Ads
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని మిస్టర్ కూల్ అని పిలుస్తూ ఉంటారు. అయితే అందరు అనుకుంటున్నట్లు ధోనీ మిస్టర్ కూల్ కాదని పేసర్ ఇషాంత్ శర్మ తెలిపారు. ధోనీ ప్లేయర్స్ పై అరుస్తాడని, గ్రౌండ్ లో తప్పులు చేసినపుడు ఎవరినైనా తిడుతాడని అన్నాడు.
Video Advertisement
విరాట్ కోహ్లీతో పాటు నేను కూడా ధోనీ కోపానికి గురయ్యానని ఇషాంత్ శర్మ అన్నారు. ఇషాంత్ శర్మ తాజాగా ఒక నేషనల్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇషాంత్ శర్మ మాట్లాడుతూ, ధోనీ సైలెంట్ గా ఒక కార్నర్ లో కూర్చున్నాడంటే, సీరియస్గా ఆలోచిస్తున్నట్లు అర్ధం చేసుకోవాలని, ఆ టైంలో ఎవరైనా ధోనీని డిస్టర్బ్ చేసినట్లయితే అతడిని బూతులు తిట్టేవాడని, ధోనీని అందరు మిస్టర్ కూల్ అని పిలుస్తారు. కానీ అతను అంత కూల్ కాదని అన్నాడు.
అయితే ధోనీ తరుచూగా ఆగ్రహించేవాడు కాదు. మైదానంలో తప్పులు చేస్తే మాత్రం అరిచేవాడు. తనని కూడా ఎన్నో సార్లు తిట్టాడని అన్నారు. ఒకటి రెండు సార్లు అయితే ధోనీని చూసి భయపడినట్లుగా తెలిపాడు. ఫీల్డర్ వేసిన త్రో ధోనీ గ్లోవ్స్ వరకు వెళ్లకుంటే ధోనీకి చాలా కోపం వస్తుందని, చెయ్యికి ఇవ్వచ్చుగా అంటూ కొప్పడతాడని అన్నారు. 2013 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో తాను చేసిన ఒక మిస్టేక్ వల్ల ధోనీకి చాలా కోపం వచ్చింది.
ఇంగ్లండ్తో మ్యాచ్ లో క్రీజులో ఉన్న రవి బోపారా క్యాచ్ మిస్ చేయడం వల్ల ధోనీకి విపరీతమైన కోపం రావడంతో, ఫీల్డింగ్ చేయలేకపోతే అక్కడ నుండి వెళ్ళమని అరిచాడు. దాంతో తాను నిశబ్దంగా వెళ్లిపోయానని, తనను మాత్రమే కాకుండా కోహ్లీని కూడా ధోనీ చాలా సార్లు తిట్టాడు. ఆ తరువాత తమ్ముడిలా భావించి చెప్పానని అనేవాడు. ఎందుకిలా తిడతావని ధోనీ అడిగినపుడు, నువ్వంటే నాకు అంత ఇష్టం అని సమాధానం చెప్పేవాడు’ అని ఇషాంత్ శర్మ చెప్పుకొచ్చాడు.
Also Read: ధోనీ ఆడిన గేమ్కి 30 లక్షల డౌన్లోడ్స్..! ఇంతకీ అది ఏంటంటే..?
End of Article