ఈ రోజు నుంచి మీ ఇంట్లోకి వస్తానంటున్న.. ఏమండోయ్ శ్రీమతి గారు కొత్త సీరియల్!

ఈ రోజు నుంచి మీ ఇంట్లోకి వస్తానంటున్న.. ఏమండోయ్ శ్రీమతి గారు కొత్త సీరియల్!

by Mounika Singaluri

Ads

రెండు జంటల కథని కొత్తగా ఆవిష్కరించి మన ముందుకి తీసుకొస్తుంది జెమినీ టీవీ. ఆ సీరియల్ పేరు ఏవండోయ్ శ్రీమతి గారు. జనవరి 22 నుంచి మీ ఇంట్లోకి వస్తానంటున్న ఈ సీరియల్ కధా నేపథ్యం కూడా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఇక కథ విషయానికి వస్తే గౌరవ మర్యాదలు కలిగిన గ్రామ సర్పంచ్ సుబ్బారాయుడు కుమార్తె మిధున. కథానాయకురాలు మిధున పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయి గౌతమ్ తో వెళ్ళిపోతుంది.

Video Advertisement

మిధున అక్క కూడా ఇలాగే చేయడంతో సుబ్బారాయుడిని ఊర్లో వాళ్ళందరూ అవమానిస్తారు. అవమానం తో తల ఎత్తుకోలేక పోతాడు సుబ్బారాయుడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత సిటీలో అక్క చెల్లెలు ఇద్దరు తమ పిల్లలతో కలిసి ఒక ఇంట్లోనే అద్దెకి దిగుతారు. ఆ అక్క చెల్లెలు ఇద్దరు మాట్లాడుకుంటారా లేక విడిపోతారా అనేది సీరియల్ లో చూసి తెలుసుకోవాల్సిందే. నాలుగు జీవితాలు రెండు కథలు ఒకే ఇల్లు.

సరికొత్త కథతో సరికొత్త ధారావాహిక సీరియల్ తో జెమినీ టీవీలో ఏమండోయ్ శ్రీమతి గారు ఈనెల 22న సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం కానుంది. పల్లవి గౌడ, హర్షిత్ శెట్టి, మమ్ముట్టి శ్రీనివాస్, శాంతి, గుత్తికొండ భార్గవ, దేవిశ్రీ, చైత్ర రాయ్, కృష్ణ తదితరులు నటించారు. ఇప్పటికే ఈ సీరియల్ తాలూకా ప్రోమో చూసిన నెటిజన్స్ జగపతిబాబు హీరోగా నటించిన మామిడాకులు సినిమా గుర్తొస్తుంది అని కామెంట్లు పెడుతున్నారు.

కొందరు పల్లవి గౌడ నటన చాలా బాగుంది అని, మరి కొందరు ఇది బెంగాలీ సీరియల్ కి రీమేక్ అని కామెంట్స్ పెడుతున్నారు. పల్లవి గౌడ ఫ్యాన్స్ మాత్రం ఈ సీరియల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సీరియల్ టాప్ సీరియల్స్ కి పోటీగా నిలబడుతుందో లేదో తెలియాలంటే జనవరి 22 వరకు వెయిట్ చేయాల్సిందే.


End of Article

You may also like