ఇటీవల కాలంలో పిల్లలు మరియు వారి తెలివితేటలు, క్రియేటివిటీ, సామర్థ్యంతో పెద్దవారిని మించిపోతున్నారు. ఇలాంటి ఉదాహరణలు సోషల్ మీడియాలో ఎన్నో తరచూ కనిపిస్తునే ఉన్నాయి. వాటిని చూసినపుడు ఆశ్చర్యపడుతున్నారు.
అయితే రీసెంట్ గా జరిగిన అలాంటి ఇన్సిడెంట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక చిన్నారి తన నాన్నని 2 లక్షల రూపాయలకు అమ్మకానికి పెట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజెన్లు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎనిమిదేళ్ల చిన్నారి తన నాన్న పై కోపం రావడంతో అతన్ని అమ్మడం కోసం “ఫాదర్ ఆన్ సేల్” నోటీసును వారి ఇంటి డోర్ మీద అంటించింది. ఆ నోటీసులో “తన నాన్నను రెండు లక్షలకు కొనుక్కోవచ్చని, మరిన్ని వివరాల కోసం డోర్ బెల్ కొట్టాలని” చిన్నారి పేర్కొంది.
ఈ నోటీసును చూసిన ఆ చిన్నారి తండ్రి సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేసారు. అందులో తన విలువ అంత తక్కువ కాదని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ నోటీస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఎనిమిదేళ్ల పాప తన నాన్నని రెండు లక్షల రూపాయలకు అమ్ముతున్నట్లు రాసిన నోటీసును ఇంటి బయట పెట్టటం చూసి నెటిజెన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఫన్నీ ఎమోజీలు పెడుతున్నారు.
కొందరు నెటిజెన్లు తండ్రిని అమ్మకానికి పెట్టిన ఎనిమిదేళ్ల చిన్నారి తెలివితేటలకి వివిధ రకాల కామెంట్లు, రియాక్షన్స్ ఇస్తున్నారు. పలువురు నెటిజన్లు చేసిన ఫన్నీ కామెంట్లలో కొన్నిటికి ఆ చిన్నారి తండ్రి సమాధానం కూడా ఇచ్చారు. ఈ రోజు సోషల్ మీడియాలో తాను చూసిన హాస్యాస్పదమైన విషయం ఇదే అని ఒక నెటిజెన్ కామెంట్ చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఈ పోస్ట్ పై స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్స్ లో ఈ పోస్ట్ ని 29 వేల మందికి పైగా చూశారు. వందల మంది నెటిజెన్లు ఈ పోస్ట్ ను లైక్ చేశారు.
A minor disagreement and 8-year-old decided to put up a Father For Sale notice out of our apartment door.
Methinks I am not valued enough. 😞 pic.twitter.com/Epavc6gBis
— Name can be blank (@Malavtweets) October 2, 2023
Also Read: ఇదెక్కడి ఘోరం..! ఇంటర్నేషనల్ లెవల్లో హైదరాబాద్ పరువు తీశారు..!


అయితే, కేసీఆర్ కన్నా ముందు నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ వంటి చాలా మంది నాయకులు రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే ఇలా పోటీ చేయవచ్చా ఆనే విషయం పై ఎన్నికల కమిషన్ 2018లో సుప్రీంకోర్టులో వాదన వినిపించింది. సెక్షన్ 33(7)ను సవరించి ఒక అభ్యర్థి ఒక స్థానం నుండి మాత్రమే పోటీ చేసేలా రూల్స్ ను మార్చాలని, అది కుదరకపోతే రెండు స్థానాల నుంచి పోటీ చేసిన అభ్యర్థి రెండు చోట్ల గెలిస్తే, వారు వదులుకున్న నియోజకవర్గానికి జరిగే బై ఎలెక్షన్స్ ఖర్చును వారే భరించాలని ప్రతిపాదించింది.
ఇక అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు లక్షలు, లోక్ సభ నియోజకవర్గానికి పది లక్షలు ఖర్చు భరించాలని ఎలెక్షన్ కమిషన్ ప్రతిపాదించింది. సెక్షన్ 33(7) ప్రకారం ఒక అభ్యర్థి రెండు నియోజవర్గాల నుంచి ఒకేసారి పోటీ చేయవచ్చు. దీనిని 1996లో చట్ట సవరణ ద్వారా కలిపారు. 1996కి ముందు ఎలెక్షన్స్ లో అభ్యర్థులు ఒకేసారి ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేసే అవకాశం ఉండేది. ఈ సవరణ తరువాత 2 స్థానాలకు పరిమితం చేశారు.
ఒకప్పుడు నడిచిన డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకొస్తే బాగుంటుందని నెటిజన్లు కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా మినిస్టర్ కేటీఆర్ ని కోరారు. వారి రిక్వెస్ట్కు అంగీకరించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ తీసుకొస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆ మాట ప్రకారం, డబుల్ డెక్కర్ బస్సులను ఇటీవల తీసుకొచ్చారు. 12 కోట్ల రూపాయలు వెచ్చించి,హెచ్ఎండీఏ సహకారంతో 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు.
‘జాయ్ రైడ్’ పేరుతో ఈ బస్సులను ఉచితంగా తిప్పుతున్నారు. ఫిబ్రవరి నుండి ఈ బస్సులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నడుస్తున్నాయి. ఈ డబుల్ డెక్కర్ బస్సులను పంజగుట్ట నుండి హైటెక్ సిటీ వరకు నడుస్తాయి. ఈ రూట్ లో మూడు బస్సులు ఉన్నట్టు తెలుస్తోంది. మరో బస్సు ట్యాంక్ బాండ్ రూట్ లో నడుస్తుందని, ఇంకో బస్సు , సాలార్జంగ్ మ్యూజియం రూట్ లో తిరుగుతుందని సమాచారం.
ఆరవ బస్సు అబిడ్స్ రూట్ లో నడుస్తుందని తెలుస్తోంది. ఈ ఆరు బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చు. ఫ్రీ అని తెలియని చాలామంది ఈ బస్సుల రూపాన్ని చూసి, ఎంత టికెట్ ఉంటుందో అని, ఆ బస్సుల ఎప్పుడు వస్తాయో తెలియక కొంతమంది ఎక్కడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ బస్సుల్లో జర్నీ ఉచితం. టికెట్ అవసరం లేకుండా ప్రయాణం చేయవచ్చు.
మహానగరం హైదరాబాద్ లో దేశంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది. కూకట్పల్లిలో లులు మాల్ నగరవాసులకు అతిపెద్ద షాపింగ్ స్పాట్గా నిలుస్తోంది. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో రీసెంట్ గా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అయిన ఈ మాల్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఓపెనింగ్ రోజు ఈ మాల్ కి విపరీతమైన ప్రచారం లభించింది. నెట్టింట్లో కూడా ఈ మాల్ పై విపరీతంగా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో నగర వాసులు ఒక్కసారైనా ఈ మాల్ ను సందర్శించాలనుకుంటారు. దీనికి తోడు 3 రోజుల సెలవుల రావడంతో పెద్ద సంఖ్యలో లులు మాల్ ను సందర్శిస్తున్నారు. ఈ మాల్ కు వచ్చే జనాల వల్ల కూకట్ పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శనివారం నాడు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కాగా, ఆదివారం నాడు వీకెండ్ కావడంతో మాల్ కు జనం ఒక్కసారిగా వేల సంఖ్యలో పోటెత్తారు. మాల్ లోపల జనాలు నిండిపోయి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎక్కడ చూసినా జనాలే ఎస్కలేటర్లు, బిల్లింగ్ కౌంటర్లు ఇలా అన్నీ చోట్ల పూర్తిగా జనాలతో మాల్ నిండిపోయింది.
ఈ రద్దీలో కొంతమంది మాల్ లో అందినంతవరకు దోచుకున్నారు. ఆహార పదార్థాలను సీసీ కెమెరాల కళ్లుగప్పి మరీ దోచేశారు. మాల్లో ఉన్న ఆహార పదార్థాలన్నిటిని కస్టమర్లు తినేశారు. బిస్కెట్లు, సమోసాలు, ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్, ఏది చేతికి దొరికితే దానిని తినేశారు. కొంతమంది సగం తినేసి సగం మాల్ లో నచ్చినట్టు విసిరి పడేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజెన్లు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ లో నగర వాసులు మన పరువును అంతర్జాతీయ స్థాయిలో తీసారని కామెంట్లు చేస్తున్నారు.



వినాయకచవితి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. గణేష్ నిమజ్జన సందర్భంగా జరిగే ఊరేగింపులో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు ప్రతి ఏడాది మందు షాపులను క్లోజ్ చేస్తూ ఉంటారు. ఎప్పటిలానే ఈ సంవత్సరం కూడా 3 రోజుల పాటు అంటే 26, 27, 28 మందు షాపులను మూసేయాలని తెలంగాణ గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. అంటేకాకుండా మద్యం సేవించి నిమజ్జంలో పాల్గొనటాన్ని కూడా నిషేధించారు.
అయితే కొందరు మందు షాప్స్ మూసేస్తారని 3 రోజుల ముందుగానే మద్యాన్ని కొని, పెట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా గణేష్ నిమజ్జంలో భాగంగా జరిగే ఊరేగింపులో కొందరు మద్యం సేవించారు. అది కూడా పబ్లిక్ గా అందరూ చూస్తుండగానే మద్యం సేవించారు. ఇలా చాలా చోట్ల కనిపించింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అయినప్పటికీ హుస్సేన్సాగర్లో జరిగిన నిమజ్జనంలో చైన్ స్నాచింగ్లు, పిక్ పాకెటింగ్, మొబైల్ ఫోన్ల దొంగతనాలు పెద్ద సంఖ్యలో జరిగాయి.
గురువారం నాడు ఒక్కరోజే ఆ పరిసరాలు 67 దొంగతనాల కేసులు రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రజలందరు గణేష్ నిమజ్జనం చూస్తుంటే, జేబు దొంగలు తమ చేతివాటాన్నిప్రదర్శించారు. ఈ దొంగతనాల పై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. డ్రోన్ దృశ్యాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
వినికిడి లోపం ఉన్న లాయర్ల కోసం సంకేత భాష ద్వారా ఒక కేసు యొక్క విచారణను అనువదించడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. రీసెంట్ గా సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ సంచిత సీజేఐ డీవై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని బధిర లాయర్ సారా సన్నీ సైగల సహాయంతో వికలాంగుల హక్కులకు చెందిన కేసును వాదించడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరింది. సీజేఐ అనుమతించారు. దాంతో ఇండియాలో మొట్టమొదట, వినికిడి లోపం ఉన్న న్యాయవాది సారా సన్నీ, సంకేత భాషల సహాయంతో సుప్రీంకోర్టులో కేసును సమర్పించారు.
కలలను సాకారం చేసుకోవడానికి శరీరంలోని లోపం అడ్డుకాదని, నిరూపిస్తూ సారా సన్నీ సుప్రీంకోర్టులో వాదించి, భారత దేశ చరిత్రలో, మొదటిసారిగా వినికిడి లోపం ఉన్న న్యాయవాదిగా నిలిచింది. సారా సన్నీ సుప్రీంకోర్టులో న్యాయ విచారణకు హాజరయ్యారు. సౌరభ్ రాయ్ సాయంతో కోర్టులో సైగలతో సారా సన్నీ మొదటిసారి వాదనలు వినిపించారు. కేరళలోని కొట్టాయం నుండి వచ్చిన సారా బెంగుళూరుకు చెందిన వినికిడి లోపం ఉన్న లాయర్.
ఆమె ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ మరియు హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్లో యాక్టివ్ మెంబర్. సన్నీకి మరియ అనే కవల సోదరి కూడా ఉంది. ఇద్దరూ అక్కడే జ్యోతినివాస్ కాలేజీలో బీకామ్ పూర్తి చేశారు. మరియ తన తండ్రి కెరీర్ను ఎంచుకుని, చార్టర్డ్ అకౌంటెంట్ వైపు వెళ్ళగా, సారా లాయర్ అయ్యింది. కేసు వాదించిన అనంతరం సుప్రీంకోర్టులో వాదించడం తన కల అని, అది ఇంత త్వరగా నిజం అవుతుందని ఉహించలేదని కోర్టులో తెలిపింది.
ఏఎస్పీ శ్రీలక్ష్మీ మాట్లాడుతూ భవ్యశ్రీ కేసును అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. సెప్టెంబర్ 18న భవ్యశ్రీ తండ్రి తన కుమార్తె అదృశ్యం అయ్యిందని స్థానికంగా ఉన్న పోలీస్స్టేషన్లో కంప్లైంట్ చేశారన్నారు. దాంతో మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి, ఎంక్వైరీ మొదలుపెట్టామని అన్నారు. ఒక బావిలో సెప్టెంబర్ 20న ఒక యువతి మృతదేహం దొరికిందని, ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ గా గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.
భవ్య శ్రీ తల్లిదండ్రులు తమ కుమార్తె పై అఘాయిత్యం చేసి, చంపేశారని ఆరోపించారని చెప్పారు. నలుగురి పై సందేహం ఉందని చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని, ప్రశ్నిస్తున్నామని అన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిదండ్రుల ఎదుటే మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ చేశారని, మృతురాలి శరీరం పై ఎటువంటి గాయాలు లేవని, అఘాయిత్యానికి ఏమైన పాల్పడి ఉంటారనే సందేహంతో మృతురాలి నుండి శాంపిల్స్ సేకరించి, తిరుపతి ఆర్ఎఫ్ఎస్ఎల్కు పంపించామని తెలిపారు. ఎవరైన ఊహాగానాలు, అవాస్తవాలు వ్యాప్తి చేస్తే వారిపై చర్యలు తప్పవని వెల్లడించారు.
ఎస్పీ రిషాంత్ రెడ్డి భవ్యశ్రీ మృతి పై ట్వీట్ చేశారు. అందులో “పెనుమూరులో కలకలం రేపిన 16 సంవత్సరాల అమ్మాయి అదృశ్యం, అనుమానాస్పద మృతి కేసులో సామాజిక మధ్యమలలో వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ఆ అమ్మాయి పై ఎలాంటి అత్యాచారం లేదా శరీరం పై గాయాలేమి లేవు అని అన్నారు. గుండు కొట్టి అమ్మాయిని చంపారు అనేది నిజం కాదని, ఊడిపోయిన జుట్టు ఆమె మృతి చెందిన బావిలో లభ్యం అయ్యిందని అన్నారు. తల పై కూడా గుండు కొట్టినట్టుగా ఎలాంటి గుర్తులు లేవని” వెల్లడించారు.
రీసెంట్ గా నిర్వహించిన నీట్ ఎగ్జామ్ లో 362 మార్కులను సాధించింది. వారిది ఎస్సీ కేటగిరి అవడంతో ఎంబీబీఎస్ సీటు తప్పకుండా వస్తుందని ఫ్యామిలీ అంత సంతోషాపడ్డారు. కానీ ఆరవ తరగతిలో కీర్తన చేరిన ఏడాదికి ఎటపాక నవోదయ విద్యాలయం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిపోయింది. దాంతో కీర్తన ఆంధ్రప్రదేశ్ కు లోకల్ గా, తెలంగాణకు నాన్ లోకల్ గా మారింది. దానివల్ల కేఎన్ఆర్ యూనివర్సిటీలో ఆమె ఎంబీబీఎస్ సీటు కోల్పోయింది.
కీర్తన తండ్రి సూర్య తమ పూర్వీకుల నుండి తెలంగాణలో ఉంటున్నామని అన్నారు. ధ్రువపత్రాలన్ని కలిగి ఉన్నామని తన కుమార్తెను నాన్ లోకల్ గా పరిగణించడం ఎంతవరకు కరెక్ట్ అని, తన కుమార్తె కన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వారికి కూడా సీటు వచ్చిందని బాధను వ్యక్తం చేశారు. ఈ విషయం మీద హైకోర్టుకు వెళ్ళగా కీర్తనకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. యూనివర్సిటీలో కోర్టు ఆర్డర్ తో సంప్రదించగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి తమకు ఆర్డర్స్ ఉన్నాయని, కీర్తనను నాన్ లోకల్ గా లెక్కిస్తామని చెప్పారని ఆమె తల్లిదండ్రులు వాపోయారు.
విద్యార్థుల పేరంట్స్ స్థానికత అనుగుణంగా ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వాలని కోర్టు చెప్పినప్పటికీ, ఆ యూనివర్సిటీ దానిని పరిగణలోకి తీసుకోలేదని, దానివల్ల విద్యార్థిని ఉన్నత చదువుకు దూరమయ్యే కండిషన్ ఏర్పడింది. ఈ విషయం పై తెలంగాణ గవర్నమెంట్ స్పందించాలని కీర్తన పేరెంట్స్ కోరుతున్నారు.