మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో పదకొండు రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో క్వాష్ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ కేసులో చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు సిద్ధార్థ లూథ్రా మరియు హరీష్ సాల్వేలు వాదించారు. వీరిద్దరు పలు పాతకేసులను ఉదహరించడంతో పాటు పలు లాజిక్లను కూడా కోర్టుకి వినిపించారు. మరి వీరిద్దరూ ఎలా వాదించారు? ఏం వాదించారు? అనేది ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం, టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుపై ఏపీ గవర్నమెంట్ పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్పై నిన్న ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, హరీష్ సాల్వేలు మధ్యాహ్నం పన్నెండుగంటల నుంచి 2 గంటల వరకూ వాదనలు వినిపించారు.
ఏపీ హైకోర్టులో హరీష్ సాల్వే వాదించిన విషయాలు..
- హరీష్ సాల్వే వర్చువల్గా తన వాదనలు వినిపించారు.
- చంద్రబాబు నాయుడు అరెస్టులో సరి అయిన రూల్స్ ను పాటించలేదు.
- అలాగే అరెస్ట్ విషయంలో గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు.
- అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారంగా అరెస్ట్ చేసినట్టు చూపించారు.
- ఈ సెక్షన్ ప్రకారం అయితే గవర్నర్ అనుమతి తీసుకున్న తరువాతే పోలీసులు అరెస్ట్ చేయాలి.
- ప్రజాప్రతినిధుల అరెస్టు పై గతంలో ఇచ్చిన తీర్పులు చాలా ఉన్నాయి.
- 2020లో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడును అరెస్ట్ ఎలా చేస్తారు?
- అరెస్ట్ చేసే టైమ్ కి చంద్రబాబు నాయుడి పై ఎఫ్ఐఆర్ లేదు.
- ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తరువాతే అరెస్ట్ చేయాలి.
- చంద్రబాబు నాయుడు అరెస్ట్ 2024 ఎలెక్షన్స్ దృష్టిలో ఉంచుకుని చేశారు.
- ఇదంతా పాలన ప్రతీకారంలా ఉంది.
- సీమెన్స్ కంపెనీ చేసిన మెయిల్ ఆధారంగా ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ కంప్లైంట్ చేశారు.
- స్కిల్ డెవలప్మెంట్లో సేవలను అందించిన కంపెనీ సీమెన్స్ కంపెనీకి చెందిన ఉప కంపెనీయే.
- గవర్నమెంట్ బాధ్యత ఫండ్స్ రిలీజ్ చేయడం, సేవలు పొందడం.
- సిఐడి ఆరోపించినట్టు సాక్ష్యాలను ఎక్కడా తారుమారు చేయలేదు.
- చంద్రబాబు ఈ కేసులో సహకరిస్తున్నప్పటికీ అరెస్ట్కు తొందరపడ్డారు.
- స్టేట్ గవర్నమెంట్ తన అధికారాన్ని పరిధి దాటి ఉపయోగించిన టైమ్ లో కోర్టులు కలిపించుకోవచ్చు .
- ఈ కేసు కేవలం జీఎస్టీ కేసు మాత్రమే, గవర్నమెంట్ కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు.
- ఈ కేసులో హరీష్ సాల్వే అర్ణబ్ గోస్వామి కేసు తీర్పును ఉదహరించారు.
- తేజ్మాల్ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు గురించి హరీష్ సాల్వే ప్రస్తావించారు.
సిద్ధార్థ లూథ్రా వాదనలు.. - చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విధానం పై అభ్యంతరాలున్నాయి.
- ఈ ఎఫ్ఐఆర్ ఒక వేళ 2018 సవరణ కన్నా ముందు రిజిస్టర్ అయ్యి ఉంటే మేము అడిగేవాళ్లం కాదు.
- కానీ ఎఫ్ఐఆర్ 2020లో రిజిస్టర్ అయ్యింది. కాబట్టి అరెస్ట్ చేయాలంటే రాష్ట్ర గవర్నర్ పర్మిషన్ తప్పనిసరి.
- ప్రీవెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ క్రింద ప్రజాప్రతినిధి పై కేసు రిజిస్టర్ చేసే టైమ్ లో గవర్నర్ పర్మిషన్ తప్పనిసరి
- 2020లో టీడీపీ నేత అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన సమయంలో ఇలాగే జరిగింది.
- సిద్ధార్థ లూథ్రా కర్ణాటక కేసును ఉదహరించి, 17Aలో ముందస్తు పర్మిషన్ అవసరమని వాదించారు.Also Read: జైల్లో ఖైదీలకు నంబర్లు ఎలా ఇస్తారు..? చంద్రబాబు నాయుడుకి 7691 అనే నంబర్ ఎలా ఇచ్చారు..?

విజయ్ ఆంటోనీ తన ఫ్యామిలితో కలిసి చెన్నైలో డీడీకే రోడ్డులో నివసిస్తున్నారు. విజయ్ కుమార్తె పేరు మీరా ఆంటోనీ. ఆమె చర్చ్ పార్క్ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. 16 ఏళ్ల మీరా ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు ఆమె గదిలో ఫ్యాన్ కు ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను గమనించిన ఫ్యామిలీమెంబర్స్ సమీపంలోని కావేరీ హాస్పటల్ కి తరలించారు. అయితే అప్పటికే మీరా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు మీరా మృతిని ఆ-త్మ-హ-త్య-గా కేసు రిజిస్టర్ చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటన జరిగిన టైమ్ లో విజయ్ ఆంటోని ఇంట్లో లేరని అంటున్నారు.
మీరా మరణానికి కారణం చదువుల్లో ఒత్తిడి అని తెలుస్తోంది. అయితే ఈ వార్తల పైన, తన కుమార్తె మీరా చనిపోవడం పైన విజయ్ ఆంటోని ఇప్పటి వరకు ఎలాంటి ప్రకనట చేయలేదు. కుమార్తె చనిపోయి, బాధలో ఉన్న విజయ్ ఆంటోనికి ప్రముఖులు, ఫ్యాన్స్ ధైర్యాన్ని చెబుతున్నారు. మీరా మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే గతంలో బలవన్మరణం ఆలోచనల గురించి విజయ్ ఆంటోని మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు బలవన్మరణంకు ఎందుకు పాల్పడుతారు?
అలాంటి థాట్స్ ఎందుకు వస్తాయి అనే విషయం పై మాట్లాడారు. “ఎవరినైనా అతిగా నమ్మి మోసపోవడం, కమిట్మెంట్ ఇచ్చి, ఆ పనిని చేయలేకపోవడం, చదువుకునే పిల్లలకు చదువుల వల్ల కలిగే ఒత్తిడితో ఇలాంటి ఆలోచనలు వస్తాయని చెప్పుకొచ్చాడు. బడి నుంచి వచ్చిన తరువాత పిల్లల్ని ట్యూషన్కి పో అంటూ ఉంటాం. పిల్లలను సొంతంగా ఆలోచించే అవకాశం ఇవ్వడం లేదు. పిల్లలను కొంచెం ఫ్రీగా వదిలేయాలని” చెప్పుకొచ్చాడు. విజయ్ ఆంటోని కూడా తన కుమార్తె చదువు విషయంలో ఒక కామన్ ఫాదర్ లానే ప్రవర్తించాడా? అందువల్లే ఒత్తిడికి గురై ఆమె ప్రాణం తీసుకుందా అని అంటున్నారు.
19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్గా 41 సంవత్సరాల కల్నల్ మన్ప్రీత్ సింగ్ వర్క్ చేస్తున్నారు. బుధవారం నాడు జమ్మూ కశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో రావడంతో వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో కల్నల్ మన్ప్రీత్ సింగ్, డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయూన్, మేజర్ ఆశిష్ ధోంచక్ మరణించారు.
ముగ్గురు అమర వీరుల భౌతిక కాయాలను వారి స్వగ్రామలకు తరలించారు. ఈ క్రమంలో కల్నల్ మన్ప్రీత్ సింగ్ భౌతిక కాయాన్ని పంజాబ్ రాష్ట్రంలోని మల్లాన్పూర్ కు తరలించారు. ఆయన భౌతిక కాయాన్ని చూడడానికి ఇసుక వేస్తే రాలనంత మంది ప్రజలు వచ్చారు. కన్నిటితో కల్నల్ మన్ప్రీత్ సింగ్ అంతిమ సంస్కారాలను జరిపించారు. అయితే ఆయన భౌతిక కాయం వద్ద చోటు చేసుకున్న ఒక సన్నివేశం అక్కడ ఉన్న వారి మనసులను కలిచివేసింది.
కల్నల్ మన్ప్రీత్ సింగ్ ఆరేళ్ళ కుమారుడు కబీర్ ఆర్మీ డ్రెస్ వేసుకుని, కనిపించాడు. అక్కడ ఏం జరిగిందో అర్ధం కానీ చిన్న వయసులో ఉన్న ఆ బాబు తన నాన్న భౌతిక కాయానికి జై హింద్ నాన్న అంటూ చివరిసారి సెల్యూట్ చేశాడు. అన్న సెల్యూట్ చేయడం చూసిన ఆ బాబు చెల్లెలు రెండేళ్ల పాప కూడా సెల్యూట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

1. రిమాండ్ ప్రిజనర్స్ ఈ ఖైదీలకు కేటాయించే నంబర్ రికార్డులో ఆర్.పి. అనే లెటర్స్ తర్వాత ఉంటుంది.
ప్రస్తుతం పైన చెప్పిన నాలుగు కేటగిరీల క్రిందనే ఖైదీలకు నంబర్లు కేటాయిస్తున్నారు. ఇక నంబర్ ఎలా ఇస్తారంటే, జైలు ఏర్పటు చేసినప్పటి నుండి వస్తున్న ఖైదీల క్రమ సంఖ్య ఆధారంగా ఆయా కేటగిరీల క్రింద నంబర్ కేటాయిస్తారని తెలంగాణ జైళ్ల శాఖ మాజీ డిఐజి ఒకరు బీబీసీతో చెప్పారు.
రిమాండ్ ఖైదీ అంటే, ”నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పై తగిన ఆధారం దొరికినపుడు పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో లేదా మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. ఇలా చేయడాన్ని రిమాండ్ అంటారు. కోర్టులో జడ్జి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తే ఆ వ్యక్తిని జైలుకు తరలిస్తారని బీబీసీతో తెలంగాణ హైకోర్టు సీనియర్ లాయర్ చింతపల్లి లక్ష్మీనారాయణ చెప్పారు. చంద్రబాబు నాయుడికి రిమాండ్ ఖైదీ వరుస సంఖ్యను బట్టి 7691 నంబర్ ను కేటాయించారని తెలుస్తోంది.


తక్కువ కాలంలోనే సిటీలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వరలక్ష్మి టిఫిన్స్ ఓనర్ డ్ర-గ్స్ వ్యవహారంలో పోలీసులకు దొరకడంతో స్థానికంగా కలకలం రేపింది. పద్నాలుగు లక్షలు విలువ చేసే డ్ర-గ్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరలక్ష్మి టిఫిన్స్ ఓనర్ ప్రభాకర రెడ్డినే కాకుండా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి గురించిన విషయాలు వైరల్ గా మారాయి. ప్రకాశం జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డి టెన్త్ క్లాస్ లోనే చదువు ఆపేశాడు. ఆ తరువాత 4 చక్రాల బండి పైన రోడ్డు పక్కన టిపిన్స్ సెంటర్ మొదలు పెట్టాడు.
బాగా నడవడంతో తన వ్యాపారాన్ని విస్తరించాడు. ఆ తరువాత 2017లో ప్రకాశం జిల్లా నుండి వ్యాపారం చేయడం కోసం హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాడు. గచ్చిబౌలి లోని డీఎల్ఎఫ్లో వరలక్ష్మి టిఫిన్స్ పేరుతోనే చిన్నగా టిఫిన్ సెంటర్ మొదలుపెట్టాడు. అక్కడి టిఫిన్స్ రుచి, క్వాలిటీ బాగుండటంతో పెద్ద సంఖ్యలో జనాలు వచ్చేవారు. అలా వరలక్ష్మి టిఫిన్స్ ఫేమస్ కావడంతో ఇక్కడి టిఫిన్ కోసం జనాలు క్యూ కట్టేవారు. లాభాలు పెరగడంతో, పలు చోట్ల బ్రాంచీలను మొదలు పెట్టాడు.
వరలక్ష్మి టిఫిన్స్ ప్రస్తుతం సిటీలో 10 బ్రాంచీలు ఉన్నాయి. ఫుడ్ యాప్స్ లో కూడా వరలక్ష్మి టిఫిన్స్ కు మంచి రేటింగ్ ఉంది. ప్రతి సెంటర్ నుండి నిత్యం లక్షల్లో ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది. అలా ప్రభాకర్ రెడ్డి సామాన్యుడి నుండి రోజుకు లక్షకు పైగా సంపాదించే రేంజ్ కి ఎదిగాడు. ఆదాయం బాగా రావడంతో మెల్లగా జల్సాలకు, పబ్ లకు, పార్టీలకు అలవాటుపడ్డాడు. ఆ క్రమంలోనే డ్ర-గ్స్కు, ఇతర వ్యసనాలకు బానిస అయిన ప్రభాకర్ రెడ్డి, పగలంతా వరలక్ష్మి టిఫిన్స్, రాత్రి అయితే డ్ర-గ్స్ దందా చేసేవాడు. ఈ క్రమంలోనే తాజాగా పోలీసులకు పట్టుబడ్డాడు.


పాతబస్తీలో ఉండే లియాఖత్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆదివారం రాత్రి బిర్యానీ తినడానికి పంజాగుట్ట చౌరస్తాలో ఉన్న మెరిడియన్ హోటల్కు వచ్చాడు. రెండు బిర్యానీలు ఆర్డర్ చేసి, తింటూ ఎక్స్ట్రా రైతా కోసం వెయిటర్ను అడిగారు. ఆ వెయిటర్ ఎన్నిసార్లు చెప్పినా తీసుకురాలేదు. దాంతో గట్టిగా అడిగారు. అలా అరిచినందుకు హోటల్ సిబ్బంది లియాఖత్ ను చితకబాదారు. అతని ఫ్రెండ్స్ 100కు కాల్ చేయగా, పోలీసులు వచ్చి, వారిని బయటకు తీసుకొచ్చారు. కానీ హోటల్ సిబ్బంది పోలీసుల ముందే మరోసారి లియాఖత్ మరియు అతని ఫ్రెండ్స్ పై దాడి చేశారు.
ఆ తరువాత పోలీసులు లియాఖత్తో పాటుగా మెరిడియన్ హోటల్ సిబ్బందిని కూడా పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లారు. అయితే సిబ్బంది చేతిలో గాయపడిన లియాఖత్ ఆయాసం వస్తోందని, తనని ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరాడు. కానీ పోలీసులు పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. స్టేషన్ లో లియాఖత్ మాట్లాడుతూనే కుప్ప కూలిపోయాడు. హాస్పటల్ కి తరలించగా, అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
సమాచారం తెలిసిన లియాఖత్ ఫ్యామిలీ మెంబర్స్ హాస్పటల్ కు వెళ్ళి ఆందోళన చేశారు. దాడి జరిగిన వెంటనే పోలీసులు లియాఖత్ హాస్పిటల్కు తీసుకెళ్లకపోవడం వల్లే మరణించాడని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటన పై హత్యనేరం కింద ఆ హోటల్ సిబ్బంది పై కేసు రిజిస్టర్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంజాగుట్ట ఎస్సై శివశంకర్ మరియు హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.