తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బర్రెలక్క చాలా సెన్సేషన్ సృష్టించింది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి ఎమ్మెల్యేగా నిలబడి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే బర్రెల కి కేవలం 5000 పైబడి ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా కూడా తాను బాధపడటం లేదని తనకి సపోర్ట్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతుంది. అయితే ఇప్పుడు బర్రె లెక్కని పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ వైసిపి నాయకులు కామెంట్లు చేస్తున్నారు. నేరుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి బర్రెలక్కకి వచ్చిన ఓట్లు కూడా జనసేన అభ్యర్థులకు రాలేదంటూ వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు విన్న బర్రె లెక్క స్పందించింది తాను స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమానిని అని, పవన్ కళ్యాణ్ ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజల కోసం కష్టపడుతున్నారని ఆయనే తనకి స్ఫూర్తి అంటూ చెప్పుకొచ్చింది. వైసిపి నాయకులు పవన్ కళ్యాణ్ అని తనతో పోల్చడం బాధిస్తుందని అంది. యువత రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు తనని చాలా ప్రభావితం చేశాయని అంది.
ఎవరి పవర్ వాళ్ళదని, నా పవర్ నాది పవన్ కళ్యాణ్ పవర్ పవన్ కళ్యాణ్ ది, ఆయనని తక్కువ చేయడం కోసం నాతో పోల్చడం సరికాదు అని మాట్లాడింది. బర్రెలక్కకి ఉన్న కామన్ సెన్స్ కూడా వైసిపికి నాయకులకు లేదంటూ జనసేన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.







డీఎస్పీ నళిని తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఉద్యమం చేసేవారి పై లాఠీ ఎత్తలేను అంటూ తన ఉద్యోగాన్ని వదిలేసింది. మేర వర్గానికి చెందిన నళినికి వివాహం జరిగి, అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఢిల్లీలో సైతం దీక్షలు చేసింది. రాజీనామా చేసిన తరువాత ఆమె కనిపించలేదు. కొత్త ప్రభుత్వం రావడంతో నళినిని తిరిగి జాబ్ లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతూ సామజిక మధ్యమాలలో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఉద్యోగానికి రిజైన్ చేసిన నళినికి డీఎస్పీ పోస్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే విధులకి తీసుకోవాలని సీ.ఎస్ మరియు డీజీపీలను ఆదేశించారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, 2009 డిసెంబర్ 9న నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. నాటి సీఎం రోశయ్య గారు మహిళ దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే ,నేను రాజీనామాను విత్ డ్రా చేసుకొని డిపార్ట్మెంట్ లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యురోక్రసిపైనే నమ్మకం పోయేలా చేశాయి.
తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి, సోనియా గాంధీజీకి లేఖలు రాసి నా పరిస్థితిని, రాష్ర్ట దుస్థితినీ వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్ళీ పాల్గొనడం అనివార్యం అనిపించింది. అందుకే 1.11.2011 న ఫార్మాట్ లో డీజీపీకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్ళాను. శ్రీ కృష్ణ కమిటీ ప్రభావంగా జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హై లైట్ చేశారు. ఆ నాడే నాకు డిపార్ట్మెంట్ పట్ల ఏహ్య భావం కలిగింది.
ఉద్యమములో నేను నిర్వహించిన కీలక మైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది.కాని నా బంధు మిత్ర పరివారం మాత్రం అందరూ నన్ను వెలివేశారు. ఏకాంతవాసం అనే శిక్షను 10 ఏండ్లు అనుభవించా. పర్యవసానంగా ఇల్లు,కుటుంబం,ఆరోగ్యం,మనశ్శాంతి అన్నీ కోల్పోయాను. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను.జీవచ్చవం లా బతికాను. రెండేండ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు.వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు.అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను.
అన్ని దానాల్లో గొప్పదైన విద్యా దానాన్ని చేస్తూ, పుణ్యం మూటకట్టుకోవాలనే కోరిక తప్ప నాకు ఇంకేమీ లేదు. పరమేశ్వరుడు నన్ను క్రిమినాలోజీ( న్యాయ దర్శనం) నుండి ఫిలాసఫీ( తత్త్వ శాస్త్రం) వైపు నడిపించాడు. గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు.నా వాణి లో మాధుర్యం నింపి నన్ను ఆచార్య ను చేశాడు. నా ఈ ప్రస్థానం (డీఎస్పీ నుండి డిఎన్ఎ గా మారడం) చాలా సంఘర్షణ మయం, వేదనా భరితం. నన్ను ఈ ఉద్యోగం నుండి ఎవరూ సస్పెండ్ చేయలేరు.నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు.కాబట్టి అంతిమంగా నేను సీఎంగా మిమ్మల్ని కోరేది ఏమిటంటే నా పై కరుణ చూపి స్టేటస్ కో కు అనుమతించండి.
నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్మెంట్ లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి.మీలో మంచి స్పార్క్ ఉంది.మీ నుండి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తుంది. మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువైంది. కాబట్టి నాలో లోకేషన, విత్తేషనలు కూడా పోయాయి. ఇక నాకు మీరు న్యాయం చేయాలి అంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ , సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను.
( నేను మిమ్మల్ని కలవాలి. కాని ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలాలైన ‘వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నాను. హిందీ ప్రూఫ్ చూసే పనిలో బిజీ గా ఉన్నాను. మహర్షి 200 వ జయంతి వరకు అది సిద్ధం కావాలి.సమయం ఎక్కువగా లేదు.అందుకే అది అయిపోగానే దాన్ని ప్రింటింగ్ కు ఇచ్చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఈ లోగా మీడియా మిత్రులు నా ప్రతిస్పందన తెలుసుకోవాలి అని ఇంటర్వ్యూ అడుగుతున్నారు. అందుకే ఇలా నా ఫేస్బుక్ లో బహిరంగ లేఖ రాయాల్సి వస్తుంది)” అంటూ రాసుకొచ్చారు.
ప్రజా భవన్గా వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి భారీ స్పందన వస్తున్న విషయం తెలిసిందే. తమ సమస్యలను చెప్పుకోవడానికి శుక్రవారం నాడు భారీగా ప్రజలు తెల్లవారక ముందే ప్రజా భవన్కు వచ్చారు. దాంతో ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన వారిలో మహిళా హోంగార్డు మామిడి పద్మ కూడా ఉన్నారు. గత ప్రభుత్వం ఉన్న సమయంలో తన ఉద్యోగం పోయిందని, దానిని తిరిగి ఇప్పించమని అడగడానికి ఆమె ప్రజా దర్బార్ కి వచ్చారు.
ఉద్యోగం పోవడంతో జీవనోపాధి లేకుండా పోయిందని, దాంతో కుటుంబ పోషణ కూడా భారమైందని, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నందున తనకు మళ్లీ హోంగార్డు ఉద్యోగం ఇప్పించాలని ఆఫీసర్లను వేడుకుంటున్నారు. 2016లో తమ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగానికి భద్రత ఏర్పరచాలనే డిమాండ్తో హోంగార్డులందరు స్ట్రైక్ చేశారు. వారిలో గోదావరిఖనికి చెందిన మామిడి పద్మ కూడా ధర్నాలో పాల్గొని గత ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. అందుకు ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోయింది. భర్త వదిలేయడం, ఉద్యోగం పోవడంతో ముగ్గురు పిల్లలను పోషించడం ఆమెకు సమస్యగా మారింది. తన జాబ్ ను తిరిగి ఇప్పించమని సీపీ, డీజీపీ, హోంమినిస్టర్ ను వేడుకున్నారు.
మామిడి పద్మ 2009లో వేములవాడలో హోంగార్డుగా జాయిన్ అయ్యారు. రెండేళ్ళ తర్వాత కరీంనగర్, గోదావరిఖనికి ట్రాన్స్ఫర్ పైన వెళ్లారు. తమ జీతాలు పెంచడంతో పాటు, ప్రతినెలా జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ 7 ఏళ్ళ క్రితం ఇతర జిల్లాల నుండి వచ్చిన హోంగార్డులు గాంధీ ఆస్పత్రి దగ్గర ధర్నా చేశారు. దీనిలో పాల్గొన్నందుకు మామిడి పద్మ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. తన బాధను చెప్పుకోవడానికి ప్రజాదర్బార్కు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన ఉద్యోగాన్ని మళ్ళీ ఇప్పించాలని వేడుకున్నారు.


ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా తెలంగాణ భవన్ నుండి సీఎం రేవంత్ రెడ్డికి భోజనం వచ్చిందట. ఆ విషయాన్ని ఆయన ఇంట్లో పనిచేసే వంట మనిషి రేవంత్ రెడ్డికి చెప్పారట. ఆ విషయం విన్న ఆయన ఇలా అయితే పనిలో నుంచి నిన్ను తీసేయాల్సి వస్తుందని తన వంట మనిషికి వార్నింగ్ ఇచ్చారట. ప్రోటోకాల్ వంటివి వద్దని, తాను ఇంటి భోజనమే తింటానని, ఎప్పటిలాగే చేయమని తన వంట మనిషికి చెప్పారంట.



