పెళ్ళిలో, ఫంక్షన్ హాల్, భోజనాలు, మిగిలిన ఏర్పాట్లు, పెళ్లి జరిగే స్థలం, ఇలా వీటన్నిటితో పాటు, ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేది వెడ్డింగ్ కార్డ్. వెడ్డింగ్ కార్డ్ చాలా సింపుల్ గా ఉంటూనే, వివరాలు అన్ని తెలియజేసేలాగా ఉండాలి. అందుకే పెళ్లి కార్డ్ చాలా క్రియేటివ్ గా ఉండడంతో పాటు, ముఖ్యమైన సమాచారాన్ని కూడా ఇచ్చేలాగా ఉండాలి అని చాలా మంది డిజైన్ చేస్తారు. ఈమధ్య ఇందులో చాలా రకమైన వెరైటీలు వచ్చాయి. కొన్ని ఆన్ లైన్ లోనే పంపిస్తున్నారు. దూరంగా ఉన్న వాళ్ళకి వెడ్డింగ్ కార్డ్స్ పంపించడం కష్టం. ఈ కారణంగానే వాట్సాప్ లో పంపించేలాగా వెడ్డింగ్ కార్డ్స్ డిజైన్ చేస్తున్నారు. ఇంకొంత మంది అయితే వెడ్డింగ్ కార్డ్ తో పాటు గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. ఇటీవల కాలంలో అది చాలా మంది చేస్తున్నారు.

ఇంకా కొంత మంది అయితే ఒక వెడ్డింగ్ కార్డ్ ని బాక్స్ లో పెట్టి ఇస్తున్నారు. వెడ్డింగ్ కార్డ్ తో పాటు ఇంకా కొన్ని వస్తువులు కూడా ఇందులో పెట్టి ఇస్తున్నారు. సెలబ్రిటీలు ఇలాగే చేస్తున్నారు. ఒక బాక్స్ లో వెడ్డింగ్ కార్డ్ తో పాటు, డ్రై ఫ్రూట్స్, సెంటెడ్ కాండిల్స్ కూడా ఇస్తున్నారు. వీటితో పాటు ఇంక ఎవరి అభిరుచికి తగ్గట్టు వారు కొన్ని గిఫ్ట్ లు కూడా ఇస్తున్నారు. అయితే, ఇటీవల ఒక పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఈ వెడ్డింగ్ కార్డ్ లో, అమ్మాయి పేరు 16 దేవతల పేర్లు కలిసి వచ్చేలాగా పెట్టారు.
ఆ అమ్మాయి పేరు, వీర వెంకట సత్య నాగలక్ష్మి దుర్గా వాసవి లలితా పార్వతీ రాణి సీతా కామాక్షి మాణిక్య కాళీ అచ్యుత భైరవీ ఆకాంక్ష. ఈ పేరుని వెడ్డింగ్ కార్డ్ లో ప్రచురించారు. ఈ పేరు సరిగ్గా గమనిస్తే ఇందులో 16 దేవతల పేర్లు ఉంటాయి. సాధారణంగా పేర్లలో దేవుళ్ల పేర్లు పెడతారు. దేవతల పేర్లు కూడా పేర్లలో పెట్టి నామకరణం చేస్తారు. కానీ 16 దేవతల పేర్లు పెట్టడం మాత్రం ఇదే మొదటిసారి ఏమో. ఈ వెడ్డింగ్ కార్డ్ ని కోరాలో వెంకటరమణ సూరంపూడి గారు షేర్ చేశారు. పెళ్లి కూతురుకి 16 పేర్లు దేవతల పేర్లు పెట్టారు అని వెడ్డింగ్ కార్డ్ ని షేర్ చేశారు.









1594లో 4వ ఖలీఫా హజరత్, హైదర్ అలీ పేరిట ఈ నగరంను నిర్మించాడు. ఉద్యాన వనాలు, సరస్సులకు హైదరాబాద్ పేరు గాంచింది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే హైదరాబాద్ అన్ని రకాల వసతులు ఉన్న రాజదాని. అప్పటికే శాసనసభా భవనం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, విమానాశ్రయం వంటి అనేక సౌకర్యాలు ఏర్పడి ఉన్నాయి.
1956లో భాషల వారీగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినపుడు, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు మాట్లాడే భాషల వారిగా, తెలుగు ప్రాంతం తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్లో, మరాఠీ ప్రాంతం మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే ప్రాంతం కర్ణాటకలో విలీనం చేశారు.అల ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరబాద్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర రాజధానిగా మారింది. అయితే భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు హైదరాబాద్ రాష్ట్రం సకల వసతులతో ఉండేది.అప్పటి హైదరాబాద్ యొక్క అరుదైన ఫోటోలను ఇప్పుడు చూద్దాం..
#3 హైదరాబాద్ నగరానికి ప్రవేశ వంతెన..
#4 నిజాం వ్యక్తిగత ఏనుగు
#5 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, రాయల్ బాక్స్ నుండి (బహుశా పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్లో) దళాల కవాతు
#6 నిజాం గార్డ్ కట్టు
#7 నిజాం చౌమహేల ప్యాలెస్
#9 చౌమహేల ప్యాలెస్ లోపలి భాగం
#10 మక్కా మసీదు
#11 మోజమ్ జాహీ మార్కెట్ప్లేస్ భవనం
#12 హైదరాబాద్ రాజకుటుంబానికి చెందిన ప్యాలెస్
#13 చార్మినార్:











