకపోయుండచ్చు కదా అని బన్నీని సమర్థిస్తున్నారు అతని ఫాన్స్. ఏది ఏమైనా ఈ విషయంపై బన్నీ క్లారిటీ ఇచ్చేంత వరకు వేచి చూడాలి.
RRR రిలీజ్ వాయిదా అవ్వడంతో సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్ల్స్ ఇవే.! చూసి నవ్వుకోండి!
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం RRR విడుదల వాయిదాపై అందరికీ క్లారిటీ వచ్చింది. మహా అయితే రెండు మూడు నెలలు వాయిదా పడుతుందేమో అనుకున్నారు. కానీ, ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చారు రాజమౌళి. సినిమా విడుదలను ఏకంగా 2021కి వాయిదా వేసేశారు. 2021 జనవరి 8న సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 300 కోట్లకుపైగా బడ్జెట్తో నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు మరో తొమ్మిది భాషల్లో విడుదల కానుంది RRR. RRR రిలీజ్ వాయిదా అవ్వడంతో సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్ల్స్ ఇవే.! చూసి నవ్వుకోండి!
RRR 1
RRR 2
RRR 3
RRR 4
RRR 5
RRR 6
RRR 7
RRR 8
RRR 9
RRR 10
RRR 11
RRR 12
RRR 13
RRR 15
కోహ్లీ తీసుకున్న ఆ నిర్ణయంపై ఫాన్స్ ఫైర్..! ప్రతిసారి ఇలాగే చేస్తున్నారంటూ?
వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత టీం కు బ్రేక్ పడింది. వరుసగా ఐదు టీ20లు ఓడిపోయామన్న కసితో ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్లు తొలి వన్డేలో చెలరేగిపోయారు. కొండంత లక్ష్యం ముందున్నా ఏమాత్రం కలవరపడకుండా కుమ్మేశారు. 348 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించారు.
అయితే ఈ మ్యాచ్ టీం సెలక్షన్ విషయంలో కోహ్లీ పై ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. దానికి కారణం మనీష్ పాండే స్థానంలో కేదార్ జాదవ్ ను తీసుకోవడమే. ప్రతీసారి కారణం లేకుండా పాండేను తుదిజట్టు నుంచి తొలిగిస్తున్నారని ఒక నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు. కుర్రాళ్ళయిన మనీష్ పండేయ్, శివమ్ దూబే లను తప్పించి 34 ఏళ్ల కేదార్ జాదవ్ ను ఆడించడం ఏంటి అంటున్నారు.
వాస్తవానికి టీ20 సిరీస్లో మనీశ్ పాండే చక్కగా రాణించాడు. ఈ సిరీస్ మొత్తంలో నాటౌట్గా నిలిచి ఆకట్టుకున్నాడు. ఐదో టీ20లో జట్టు కష్టాల్లో ఉన్న దశలో అర్ధసెంచరీతో రాణించాడు. ఇంత మంచి ఫార్మ్ లో ఉన్న అతన్ని కుర్చోపెట్టడం ఏంటి? మరోవైపు ఈ మ్యాచ్లో కేదార్ చక్కగా ప్రదర్శించాడు. 15 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మూడు వన్డేల సిరీస్లో 1-0తో కివీస్ ఆధిక్యంలో ఉంది. రెండో వన్డే
శనివారం ఆక్లాండ్లో జరుగుతుంది.
ఒకప్పుడు పానీపూరి అమ్మి…ఇప్పుడు ఇండియా టీం ని ఫైనల్స్ కి నడిపించిన జైస్వాల్ స్టోరీ ఇదే.!
సౌతాఫ్రికాలోని పోచెఫ్స్ట్రమ్ వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో టీమిండియా యువజట్టు పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 173 పరుగుల టార్గెట్ ను యువఇండియా జట్టు సునాయసంగా ఛేదించింది జైస్వాల్ బౌలర్లపై విరుచుకుపడుతూ.. 113బంతుల్లో 105పరుగులు (8ఫోర్లు, 4సిక్సులు)తో చెలరేగాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(105), దివ్యాంశ్ సక్సేనా(59) అద్భుతంగా రాణించడంతో వికెట్లేమీ కోల్పోకుండానే 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది.
లక్ష్యం ముందు ఏదైనా బలాదూర్ అనడానికి భారత అండర్ 19 క్రికెటర్ యశస్వి జైస్వాల్ జీవితమే ఉదాహరణ ..యశస్వి జైస్వాల్ ఆకలితో పడుకున్న సందర్భాలు కోకొల్లలు. అతని కష్టాల జాబితా చూస్తే అంతు లేదు. కానీ అతను వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అన్ని బాధలు భరిస్తూ కూడా క్రికెటర్ కావాలనే తన లక్ష్యానికి మాత్రం దూరం కాలేదు. ఇప్పుడు అదే అతన్ని కరోడ్పతిని చేసింది. పానీపూరి అమ్మే స్టేజ్ నుంచి కోట్లకు పడగలు ఎత్తేలా చేసింది అతను నమ్ముకున్న క్రికెట్ జీవితం. ఈసారి ఐపీఎల్ వేలంలో జైస్వాల్ను రూ. 2.40 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ చేజిక్కించుకుంది.
ఈ 17 ఏళ్ల ఈ ముంబై కుర్రాడి గతం గురించి తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. కొన్నేళ్ల కిందట రోడ్డు పక్కన పానీ పూరి అమ్మి రోజులు గడిపాడు. ఉత్తరప్రదేశ్లో పేద కుటుంబానికి చెందిన యశస్వి 11 ఏళ్ల వయసులో క్రికెటర్ కావాలనే కోరికతో ముంబైకి చేరుకున్నాడు యశస్వి నిర్ణయానికి తల్లితండ్రులు అడ్డుచెప్పలేదు. ముంబయి చేరుకున్న తర్వాత ఓ డైరీలో పని చేసుకుంటూ… స్థానికంగా క్రికెట్ ఆడడం మొదలెట్టాడు. అయితే క్రికెట్ మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ పని సరిగా చేయడంలేదని యజమాని అతణ్ని పనికి వద్దన్నాడు.
అదితెలిసిన ఒక బంధువు కొన్ని రోజులు తన ఇంట్లో ఉండమని ఆశ్రయం కల్పించాడు. అది కూడా ఇరుకైందే కావడంతో తను వేరే ప్లేస్ చూసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆజాద్ మైదానంలోని ముస్లిమ్ యునైటెడ్ క్లబ్కు చెందిన గుడారాల్లో ఉండే ఏర్పాటు చేశాడు. మూడేళ్ల పాటు యశస్వి అక్కడే ఉన్నాడు.అందులో సరైన వసతులు ఉండేవి కావు. కరెంటుండేది కాదు, మూత్రశాలా లేదు. అయినా అందులోనే సర్దుకున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రికెట్ ఆడటం.. సాయంత్రం పూట పానీపూరీ అమ్మడం, మరికొన్ని పనులు చేయడం ద్వారా జీవనం సాగించాడు.
డబ్బులు సరిపోక కొన్ని కడుపు నిండకపోయినా ఓర్చుకున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా క్రికెట్ను మాత్రం యశస్వి విడిచిపెట్టలేదు. అతడి ప్రతిభ గుర్తించి స్థానిక ఆటగాళ్లు, కోచ్లు ప్రోత్సహించారు. యశస్వి ప్రతిభను గుర్తిచిన జ్వాలా సింగ్ అనే కోచ్ సరైన శిక్షణ ఏర్పాటు చేసాడు ఎ-డివిజన్ ఆటగాళ్ల బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తూ… గత ఏడాది అతను శ్రీలంకలో పర్యటించే భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. మూడో వన్డేలో చక్కటి శతకం (114) బాది భారత్కు సిరీస్ అందించాడు. ఇంగ్లాండ్లో వరుసగా నాలుగు అర్ధశతకాలతో అండర్-19 జట్టు ముక్కోణపు సిరీస్ గెలవడంలో యశస్విది ముఖ్య పాత్ర. లిస్ట్ ఏ క్రికెట్లో డబుల్ సెంచరీచేసిన పిన్న వయస్కుడిగా యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డ్ సాధించి నేడు ఐపీఎల్ కు కొనుగోలు చేయబడ్డాడు.నిన్న జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో పాకిస్థాన్ పై ( 113బంతుల్లో 105పరుగులు ) వీరోచిత ప్రదర్శనకు జైస్వాల్ను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరించింది. త్వరలో ఇండియా టీమ్ కు కూడా సేవలందించాలని ఆశిద్దాం.
సురేఖ వాణి కూతురి ఫోటోలు చూస్తే హీరోయిన్ అనాల్సిందే..! ఆమె ఇప్పుడు ఏం చేస్తుందంటే?
తెలుగు సినిమా ఆడియన్స్ కి సురేఖ వాణి బాగా పరిచయమే. సైడ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లి గా, అక్క గా, అత్తగా నటించి మెప్పించారు. బ్రహ్మానందం తో కలిసి నటించి కామెడీ పండించి అందరిని అలరించారు. కొద్దికాలం క్రితమే ఆమె భర్త సురేష్ తేజ మరణించిన విషయం తెలిసిందే.
సురేఖ కూతురి సుప్రీత సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటారు. టిక్ టాక్ వీడియోస్ తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నారు. తల్లి లాగే కూతురి కూడా టాలెంటెడ్ అంటూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆమె అభిమానులు. కొంతమంది అయితే ఆమె హీరోయిన్ గా వస్తే బాగుండు అని అనుకుంటున్నారు. 19 సంవత్సరాలకి తల్లికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి నేను ఉన్నానమ్మ అంటూ పక్కనే నిల్చుని చాలా సపోర్ట్ చేస్తుంది సుప్రీతా.
సురేఖ కూతురి సుప్రీత ప్రస్తుతం చదువుకుంటుంది. మరోవైపు వెబ్ సీరీస్ లో కూడా నటిస్తోంది. ఆమె చేసిన కొన్ని ఎపిసోడ్స్ యూట్యూబ్ లో ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. సమయం ఉన్నప్పుడల్లా తల్లితో టైం స్పెండ్ చేస్తూ అప్పుడప్పుడు వెకేషన్ కి వెళ్తూ ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూ ఉంటారు సుప్రీత. సురేఖ లాగే సుప్రీత కూడా కెరీర్ లో మంచిగా ఎదగాలని ఆశిస్తూ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాం.
సురేష్, సురేఖ వాణిలకు ఒక్కతే అమ్మాయి కావడంతో తనే కొడుకుగా తన తండ్రికి తలకొరివి కూడా పెట్టింది. ఆ టైంలో సోషల్ మీడియాలో చాలా నెగిటివిటిని ఎదుర్కుంది.మా జీవితాల్లో మేము ఎంత సఫర్ అవుతున్నామో అనేది నీకు తెలీదు అంటూ ఎమోషనల్ మెసేజెస్ కూడా పోస్ట్ చేసింది.
ఆ ఫంక్షన్ వల్ల మళ్ళీ వార్తల్లోకొచ్చిన ఒకప్పటి స్టార్ హీరో.! ఇన్ని రోజులు ఏమైపోయాడు?
‘పెళ్లి’ సినిమా తో బాగా గుర్తింపు తెచ్చుకున్న హీరో వడ్డె నవీన్.మనసిచ్చి చూడు’, ‘చాలా బాగుంది’, ‘నా హృదయంలో నిదురించే చెలి’, మా బాలాజీ తదితర చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గర అయ్యాడు. కానీ సడన్ గా కెరీర్ ఆగిపోయింది. సినిమా అవకాశాలు రాకుండా పోయాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘అటాక్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు కానీ అంతగా హిట్ కొట్టలేకపోయాడు. ఇక సినిమాలకు సెలవిచ్చి సొంత వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నాడు నవీన్.
అయితే ఇంత సడన్ గా అతని గురించి టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? తాజాగా అతను ఓ ఫంక్షన్ ఫోటోల వల్ల వైరల్ అవుతుండటంతో అభిమానుల్లో మళ్ళీ చర్చ మొదలైంది ఈ ఫోటోలకు వచ్చే రెస్పాన్స్ చూస్తుంటే వడ్డే నవీన్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది.
వడ్డే నవీన్ కుమారుడు జిష్ణు పంచెకట్టు వేడుక ఇటీవలే మాదాపూర్ ఆవాస హోటల్లో జరిగింది. ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఏపీఐఐసి చైర్మన్ రోజా హాజరయ్యారు. అలాగే శివాజీ రాజా, రాశి, హేమ తదితరులు కూడా పాలు పంచుకున్నారు. ఆ వేడుకకు సంబందించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అప్పుడు అనుపమ…ఇప్పుడు దిశా..! ఇలా అయితే మా సింగిల్స్ ఏమైపోవాలి బుమ్రా?
కెటర్ బుమ్రా, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ మధ్య ఏమి జరుగుతోంది? వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా? సోషల్ మీడియాలో కొన్ని రోజుల కిందట ఇదే ట్రేండింగ్ టాపిక్. సోషల్ మీడియాలో బుమ్రా ఫాలో అయ్యే సెలబ్రిటీ అనుపమ ఒక్కరే అంట. అంతేకాదు ఒకరు పెట్టే పోస్ట్కు మరొకరు వెంటనే లైక్లు కొట్టడం, ఒకరి పోస్ట్లను మరొకరు షేర్ చేయడం తరచుగా చేస్తున్నారట. దీంతో వారు కలిసి బయట కనిపించక పోయిన వారిద్దరి మధ్య ఏదో ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈ సీన్ లోకి దిశా పటాని కూడా ఎంటర్ అయిపొయింది.
న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో 5-0తో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శించాడు. చివరి మ్యాచ్లో 4 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇందులో ఒకటి మెయిడిన్ ఉండటం విశేషం. ఇప్పుడు ఈ విషయంపై దిశా పటాని బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించింది.
తన అప్కమింగ్ మూవీ ‘మలంగ్’ప్రమోషన్స్లో భాగంగా చివరి టీ20కు ముందు దిశా పటాని. అధికారిక బ్రాడ్కాస్టర్ ప్రీ మ్యాచ్ షోలో పాల్గొంది. మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ను పిక్ చేయమంటే నేను బుమ్రా పేరే చెబుతా. అతనో అద్భుతమైన ఆటగాడు. కివీస్ను బుమ్రా కట్టడి చేయడం, భారత్ గెలవడం గర్వించదగిన విషయం.’అని ఈ బాలీవుడ్ భామ పేర్కొంది.
కరోనా వైరస్ గురించి అసలు నిజం బయటపెట్టిన నాగబాబు! అక్కడికంటే ఇక్కడే ఎక్కువ అంట!!!
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే చైనాలో 400 మందికి పైగా ఈ వైరస్ మహమ్మారికి బలయ్యారు. వేల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే కేరళ లో కూడా ఈ వ్యాధి ఒకరికి వచ్చింది.ఈ నేపథ్యంలో మీడియాలో వరుసగా భయంకరమైన వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
దీనిపై నాగబాబు తన స్టైల్ లో స్పందించారు. “కరోనా వైరస్ ప్రజల కంటే మీడియాకే వేగంగా వ్యాపిస్తోంది. 90 శాతం మీడియా ఈ భయంకర వైరస్ బారిన పడింది. కానీ, మరణాల గురించి నిర్ధారణ కాలేదు. నిజమైన కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తుందని భావిస్తున్నాను. అయితే, మీడియాకు పట్టిన వైరస్ మాత్రం వదులుతుందన్న ఆశ లేదు” అని మీడియాపై ఫైర్ అయ్యారు.
కొంత మంది మీడియా అంటే నాగబాబుకు ఎందుకంత కసి, కక్ష అని ఏకిపారేస్తున్నారు. మరికొందరు సూపర్ అదిరింది అంటూ రిప్లైలు ఇస్తున్నారు. ఏది ఏమైనా ఈ కరోనా వ్యాధి త్వరలో నియంత్రణలోకి రావాలని మనం ఆశిద్దాం.
నిన్న చెక్ ఇచ్చాడు…ఇప్పుడు మరో విషయం బయటపెట్టాడు! రేణుక చేయబోయే పనికి గ్రేట్ అనాల్సిందే!
దిశ ఘటన దేశవ్యాప్తంగా ఎంతమందిని కదిలించిందో అందరికి తెలిసిందే. ఆ ఘటనపై సినిమా తీస్తానని ప్రకటించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.అందులో పోలీసులని హీరో గా చూపించబోతున్నాడు అంట. ఇప్పటికే సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి ఆ ఘటన ఎలా జరిగి ఉంటుంది అనే కోణంలో తన బుర్రకి వర్మ పని పెట్టాడు.దానికి సంబంధించి పోస్టులు కూడా పెట్టాడు వర్మ.
నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను కలిశాడు వర్మ. రేణుక, చెన్నకేశవులును 16ఏళ్లకే పెళ్లి చేసుకుందని.. ఇప్పుడు ఆమె 17ఏళ్లకే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోందని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. చెన్నకేశవులు దిశతోపాటు.. రేణుకను కూడా భాదితులురాలిగా మార్చడంటూ తెలిపాడు. అతను చేసిన పనికి రేణుకతోపాటు, అతని బిడ్డకు కూడా భవిష్యత్ లేకుండా పోయిందన్నారు.
అంతేకాకుండా రామ్ గోపాల్ వర్మ ఆమెను ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూ లో రేణుక ఓ విషయం చెప్పింది. తనకి పుట్టబోయే పిల్లలు ఆడ అయినా మగ అయినా “దిశా” అనే పేరు పెడతాను అని చెప్పింది. ఇదే విషయాన్నీ రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసారు. ఎంతైనా రేణుక తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశంసించకుండా ఉండలేము. మొత్తానికి ఇప్పటివరకు మనం రామ్ గోపాల్ వర్మలో చూడని మరోకోణంని చూస్తున్నాము. ఇక సినిమా ఎలా తీస్తాడో వేచి చూడాలి.
watch video: