రైలు ప్రయాణాలు మనకి కొత్తేమి కాదు. ఎంతో హుషారు గా కిటికీ పక్కన కూర్చుని రైల్లో వెళ్ళడానికి మనందరం ఇష్టపడతాం. అదే సమయం లో రైలు పట్టాలకు పక్కాగా ఓ అల్యూమినియం బాక్స్ ఉంటుంది. దీనిని ఎప్పుడైనా గమనించారా..? ఈ బాక్స్ లు ఏమిటి..? వాటిని ఎందుకు ఉపయోగిస్తారు అన్న విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మనం రోబో సినిమా చూసాం కదా. అందులో రోబోట్ ట్రైన్ లో ఫైట్ చేస్తున్న సమయం లో ఛార్జ్ అయిపోతుంది. అదే టైం లో రైలు పట్టాల పక్కన పడిపోయిన రోబో అల్యూమినియం బాక్స్ లో నుంచి ఓ వైర్ ను తీసుకుని ఛార్జింగ్ పెట్టుకున్నట్లు చూపిస్తారు. సినిమా కోసం ఈ బాక్స్ ని అలా వాడినప్పటికీ.. అసలు ఈ బాక్స్ లను వేరే అవసరం కోసం పెట్టారు. ఈ అల్యూమినియం బాక్స్ లను ఆక్సిల్ కౌంటర్లు అంటారు. ఇందులో కమ్యూనికేషన్ కేబుల్స్ ఉంటాయి. ఇవి వచ్చి పోయే రైళ్ల సమాచారాన్ని రైల్వే డిపార్ట్మెంట్ కు అందిస్తాయి. రైలు పట్టాలకు పక్కాగా.. ప్రతి ఐదు, ఆరు కిలోమీటర్లకు ఒక చోట ఈ బాక్స్ లను ఏర్పాటు చేస్తారు. వీటిని లొకేషన్ బాక్స్ లు అని కూడా పిలుస్తారు.

ఈ బాక్స్ లు వచ్చి పోయే రైళ్ల సమాచారాన్ని గుర్తించగలుగుతాయి. ఇవి ఎలా పని చేస్తాయో ఓ సారి చూద్దాం. ఈ అల్యూమినియం బాక్స్ లను తెరిచి చూస్తే, అందులో ఒక డివైస్ ఉంటుంది. ఈ డివైస్ కు రైలు పట్టాల మధ్య ఉండే మరో డివైస్ తో వై-ఫై కనెక్షన్ ను కలిగి ఉంటుంది. రైలు పట్టాల మధ్య ఉండే డివైస్ పట్టాల మీదనుంచి రైళ్లు వెళ్ళినపుడు ఆ రైలు కు ఎన్ని బోగీలు ఉన్నాయో గుర్తిస్తుంది. సాధారణం గా రైలు చక్రాలకు మధ్య ఆక్సిల్స్ ఉంటాయి. ఇలా ఒక్కొక్క బోగీకి నాలుగు ఆక్సిల్స్ ఉంటాయి. ఈ లెక్కన ఒక రైలు కు పది బోగీలు ఉన్నాయనుకుంటే.. ఆ రైలు కు నలభై ఆక్సిల్స్ ఉన్నాయని అర్ధం.

రైలు పట్టాలకు అమర్చబడిన డివైస్ లు ఈ ఆక్సిల్స్ ను కౌంట్ చేసి, ఆ సమాచారాన్ని లొకేషన్ బాక్స్ కు పంపిస్తుంది. ఈ ఆక్సిల్స్ ను బట్టి ఎన్ని బోగీల రైలు పట్టాల మీద నుంచి వెళ్ళింది అనే సమాచారాన్ని ఈ అల్యూమినియం బాక్స్ సేకరిస్తుంది. ఈ సమాచారాన్ని.. మరో ఐదు, ఆరు కిలోమీటర్ల దూరం లో ఉన్న అల్యూమినియం బాక్స్ కి పంపిస్తుంది.

ఆ అల్యూమినియం బాక్స్ కూడా ఇదే విధం గా ఎన్ని బోగీలు వెళ్ళాయో సమాచారం సేకరిస్తుంది. ఒకవేళ రావాల్సిన బోగీల కంటే తక్కువ బోగీలు వస్తే.. వెంటనే ఈ సమాచారం రైల్వే అధికారులకు వెళ్ళిపోతుంది. వెంటనే వారు, ఏ రైలు కు బోగి మిస్ అయిందో గుర్తించి ఆ రైలుని తరువాత స్టేషన్ లో ఆపివేస్తారు. క్షేత్ర పర్యటన చేసి సమస్య ఎక్కడ ఉందొ తెలుసుకుని పరిష్కరిస్తారు.

అన్ని రైళ్లను భద్రం గా నడపడం కోసమే.. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఈ లొకేషన్ బాక్స్ ల వ్యవస్థ రైలు ప్రమాదాలను గుర్తించడం లో రైల్వే అధికారులకు ఎంతగానో సాయం చేస్తుంది.

















చిటికెన వేలు అయితే వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతలను ఎంతో క్లియర్ గా చెబుతుందని అంటున్నారు. చిటికెన వేలు, ఉంగరం వేలు మధ్య ఖాళీ ఉంటే, వీరు చేసే పనులలో చాలా స్వతంత్రంగా ఉంటారట. ఈ వేళ్ళ మధ్య గ్యాప్ వల్ల చిటికెన వేలు మిగతా నాలుగు వేళ్ళకు దూరంగా ఉంటుంది. అలాగే ఆ వ్యక్తులు కూడా అందరిలో ఒకరిగా కాకుండా స్వతంత్ర ఉండేట్టు నిర్ణయాలు తీసుకుంటారు. ఎలాంటి విషయాలలోనైనా ఈ వ్యక్తులు స్వంతంగా ముందుకు వెళతారు.
ఈ వ్యక్తులు కొంత వ్యక్తిగత మరియు స్వతంత్ర మార్గంలో స్వీయ వ్యక్తీకరణకు బలమైన అంతర్గత అవసరాన్ని కలిగి ఉంటారు. అయితే చిటికెన వేలు ఉంగరపు వేలును తాకినట్లయితే అంటే గ్యాప్ ఎంత తక్కువగా ఉంటే, ఆ వ్యక్తి ఎదుగుదలను అతని పైన వారు అంత ఎక్కువగా నిరోధిస్తుంటారట.
వీరు జీవితంలో ఏ విషయాన్ని అయినా వ్యక్తం చేయడానికి ఇబ్బంది పడుతుంటారట. అయితే ఆడవారికి చిటికెన వేలు మరియు ఉంగరం వేలు మధ్యన గ్యాప్ ఉంటే వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీరు అధికారం చెలాయించే పొజిషన్ లో ఉంటారని నిపుణులు చెబుతున్నారు.














