IPL 2022 ఎలిమినేటర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా మారింది. తేలికపాటి జల్లు రావడంతో టాస్ కూడా ఆలస్యం చేశారు ఎంపైర్లు. ఆ తర్వాత వర్షం కొద్ది కొద్దిగా ఎక్కువ అయింది..
చిన్న తుంపరలు పడుతున్నాయని కేవలం పీచ్ ను మాత్రమే కవర్లతో కప్పారు. పెద్ద వర్షం గా మారడంతో స్టేడియం మొత్తం కవర్లతో నింపేశారు. లీగ్ స్టేజ్ లో లక్నో సూపర్ జెంట్స్ 9 మ్యాచ్లు విజయం సాధించగా బెంగళూరు 8 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది.
ఈ సందర్భంలో మ్యాచ్ రద్దు అయితే మాత్రం ఎక్కువ విజయాలు అందుకున్న లక్నో సూపర్ జెంట్స్ రెండవ క్వాలిఫైయర్ కు అర్హత పొందుతుంది. కానీ అంత ఈజీగా లక్నోకు లైన్ క్లియర్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కోల్కత్తాలో ముందుగానే వర్షాలను అంచనా వేసిన బీసీసీఐ, ప్లే ఆప్స్ మ్యాచ్లకు వర్షం అంతరాయం ఏర్పడినా రిజల్ట్ రాబట్టేందుకు కొన్ని మార్గదర్శకాలు ముందుగానే పెట్టింది.
అవేంటంటే మ్యాచ్ ప్రారంభ సమయానికి రెండు గంటలు లేట్ అయితే పూర్తి ఓవర్లు కొనసాగించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ 9:40 ప్రారంభమైన రెండు జట్లు 20 ఓవర్లు ఆడాల్సిందే. ఆ తర్వాత ఆలస్యమైతే కొద్ది ఓవర్లను తగ్గిస్తూ వస్తారు. ఒకవేళ రాత్రి 11 గంటల 56 నిమిషాల కు ఆట ప్రారంభమైన ఐదు ఓవర్ల పాటు మ్యాచ్ సాగుతుంది.
ఈ ఓవర్లలో ఎవరు ఎక్కువ పరుగులు చేస్తే వారిదే విజయం. ఒకవేళ అప్పటికి కూడా వర్షం తగ్గకపోతే రాత్రి 12:50 నిమిషాల వరకు వేచి చూస్తారు. ఈ సమయానికి ప్రారంభమైన సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2 కి వెళ్తుంది. ఒకవేళ వర్షం ఆగకుండా కురిస్తే మాత్రం ఆట కొనసాగించే అవకాశం లేకపోతే కేఎల్ రాహుల్ టీం, లీగ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కారణంగా రాజస్థాన్ తో రెండో మ్యాచ్ ఆడటానికి అహ్మదాబాద్ వెళుతుంది. అయితే గత రెండు సీజన్లలో కూడా ప్లే ఆప్స్ చేరిన ఆర్సిబి, నాలుగో స్థానంలో నే ముగించింది.


















ఇక అందరూ రిటైర్మెంట్ కూడా ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఐపీఎల్ 2022 సీజన్ లో ఆర్సిబి టీం లోకి వచ్చిన అతను అనూహ్య పర్ఫార్మెన్స్ తో చెలరేగిపోయాడు. లోయరార్డర్ లో అద్భుత బ్యాటింగ్ తో సంచలన విజయాలు అందించాడు. ఈ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్ లు ఆడితే 57.40 సగటుతో 287 పరుగులు చేసి 191.33 స్ట్రైక్ రేట్ సంపాదించాడు.
ఈ పర్ఫామెన్స్ ని చూస్తే ఈ సీజన్ లో దినేష్ కార్తీక్ ఏ విధంగా ఆడారో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో టీమిండియా సెలెక్టర్లు చూపు ఆయనపై పడింది. ఈ సందర్భంగా దినేష్ కార్తీక్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ” నిన్ను నువ్వు నమ్ముకుంటే.. అన్నీ నీ వెంట వస్తాయి ” అని అన్నారు. నాకు అండగా నిలిచిన అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. తను ఇంకా కష్టపడతాను అని అన్నారు. రాయల్ చాలెంజ్ బెంగళూరు చక్కని ఆటతో ముంబై సహకారంతో ప్లే అప్స్ బెర్తు దక్కించుకుంది. ఇక ఈ రోజు లక్నో తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది.




















మరి వీరు ఎక్కువ పెట్టుబడులు ఎందులో పెట్టి ఎంత సంపాదించారో ఓ సారి చూద్దాం..? అనుష్క శర్మ సినిమా రంగంలో హీరోయిన్ గా చేస్తూ స్టార్ అయింది.విరాట్ కోహ్లీ విషయానికి వస్తే భారత్ క్రికెట్ ప్లేయర్ నుంచి కెప్టెన్ వరకు ఎదిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ఒక యాడ్ లో నటించడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో లవ్ బర్డ్స్ గా ఉన్న వీరు వివాహం చేసుకొని చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పవచ్చు.
వీరిద్దరూ సొంతంగా సంపాదించుకున్న సంపాదనతోనే ఇండియాలోనే రిచ్చెస్ట్ గా పేరును సంపాదించుకున్నారు. వీరి ఆస్తుల వివరాలు చూస్తే మనకు కళ్లు చెదిరిపోతాయి. వీరిద్దరి ఆస్తులు కలిపి కొన్ని వందల కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ భారత్ లో స్టార్ క్రికెటర్ కావడం వల్ల ఆయన ఆడే మ్యాచ్ ఫీజులు మరియు ఎండోమెంట్ వంటి ఒప్పందాలు, రాబడులు చూస్తుంటే ఒక సంవత్సరంలో వంద కోట్లకు పైగా సంపాదిస్తారు అని సమాచారం.
ఇక అనుష్క శర్మ విషయానికి వస్తే ఆమె హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. అలాగే అనుష్క శర్మ కొన్ని రకాల వస్త్రాల బిజినెస్ కూడా చేస్తోందని దీని విలువ దాదాపు 65 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. గురువారు గుళ్లోని విరాట్ సొంత బంగ్లా 80 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
అలాగే వీరిద్దరి కార్ల విలువ 25 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ముంబై నగరంలో పది కోట్ల విలువ చేసే ఒక అపార్ట్మెంట్. అలాగే ఖరీదైన వస్తువులు బైకులు ఉన్నాయి. ఇదే కాకుండా వీరు పలు పరిశ్రమ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు.
ఇక విరాట్ కోహ్లీ పూర్తి ఆస్తుల వివరాలు చూస్తే దాదాపుగా 950 కోట్ల పైగానే ఉంటుందని అంచనా. ఇక అనుష్క శర్మ ఆస్తుల విషయానికి వస్తే 450 కోట్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే వీరి ఆస్తుల విలువ దాదాపు 1400 కోట్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది.

































#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12