ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో ఉన్న భువనేశ్వరిని కలిసి మనోధైర్యాన్ని ఇవ్వడానికి పార్టీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపట్టాయి. దాంతో వారికి నోటీసులు అందాయి.
కానీ ఇలా చేయడంలో తప్పు ఏంటి అని ప్రశ్నించారు. భువనేశ్వరిని కలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు జారీ చేశారు. దాంతో ఈ విషయం మీద భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన పోస్టులో భువనేశ్వరి నోటీస్ కూడా షేర్ చేస్తూ ఈ విధంగా రాశారు.

భువనేశ్వరి ఈ విషయం మీద ఈ విధంగా రాశారు. “చంద్రబాబుగారికి మద్దతుగా, రాజమండ్రిలో ఉన్న నన్ను కలిసి నాకు మనోధైర్యాన్నిఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావయాత్ర చేపడితే అందులో తప్పేముంది? పార్టీ కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వాళ్ళు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏంటి?”

“ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కెక్కడిది?” అని భువనేశ్వరి అన్నారు. అలాగే పోలీస్ నోటీసు కూడా ఇందులో షేర్ చేశారు. ఈ పోలీస్ నోటీసులో, “17వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగుతున్న రాజమండ్రి నందు జరగబోవు చలో సోలిడారిటీ టు నారా భువనేశ్వరి అట్ సెంట్రల్ ప్రిజన్ కార్యక్రమానికి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు.”

“కావున మీరు టిడిపి పార్టీ కార్యకర్త అయినందున 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగు రాజమండ్రి నందు జరగబోవు చలో సోలిడారిటీ టు నారా భువనేశ్వరి అట్ సెంట్రల్ ప్రిజన్ జరగబోవు చలో రాజమండ్రి కార్యక్రమానికి వెళ్లడానికి వీలు లేదు. అందుకు విరుద్ధంగా మీరు ప్రవర్తించిన ఎడల అట్టి వారిపై పోలీసు వారు తీసుకునే చట్టపరమైన చర్యలకు అర్హులవుతారు అని తెలియజేయడమైనది.” అని ఆ నోటీసులో ఉంది. ఇదే విషయాన్ని నారా భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ALSO READ : నాని “హాయ్ నాన్న” టీజర్లో… మైనస్ అయిన విషయం ఇదేనా..?


తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎలెక్షన్స్ కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలోని హామీలలో ఒకటైన ఆసరా పెన్షన్ను కూడా పెంచుతున్నట్టు ప్రకటించారు. రూ. 2016 గా ఉన్న పెన్షన్ను ఐదు వేలకు పెంచుతామని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 3000కు పెంచుతామని, ఆ తరువాత ఏడాది ఐదు వందల చొప్పున పెంచుకుంటూ, చివరి ఏడాది వచ్చే వరకు ఐదు వేలు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ మాట్లాడుతూ, ఇదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పింఛన్ పథకాన్ని సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. తాము ప్రకటించినపుడే, 2 వేల పింఛన్ను ప్రకటించి, సంవత్సరానికి 500 చొప్పున పింఛన్ను పెంచుతూ, ప్రస్తుతం మూడు వేలు ఇస్తున్నారని వెల్లడించారు.
ఈ పథకాన్ని విజయవంతంగా ఏపీ ప్రభుత్వం అమలు చేసిందని, తాము కూడా అదే పద్ధతిలో ఈ పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.తమ పథకాల అమలులో దేశానికి తెలంగాణే ఆదర్శంగా నిలిచిందని ప్రతిసారి చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్, తానే స్వయంగా, ఏపీ గవర్నమెంట్ ని ప్రశంసించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఫాలో కానున్నట్టుగా కూడా ప్రకటించారని తెలుస్తోంది.
బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. అయితే బండ్ల గణేశ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను దైవంగా భావిస్తారు. ఆ విషయాన్ని పలు ఈవెంట్స్ లో ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ తాజాగా వార్తల్లో నిలిచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శల పై స్పందిస్తూ సోషల్ మీడియా ఎక్స్ లో వీడియోని పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో ” నమస్కారం, నిన్నటి నుంచి మనసులో ఒకటే వేదన, ఒకటే బాధ, ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే, నా బతుకు ఎందుకా? అని నాకే అనిపిస్తుంది. చిరాకు వేస్తోంది. నిన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ఇష్టుడు, దైవసమానులు అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. సార్ మీరు పెద్ద హోదాలో ఉన్నారు. భగవంతుడు మీకు అద్భుతమైన హోదాను ఇచ్చారు. కానీ, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి నేను, మీకు చెప్తాను.
నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు, దశాబ్దాల పాటు ఆయనతో తిరుగుతున్నాను. ఆయన చాలా నిజాయితీపరుడు, నీతివంతుడు. ఎవరు కష్టాల్లో ఉన్నా, ఆ కష్టం నాదే అని ముందుకెళ్ళే వ్యక్తి, భోళా మనిషి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీరు మాట్లాడుతున్నారు. జీవితంలో కొందరికి కొన్ని చేదు సంఘటనలు జరుగుతాయి. అది కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగినవే, అని నేను భావిస్తున్నాను. ఉరికురికే అదొక్కటే రీజన్, మరొకటి లేదా, పదే పదే అదే విషయం మాట్లాడటం, చాలా బాధ పడుతూ చెప్తున్నాను. మీకు విన్నవిస్తున్నాను.
పవన్ కళ్యాణ్ సమాజం కోసం ఉపయోగపడే మనిషి. దేశం కోసం బతుకుతున్న మనిషి. ఏ రోజు స్వార్ధంతో కానీ, స్వలాభంతో కానీ ఏ పని చేయడు, అలా మాట్లాడటం కానీ, ఆయన మాటల్లో, చేతల్లో కానీ చూడలేదు. హాయిగా షూటింగ్లు చేసుకుంటూ, సూపర్ స్టార్ హోదాను అనుభవిస్తూ, హాయిగా బ్రతకండి అని చెబుతూండేవాన్ని.వెయ్యేళ్లు బ్రతుకుతామా, మనం పోయినా కూడా జనం మనల్ని గుర్తుపెట్టుకోవాలని, జనానికి ఏదైనా చేయాలని అనేవారు. ఆయన ఆలోచనలన్నిటిని నీతిగా, నిజాయితీగా అడుగాడుగు పేర్చుకుంటూ, భరిస్తూ, సహిస్తూ తలవంచుకుని జనం కోసం బ్రతకాలని, రాత్రిపగలు కష్టపడుతున్నాడు.
నిస్వార్ధంగా కష్టపడుతున్నాడు. రాత్రిపగలు షూటింగ్స్ చేసి ఆయన సంపాదించిన డబ్బుని పార్టీకి ఖర్చు పెడుతున్నాడు. ఎవరి దగ్గరా, ఏ విధంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, పార్టీని నడుపుతున్న మహానుభావుడు. దయచేసి, ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏమిటో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా, కష్టంలో ఉన్నా అంటే సహాయం చేస్తాడు. ఆయనకు లేనిది ఒకటే కులాభిమానం. భారతీయులంతా ఒక్కటే, మనం మనుషులం, మనుషులుగానే బ్రతకాలని చెప్పేవారు.
ఆయనకు గాని కుల పిచ్చి ఉంటే నన్ను ఆదరించేవాడా? నాకీ హోదా ఇచ్చేవాడా? నేను అనుభవిస్తున్న ఈ స్టేటస్ మొత్తం ఆయన పెట్టిన భిక్షే. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా, దయచేసి, తెలిసి తెలియకుండా, పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిని, మనసున్న వ్యక్తి పై అభాండాలు వేయకండి. నేను జనసేన వ్యక్తిని కాదు, కార్యకర్తని కాదు. పవన్ కళ్యాణ్ అభిమానిని, పవన్ కళ్యాణ్ నిర్మాతని, పవన్ కళ్యాణ్ మనిషిని” అంటూ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ను ఐటీ ఉద్యోగులు దగ్గర నుండి ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా ఖండిస్తూ వచ్చారు. నందమూరి కుటుంభ సభ్యులు కూడా స్పందించారు. అయితే ఈ విషయం పై ఆ కుటుంబంలోని జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి స్పందన రాకవపోవడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేసిన తారక్, కొంతకాలం నుండి పార్టీకి దూరంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్పై ఎలాంటి ప్రకటన చేయలేదని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉండడం పై పార్టీ నాయకుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఎన్టీఆర్ కి మద్ధతుగా మాట్లాడుతున్నారు.
తాజాగా ఈ విషయం పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండడం గురించి అడుగగా, రాజీవ్ కనకాల మాట్లాడుతూ, “ఎన్టీఆర్ స్పందించకపోవడానికి రీజన్ సినిమాలతో బిజీగా ఉండడమే కారణం” అని తాను అనుకుంటున్నట్లుగా తెలిపారు.
“ఆర్ఆర్ఆర్ మూవీ, ఆ తరువాత కరోనా, ఈ విరామంలో ఎన్టీఆర్ కనీసం 4 చిత్రాలు అయినా చేసేవారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీలో నటిస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ మీద దృష్టి పెట్టారని, పూర్తి సమయాన్ని దేవర కోసం కేటాయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ దృష్టి మొత్తం చిత్రాలపైనే పెట్టాలని అనుకుని ఉండొచ్చని తాను భావిస్తున్నట్టు” గా రాజీవ్ కనకాల తెలిపారు.
రజాకార్ సినిమాను యాటా సత్యనారాయణ తెరకెక్కిస్తుండగా, బిజీపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణలో ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న వేళ ఈ చిత్రం కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్కు రాలేదంటూ ఈ టీజర్ ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ సంస్థానంలో రజాకర్లు హిందువులను ఇస్లాంలోకి మార్పించి, ముస్లిం రాజ్యంగా చేయాలనే ఉద్దేశ్యంతో చేసిన దారుణాలను, అరాచకాలను తెరకెక్కించినట్టుగా చూపించారు.
ఈ టీజర్ చూసిన మత పెద్దలు, నెటిజన్లు, రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ టీజర్ మొత్తంలో రజాకార్ల పేరుతో ముస్లింలనే లక్ష్యంగా చేస్తూ, వారిని చెడ్డగా చూపించేందుకు ప్రయత్నం చేశారని అంటున్నారు.చరిత్రను వక్రీకరించి కొందరు ఈ మూవీని తీశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వార్థ రాజకీయా ప్రయోజనాల కోసం, తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు.
సీపీఎం పార్టీ లీడర్లు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ లీడర్ల సారథ్యంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలు మరియు భూస్వాముల మధ్య జరిగిన సాయుధ పోరాటానికి, కొందరు కులం, మతం రంగును అద్దుతున్నారని, ఎలక్షన్స్ సమయంలో ఇలాంటి చిత్రాలు రిలీజ్ అయితే ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభేదాలు ఏర్పడతాయని, అందుకే ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.











ఏం చేయవచ్చు..
ఏం చేయకూడదు..