హైదరాబాద్ శివారులో జరిగిన ఘటన చర్చల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే, టీవీ9 తెలుగు కథనం ప్రకారం, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న న్యూ ఎల్బీనగర్ లో, బాలబోయిన కుమార్ కుమార్తె అఖిల ఉంటున్నారు. అఖిల వయసు 22 సంవత్సరాలు. అఖిల ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మే 28వ తేదీన రాత్రిపూట తన ఇంట్లో ఉ-రి వేసుకొని తన ప్రాణాలు తీసుకున్నారు. అందుకు ప్రేమ కారణం అని తెలుస్తోంది. అఖిలని, పోరగంటి ప్రాంతానికి చెందిన అఖిల్ సాయి గౌడ్ అనే అబ్బాయి ప్రేమ పేరుతో వెంటపడ్డారు. ప్రేమ ఒప్పుకోకపోతే చచ్చిపోతాను అని బెదిరించారు.

దాంతో అఖిల, అఖిల్ ప్రేమని ఒప్పుకున్నారు. ఇంట్లో అందరితో మాట్లాడి ఈ విషయాన్ని చెప్పారు. బంధువులందరి ముందు కుటుంబ సభ్యులు కూడా అఖిల ఇష్టాన్ని ఒప్పుకున్నారు. అక్కడి వరకు బాగానే నడిచింది. ఆ తర్వాత అసలు సమస్యలు మొదలు అయ్యాయి. అఖిల్, అఖిలని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. అఖిల్ వల్ల అఖిల చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. రోడ్ మీద అఖిలని ఇబ్బంది పెట్టారు. ఫోన్ లో కూడా మాటలతో ఇబ్బంది పెట్టేవారు అని అఖిల కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం అక్కడ నివసించే వారికి, వారి బంధువులకి తెలిసింది.
దాంతో అఖిల్ ని మందలించారు. వీరి ప్రేమ కొన్ని సంవత్సరాలు నడిచింది. కానీ అఖిల్ ఆ ప్రేమని కాదు అని అన్నారు. పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. ఈ విషయం తెలుసుకున్న అఖిల బాధపడ్డారు. ఆ బాధలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అఖిల తండ్రి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీడిమెట్ల పోలీసులు ఈ విషయం మీద దర్యాప్తు చేస్తున్నారు. అఖిల చనిపోయే ముందు ఒక ఉత్తరం రాశారు. ఆరు పేజీల వరకు ఈ లెటర్ ఉంది. ఈ లెటర్ లో, “నేను నిన్ను చనిపోయేంతవరకు గుర్తుపెట్టుకుంటాను. నువ్వు ఎప్పుడు ఒక చెడ్డ జ్ఞాపకంగానే నాకు గుర్తుంటావు. ఒక పాఠం నేర్పించావు” అని రాశారు.





ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో రాహుల్ గాంధీ ఒకరు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. ఇంత వయసు వచ్చినా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోకపోవడంతో ఆయన పెళ్లి చాలా సార్లు చర్చలు జరిగాయి. ఎందుకు చేసుకోలేదు అంటూ అడుగుతూనే ఉన్నారు. దేశంలోని పలువురు ప్రముఖులు, హీరోయిన్లు సైతం రాహుల్ గాంధీని వివాహం చేసుకుంటాం అని ముందుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇంతగా చర్చకు దారితీసిన పెళ్లి గురించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా సమాధానం చెప్పారు. 2022లో సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 137 రోజుల సుదీర్ఘ పాదయాత్రను శ్రీనగర్లోని చారిత్రాత్మక లాల్ చౌక్లో ముగించారు. ఈ యాత్ర 12 రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు ఐదు నెలల్లో 4,080 కిలోమీటర్లు సాగింది.
ఆ సమయంలో రాహుల్ గాంధీ పూర్తిగా ప్రజల్లో ఉంటూ సామాన్యులను కలిసి మంచి చెడ్డలు తెలుసుకున్నారు. ఆ క్రమంలో కాలేజ్ స్టూడెంట్స్తో కూడా ముచ్చటించారు. అయితే వారిలో ఒక స్టూడెంట్ పెళ్లి గురించి రాహుల్ గాంధీని అడిగారు. ఆ ప్రశ్నకు ‘తన పనులు మరియు పార్టీ పనుల్లో పూర్తిగా నిమగ్నం అయినందువల్ల వివాహం గురించి ఆలోచించలేదని రాహుల్ గాంధీ వెల్లడించారు.





