టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ లో ఉన్న ఏకైక మహిళ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎవరు ఆమె, టీమిండియాలో ఆమె ఏం చేస్తున్నారు అంటూ ఆరాలు తీయడం ప్రారంభించారు క్రికెట్ అభిమానులు. అయితే ఆమె పేరు రాజ్ లక్ష్మి అరోరా. ఈమె టీం ఇండియా సపోర్టింగ్ స్టాఫ్ లో కీలక సభ్యురాలు. ఈమె గత కొన్ని ఏళ్లుగా బీసీసీఐకి కంటెంట్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తుందట. ఇక టీమ్ ఇండియా విదేశాల్లో పర్యటించినప్పుడు ఈమె ఖచ్చితంగా జట్టుతో పాటు ఉంటుందని తెలిసింది.

ఈమె పూణేలోని సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్ లో చదువుకుంది. అక్కడే ఆమె బాస్కెట్ బాల్ షూటింగ్ గేమ్స్ పై ఆసక్తి పెంచుకుంది. తర్వాత జర్నలిస్టుగా కెరియర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత 2015లో సోషల్ మీడియా మేనేజర్ గా బీసీసీఐలో చేరింది. ప్రస్తుతం ఆమె బీసీసీఐకి సంబంధించిన సోషల్ మీడియా ముఖ్య పర్యవేక్షకురాలుగా వ్యవహరిస్తుందని తెలిసింది.
అలాగే ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులను పర్యవేక్షించే అధికారిణి గా కూడా పనిచేస్తుంది. బీసీసీఐ సోషల్ మీడియా మేనేజర్ గా దాదాపుగా 9 ఏళ్ల పాటు పనిచేసిన ఆరోరా ఆ తర్వాత సీనియర్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు చేపట్టారు. అరోరా ఎప్పటికప్పుడు టీం ఇండియా ప్లేయర్లకు సంబంధించిన వీడియోలను ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు చేరవేస్తుంది. ప్లేయర్లకు సంబంధించిన, ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియోలను ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడంలో ఈమెదే కీలక పాత్ర.

ప్రస్తుతం బీసీసీఐకి ఎక్స్ లో మొత్తం మూడు అధికారిక ఖాతాలో ఉన్నాయి ఒకటి బీసీసీఐ, రెండోది బిసిసిఐ ఉమెన్, మూడోది బీసీసీఐ డొమెస్టిక్. ఈ మూడు ఖాతాలకు సంబంధించిన బాధ్యతలు అన్నిటినీ ఆరోరానే నిర్వహిస్తూ ఉంటుంది. ఇంస్టాగ్రామ్, ఎక్స్ లలో 60 కే 29కే ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది అరోరా. రాజల్ అరోరా అనే యూజర్ పేరుతో ఈమె ఎకౌంటు ఉంటుంది.



రోహిత్ శర్మ మహారాష్ట్రలో నాగ్పూర్లోని బన్సోడ్లో 1987 ఏప్రిల్ 30న జన్మించారు. తండ్రి గురునాథ్ శర్మ, తల్లి పూర్ణిమ శర్మ. తల్లి విశాఖపట్నంకు చెందిన వారు. రోహిత్ తరువాత మరో కొడుకు జన్మించాడు. అతని పేరు విశాల్ శర్మ. తండ్రి రవాణా సంస్థ స్టోర్హౌస్లో కేర్టేకర్గా చేసేవారు. అయితే శర్మ తండ్రికి ఆదాయం తక్కువకావడంతో శర్మ బోరివలిలో ఉన్న తాత, మేనమామల దగ్గర పెరిగారు. వారాంతాలలో మాత్రమే డోంబివిలిలోని ఒకే గది ఉన్న ఇంట్లో నివసించే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేవాడు.
ఆ సమయంలోనే విశాల్తో ఆడుకునేవాడు. అన్నదమ్ములిద్దరు క్రికెట్ ఆడేవారు. ఈ క్రమంలో రోహిత్ టాలెంట్ చూసిన అతని అంకుల్ రోహిత్ పేరును క్రికెట్ క్యాంపులో రిజిస్టర్ చేయించాడు. అలా 14ఏళ్ళకే క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ ‘హిట్మ్యాన్’ పేరు తెచ్చుకున్నాడు. మొదట్లో టీమిండియా కీలక ఆటగాడిగా ఉన్న రోహిత్ ప్రస్తుతం కెప్టెన్గా కొనసాగుతున్నాడు.
ముంబైలో భార్యా, కుమార్తెతో లగ్జరీ ప్రాంతంలో నివసిస్తున్న రోహిత్, తల్లిదండ్రులు మరియు సోదరుడి కోసం వారింటి కొంచెం దూరంలో మరోక గృహాన్ని కొనుగోలు చేశాడు.ఇంటికి పెద్ద కుమారుడిగా ఫ్యామిలీ బాధ్యతలను చూసుకుంటున్నాడు. తమ్ముడు విశాల్కు అండగా నిలిచాడు. ఎక్కడో జాబ్ వెతుక్కోవాల్సిన పని లేకుండా తాను ప్రారంభించిన క్రికెట్ అకాడమీలను చూసుకునే బాధ్యతను విశాల్కు అప్పగించాడు. ప్రస్తుతం విశాల్ శర్మ భారత్, సింగపూర్లలోని రోహిత్ క్రికెట్ అకాడమీలకు ఆపరేషన్స్ హెడ్గా పనిచేస్తున్నాడు.












