భారత దేశంలోనే కాకుండా ప్రపంచ మొత్తంలో కూడా ఉన్న బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఒకటి తాజ్ మహల్. తాజ్ మహల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. షాజహాన్ తనకి ముంతాజ్ పై ఉన్న ప్రేమకు గుర్తుగా ఈ తాజ్ మహల్ నిర్మించారు. వేరే దేశంలో ఉన్న వాళ్లకు కూడా భారతదేశం అంటే టక్కున గుర్తుకు వచ్చేది తాజ్ మహల్.
అందుకే ఎన్నో దేశాల నుండి ఎంతో మంది ప్రజలు తాజ్ మహల్ ని చూడడానికి వస్తూ ఉంటారు. ఏ రోజైనా సరే తాజ్ మహల్ దగ్గర సందర్శకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? రాత్రి పూట తాజ్ మహల్ లో లైట్ లు ఉండవు. అందుకు ఒకటి కాదు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే.
# తాజ్ మహల్ మార్బుల్ తో తయారు చేశారు. ఇది మనందరికీ తెలుసు. అయితే చంద్రుడి నుండి వచ్చే లైట్ తాజ్ మహల్ లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే తాజ్ మహల్ లో ప్రత్యేకంగా లైట్ అవసరం లేదు.
# అంతే కాకుండా రాత్రిపూట లైట్ వేసి ఉంచితే తాజ్ మహల్ కి సందర్శకులు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి.
# లైట్స్ వేయడం వలన పురుగులు వస్తాయి. అవి ఎక్కువగా తిరిగి నేలపై ఏమైనా వేయడం వలన మార్బుల్ నేల రంగు మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తాజ్ మహల్ లో కొన్ని చోట్ల ఇలా పురుగుల వల్ల మార్బుల్ గ్రీన్ కలర్ లో మారింది.
# కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశ ప్రభుత్వం తాజ్ మహల్ కి లైట్లు ఏర్పాటు చేసింది. కానీ ఏర్పాటు చేసిన రోజు రాత్రి ఆ లైట్లు అన్ని పేలిపోయాయి. ఇది ఏమైనా ఎలక్ట్రికల్ సమస్య ఏమో అని యాజమాన్యం కూడా అంత సీరియస్ గా తీసుకోలేదు.
రెండవ సారి ఎలక్ట్రిసిటీ అంతా కరెక్ట్ గా చెక్ చేసి అప్పుడు మళ్ళీ లైట్లు ఏర్పాటు చేశారు. కానీ రెండో సారి కూడా మొదటిసారి జరిగిందే రిపీట్ అయ్యింది. ఇలా ఎందుకు అయ్యిందో ఎవరికీ తెలియదు. కొంత మంది మాత్రం ఏవో తెలియని శక్తులు ముంతాజ్ ఆత్మని కాపాడుతున్నాయి అని అంటారు. కానీ ఇది ఎంత వరకు నిజమో ఎవరికీ తెలియదు.
# లైటింగ్ అనేది తాజ్ మహల్ సర్ఫేస్ పై ప్రభావం చూపుతుంది. పర్యావరణంలో ఏర్పడిన పొల్యూషన్ ఇప్పటికే తాజ్ మహల్ పై ఎంతో ప్రభావం చూపింది. కాబట్టి ఇంక వేరే ఏ విధంగా అయినా కూడా సరే తాజ్ మహల్ కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని యాజమాన్యం అనుకున్నారు.
తాజ్ మహల్ లో రాత్రి పూట లైట్ లు ఉండకపోవడానికి కొన్ని కారణాలు ఇవే.