Ads
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొన్ని సంవత్సరాల పాటు అత్యంత ధనవంతమైన క్రికెటర్ గా కొనసాగిన విషయం తెలిసిందే. ధోని రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ, ప్రస్తుత ఆదాయం ఏడాదికి రూ. 1040 కోట్లు.
Video Advertisement
ధోని భారత జట్టు కెప్టెన్ గా ఉన్న టైమ్ లో బీసీసీఐ కాంట్రాక్ట్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న ఆటగాడిగా ధోని రికార్డ్ సృష్టించాడు. ఇక క్రికెట్ లో వచ్చే ఆదాయాన్ని పక్కన పెడితే, ఎండార్స్మెంట్స్, ప్రకటనల రూపంలో కోట్లలో ఆదాయం వచ్చేది. క్రికెట్లోకి ధోనీ రాక ముందు రైల్వే శాఖలో టీటీఈగా పని చేసిన విషయం తెలిసిందే.
ధోని పేరుతో ఉన్న ఒక ఓల్డ్ అపాయింట్మెంట్ లెటర్ తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది 2012కు సంబంధించిన లెటర్. ఇండియన్ సిమెంట్స్ సంస్థలో ధోనిని వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు సెలెక్ట్ చేసినట్లుగా ఆ లెటర్లో ఉంది. ఈ పోస్టుకి నెలకు శాలరీ రూ. 43వేలు (రూ.12,650-47,650)గా ఉంది.
జీతంతో పాటుగా స్పెషల్ పే రూ 20వేలు అని, ఫిక్స్డ్ అలెవెన్స్ రూ. 21,970 అని ఉంది. ఇవీ మాత్రమే కాకుండా హౌస్ రెంటల్ అలెవెన్స్ కి రూ.20,400, ప్రత్యేక హౌస్ రెంట్ అలెవెన్స్ కి రూ.8,400 (సబ్ ప్లాంట్స్లో వరక చేసినట్లయితే అదనంగా మరో రూ.8 వేలు) వార్తా పత్రిక ఖర్చులకు గాను 175 రూపాయలు, బెనిఫిట్స్ లేని ప్రత్యేక అలెవెన్స్ కి గాను 60వేల రూపాయలు ఇవ్వనున్నట్లు అపాయింట్మెంట్ లెటర్లో తెలిపారు.
మొత్తంగా చూస్తే వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కి గాను ధోని దాదాపు లక్షా 60వేల రూపాయలకు పైగా నెల జీతంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఈ లెటర్ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. అయితే ఆ సమయానికి వేల కోట్లు ఆర్జిస్తున్న ధోని ఈ ఉద్యోగం చేశాడా లేదా అన్న విషయాన్ని పక్కన బెడితే, ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్ గా ధోని బ్రాండ్ వాల్యూను ఈ లెటర్ తెలియచేస్తోంది. ఇండియా సిమెంట్స్ అనేది చెన్నై సూపర్కింగ్స్కు అనుబంధ సంస్థ.
https://www.instagram.com/p/BT0xNfjBc8a/?utm_source=ig_embed&ig_rid=555ee81d-f925-46e3-ae3e-90c4c98249aa
Also Read: ఆడేది తక్కువ… పొగరు ఎక్కువ..! అసలు ఈ ప్లేయర్ కి ఇంకా ఛాన్సులు ఎందుకు ఇస్తున్నారో..?
End of Article