స్టార్ కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాల నటుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అలీ, తనదైన కామెడీ టైమింగ్ తో స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అలీ పరిమితంగానే సినిమాలలో నటిస్తున్నప్పటికీ, పలు బుల్లితెర షోలతో బిజీగా ఉన్నారు.
అలీ సతీమణి జుబేదా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాపులర్ అయ్యారు. తాజాగా జుబేదా బిర్యానీ ప్యాకెట్లను పేదలకు పంచిపెట్టారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ హాస్యనటుడు అలీ సినిమాలతో పాటుగా, బుల్లితెర పై పలు షోలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఆయన తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో నటించి, పాపులర్ అయ్యారు. పలు టెలివిజన్ షోలకు హోస్ట్ గా చేసిన అలీ పారితోషికం కూడా భారీగానే ఉందనే విషయం తెలిసిందే. ఆయన సతీమణి జుబేదా కూడా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.
యూట్యూబ్ లో సొంత ఛానెల్ ప్రారంభించిన జుబేదా తక్కువ కాలంలోనే ఫేమస్ అయ్యారు. తన ఛానెల్ లో ఎక్కువగా వంటల వీడియోలు మరియు హోం టూర్ వీడియోలు అప్ లోడ్ చేస్తుంటారు. నటుడు అలీ, జుబేదా ఇద్దరు తాము సంపాదించిన దాని నుండి కొంత డబ్బుతో సేవా కార్యక్రమాల కూడా చేస్తుంటారు. ఏడు రోజుల క్రితం జుబేదా తన ఛానెల్ లో ఎగ్ ధమ్ బిర్యానీ వంటకాన్ని తయారు చేశారు. వంట పూర్తయ్యాక దానిని ప్యాక్ చేసి, కొంతమంది పేదవారికి పంచిపెట్టారు.
ఈ వీడియోకి ఏకంగా మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు జుబేదా చేసిన మంచి పనికి ఫిదా అవుతున్నారు. ఆమె ఇలాగే పేదలకు సహాయం చేయాలని కామెంట్లు చేస్తున్నారు. చాలా మందికి జుబేదా స్పూర్తిగా నిలిచారని కొందరు నెటిజెనలు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అలీ కెరీర్ లో మరింత విజయాన్ని సాధించాలని కామెంట్స్ చేస్తున్నారు.
watch video:
Also Read: “గుప్పెడంత మనసు” సీరియల్ లో ఇంకో పెద్ద షాక్..! ఇలా ఎందుకు చేశారు..?

మాజీ ముఖ్యమంత్రి, టీడిపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నెలరోజులు దాటిన ఆయనకు బెయిల్ లభించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు, ఆయన అభిమానులు నిరసనలు, ఆందోళన తెలుపుతున్నారు. ఏపీలోనే కాకుండా హైదరాబాద్ లో, ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో కూడా ఆయన మద్ధతుదారులు నిరసనలు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు స్త్రీల మధ్య మాటలు కలిశాయి. ఈ క్రమంలో వారిద్దరూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యి నెల దాటినా, ఇప్పటికి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించలేదని వారి ఫ్రస్ట్రేషన్ బయటపెట్టారు. చంద్రబాబు అరెస్టు పై ఇప్పటికీ రెస్పాండ్ కాలేదు అని తిడుతూ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ను వెళ్ళగక్కారు. వారిలో ఒక మహిళ, నోరు తెరిస్తే ధర్మం, హిందుత్వం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రధాని,
తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే అరాచకాల గురించి ఒక్కసారైన మాట్లాడలేదని అన్నారు. ఇండియా వరల్డ్ లో టాప్ 3 ప్లేస్ కి వచ్చిందని అంటారు. కానీ రోడ్ల పై నడిచే మహిళలకు టాయిలెట్లు కూడా లేని పరిస్థితిలో ఉందని ఇంకో మహిళ అన్నారు. ప్రపంచంలో 3 స్థానం కాదు, ముందు రోడ్ల పై వెళ్ళే స్త్రీల కోసం టాయిలెట్లు కట్టించి, గొప్పలు చెప్పుకోవాలి అని తన కోపాన్ని బయటపెట్టింది. వీళ్ల సీరియస్ చర్చను అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. అయితే బండ్ల గణేశ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను దైవంగా భావిస్తారు. ఆ విషయాన్ని పలు ఈవెంట్స్ లో ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ తాజాగా వార్తల్లో నిలిచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శల పై స్పందిస్తూ సోషల్ మీడియా ఎక్స్ లో వీడియోని పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో ” నమస్కారం, నిన్నటి నుంచి మనసులో ఒకటే వేదన, ఒకటే బాధ, ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే, నా బతుకు ఎందుకా? అని నాకే అనిపిస్తుంది. చిరాకు వేస్తోంది. నిన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ఇష్టుడు, దైవసమానులు అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. సార్ మీరు పెద్ద హోదాలో ఉన్నారు. భగవంతుడు మీకు అద్భుతమైన హోదాను ఇచ్చారు. కానీ, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి నేను, మీకు చెప్తాను.
నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు, దశాబ్దాల పాటు ఆయనతో తిరుగుతున్నాను. ఆయన చాలా నిజాయితీపరుడు, నీతివంతుడు. ఎవరు కష్టాల్లో ఉన్నా, ఆ కష్టం నాదే అని ముందుకెళ్ళే వ్యక్తి, భోళా మనిషి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీరు మాట్లాడుతున్నారు. జీవితంలో కొందరికి కొన్ని చేదు సంఘటనలు జరుగుతాయి. అది కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగినవే, అని నేను భావిస్తున్నాను. ఉరికురికే అదొక్కటే రీజన్, మరొకటి లేదా, పదే పదే అదే విషయం మాట్లాడటం, చాలా బాధ పడుతూ చెప్తున్నాను. మీకు విన్నవిస్తున్నాను.
పవన్ కళ్యాణ్ సమాజం కోసం ఉపయోగపడే మనిషి. దేశం కోసం బతుకుతున్న మనిషి. ఏ రోజు స్వార్ధంతో కానీ, స్వలాభంతో కానీ ఏ పని చేయడు, అలా మాట్లాడటం కానీ, ఆయన మాటల్లో, చేతల్లో కానీ చూడలేదు. హాయిగా షూటింగ్లు చేసుకుంటూ, సూపర్ స్టార్ హోదాను అనుభవిస్తూ, హాయిగా బ్రతకండి అని చెబుతూండేవాన్ని.వెయ్యేళ్లు బ్రతుకుతామా, మనం పోయినా కూడా జనం మనల్ని గుర్తుపెట్టుకోవాలని, జనానికి ఏదైనా చేయాలని అనేవారు. ఆయన ఆలోచనలన్నిటిని నీతిగా, నిజాయితీగా అడుగాడుగు పేర్చుకుంటూ, భరిస్తూ, సహిస్తూ తలవంచుకుని జనం కోసం బ్రతకాలని, రాత్రిపగలు కష్టపడుతున్నాడు.
నిస్వార్ధంగా కష్టపడుతున్నాడు. రాత్రిపగలు షూటింగ్స్ చేసి ఆయన సంపాదించిన డబ్బుని పార్టీకి ఖర్చు పెడుతున్నాడు. ఎవరి దగ్గరా, ఏ విధంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, పార్టీని నడుపుతున్న మహానుభావుడు. దయచేసి, ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏమిటో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా, కష్టంలో ఉన్నా అంటే సహాయం చేస్తాడు. ఆయనకు లేనిది ఒకటే కులాభిమానం. భారతీయులంతా ఒక్కటే, మనం మనుషులం, మనుషులుగానే బ్రతకాలని చెప్పేవారు.
ఆయనకు గాని కుల పిచ్చి ఉంటే నన్ను ఆదరించేవాడా? నాకీ హోదా ఇచ్చేవాడా? నేను అనుభవిస్తున్న ఈ స్టేటస్ మొత్తం ఆయన పెట్టిన భిక్షే. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా, దయచేసి, తెలిసి తెలియకుండా, పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిని, మనసున్న వ్యక్తి పై అభాండాలు వేయకండి. నేను జనసేన వ్యక్తిని కాదు, కార్యకర్తని కాదు. పవన్ కళ్యాణ్ అభిమానిని, పవన్ కళ్యాణ్ నిర్మాతని, పవన్ కళ్యాణ్ మనిషిని” అంటూ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







ఆ ఊరిలో వర్షాలు పడకపోవడంతో ప్రజలు అనావృష్టితో ఇబ్బందులు పడతుంటారు.ఊరి పెద్ద లందరు ఈ సమస్య తీరాలంటే గంగాలమ్మ జాతర చేయాలని తీర్మానిస్తారు. కానీ జాతర చేసే సమయంలో అడ్డంకి ఏర్పడుతుంది. ఆ సమస్యను ఊరిపెద్దలు ఎలా పరిష్కరించారు? కుమార్,కృష్ణవేణి ప్రేమకు, గంగాలమ్మ జాతరకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగిలిన కథ.
స్టోరీ పరంగా కొత్తగా లేదు, హీరోహీరోయిన్ల రొటీన్ ప్రేమకథ. రోషం రాజు పాత్ర కోడి కూర కోసం పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. చౌడప్ప తన మిత్రుడిని చంపిన తర్వాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మూవీ అంతా ఒకెత్తు అయితే, సినిమా చివర్లోని ట్విస్ట్ మరోక ఎత్తు. అప్పటి దాకా మెల్లగా సాగిన స్టోరీ, కొన్ని క్యారెక్టర్స్,క్లైమాక్స్లో వారు ఇచ్చే ట్విస్టులు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నూతన నటీనటులైనా, ప్రతీ ఒక్కరు కూడా నటనతో ఆకట్టుకున్నారు. హీరో రవి మహాదాస్యం, హీరోయిన్ విషికా కోట తమ నటనతో ఆకట్టుకున్నారు. రోషమ్ రాజు క్యారెక్టర్ బాగుంది. తనదైన కామెడీతో రోషమ్ రాజు ఆకట్టుకున్నాడు.
ప్లస్ పాయింట్స్ :



టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ను ఐటీ ఉద్యోగులు దగ్గర నుండి ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా ఖండిస్తూ వచ్చారు. నందమూరి కుటుంభ సభ్యులు కూడా స్పందించారు. అయితే ఈ విషయం పై ఆ కుటుంబంలోని జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి స్పందన రాకవపోవడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది.
తాజాగా ఈ విషయం పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండడం గురించి అడుగగా, రాజీవ్ కనకాల మాట్లాడుతూ, “ఎన్టీఆర్ స్పందించకపోవడానికి రీజన్ సినిమాలతో బిజీగా ఉండడమే కారణం” అని తాను అనుకుంటున్నట్లుగా తెలిపారు.
“ఆర్ఆర్ఆర్ మూవీ, ఆ తరువాత కరోనా, ఈ విరామంలో ఎన్టీఆర్ కనీసం 4 చిత్రాలు అయినా చేసేవారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీలో నటిస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ మీద దృష్టి పెట్టారని, పూర్తి సమయాన్ని దేవర కోసం కేటాయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ దృష్టి మొత్తం చిత్రాలపైనే పెట్టాలని అనుకుని ఉండొచ్చని తాను భావిస్తున్నట్టు” గా రాజీవ్ కనకాల తెలిపారు.
ఐ ఫోన్ సిరీస్ లు వచ్చిన వెంటనే అమ్ముడవుతాయి. రీసెంట్ గా కొత్తగా ఐఫోన్ 15, ప్రో మాక్స్ రిలీజ్ అయ్యాయి. అలా రాగానే ఐ ఫోన్ లవర్స్ ఎగబడి మరి వాటిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఐఫోన్ అంటే ఇష్టం ఉన్న ఒక బిచ్చగాడు చిల్లర నాణేలను యాపిల్ స్టోర్కు తీసుకువచ్చి, ఆ నాణేలతో యాపిల్ ఫోన్ ను కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఆ వీడియోలో మాసిపోయిన బనియన్, లుంగీతో శరీరం అంతా మురికితో ఒక బిచ్చగాడు, జనాలతో రద్దీగా ఉన్న యాపిల్ స్టోర్కు వెళ్ళాడు. ఒక సంచీని భుజానికి వేసుకుని ఉన్నాడు. అయితే స్టోర్ లో ఉన్నవారు ఏం జరుగుతుందో అర్థం కాక అతన్ని చూడడం మొదలుపెట్టారు. ఆ బిచ్చగాడు కొత్తగా రిలీజ్ అయిన ఐఫోన్ 15 ప్రో మాక్స్ యాపిల్ ఫోన్ కొనడం కోసం స్టోర్కు వచ్చినట్లు చెప్పాడు. అది విన్నవారు అతను జోక్ చేస్తున్నాడని భావించారు. అయితే అతను తాను తీసుకువచ్చిన సంచీలో ఉన్న డబ్బును చూపించడంతో అందరూ షాక్ అయ్యారు.
సంచిలో తీసుకువచ్చిన చిల్లర అంతా స్టోర్లోని ఫ్లోర్ పై పోసి, వాటిని తీసుకుని యాపిల్ ఫోన్ 15 ప్రో మాక్స్ ఇవ్వామని అడిగాడు. ఇక ఆ స్టోర్ సిబ్బంది అందరూ ఆ నాణేలను లెక్కించగా, రూ.1.59 లక్షల ఉంది. అవి తీసుకుని అతనికి ఐఫోన్ ను ఇచ్చారు.దీనికి సంబంధించిన వీడియోను తీసి, సామాజిక మధ్యమంలో షేర్ చేయగా, ప్రస్తుతం వైరల్ గా మారింది. కానీ కొంత మంది మాత్రం ఇది ప్రాంక్ వీడియో అని అంటున్నారు. మరి కొంత మంది అయితే నిజంగానే ఇలా జరిగింది అంటున్నారు. నెటిజెన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.












