Ads
ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి మన దేశానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకు వచ్చారు నీరజ్ చోప్రా. నరేంద్ర మోడీ నుండి ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు నీరజ్ చోప్రా ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తన విజయానికి అభినందనలు తెలుపుతున్నారు. అయితే అసలు నీరజ్ చోప్రా ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Video Advertisement
# నీరజ్ చోప్రా డిసెంబర్ 24, 1994 లో పుట్టారు.
# నీరజ్ చోప్రా కుటుంబంలో మొత్తం 17 మంది ఉండేవారు. ఉన్న పిల్లలందరిలో పెద్దవారు నీరజ్ చోప్రా.
# నీరజ్ చోప్రా పానిపట్ జిల్లాలోని ఖండ్రా అనే ఒక ఊరికి చెందిన వారు. చండీగఢ్ లోని డిఏవి కాలేజీలో చదువుకున్నారు.
# నీరజ్ చోప్రా బాగా తినడం వల్ల చిన్నప్పుడు కొంచెం బొద్దుగా ఉండేవారు.
# చిన్నప్పుడు నీరజ్ చోప్రా చాలా అల్లరి చేసే వాళ్ళు. అప్పుడు తన తండ్రి రన్నింగ్ ప్రాక్టీస్ చేయమని చెప్పే వాళ్ళు.
# నీరజ్ చోప్రా బంధువు పంచకుల లోని శివాజీ స్టేడియం కి తీసుకెళ్ళి జావలిన్ త్రో ఆటని పరిచయం చేశారు. 2011 నుండి శివాజీ స్టేడియంలో జావలిన్ త్రో లో శిక్షణ తీసుకునేవారు నీరజ్ చోప్రా.
# నీరజ్ చోప్రా బిజీగా ఉండడం వల్ల తొమ్మిదవ తరగతి వరకు మాత్రమే చదవగలిగారు. నీరజ్ చోప్రా ప్రస్తుతం జలంధర్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ద్వారా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదువుతున్నారు..
# 2016లో ఇండియన్ ఆర్మీ లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు నీరజ్ చోప్రా.
# 2018 లో జకర్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించారు నీరజ్ చోప్రా. అప్పుడు 88.06 మీటర్ల దూరం వేసి భారత జాతీయ రికార్డు నెలకొల్పారు. ఇదే రికార్డ్ ని స్వయంగా నీరజ్ చోప్రా 2021 లో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ లో 88.07 మీటర్లు వేసి బ్రేక్ చేశారు.
# 2018 లో జరిగిన గోల్డ్ కోస్ట్ కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ సంపాదించారు నీరజ్ చోప్రా. దీని తర్వాత భారత ప్రభుత్వం నీరజ్ చోప్రా ని అర్జున అవార్డుతో సత్కరించింది.
End of Article