Ads
ఆసియా కప్-2022 టోర్నీలో మొదటి మ్యాచ్ లో పాక్ ని ఓడించి పైచేయితో సూపర్ ఫోర్ బరిలోకి దూకిన భారత్ కి పరాజయం ఎదురైంది. ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో టీం ఇండియాపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు విజయం సాధించింది. సూపర్-4లో టీం ఇండియాకు తొలి ఓటమి ఎదురైంది. 20 ఓవర్లలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పాకిస్థాన్ 182 పరుగులు చేసి విజయం సాధించింది.
Video Advertisement
భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(60) సూపర్ ఇన్నింగ్స్ ఆడగా… రోహిత్ శర్మ(28), కేఎల్ రాహుల్(28) పరుగులతో రాణించారు. కాగా ఈ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ బాట్స్మన్ లు రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా నిరాశపరిచారు. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. మహ్మద్ రిజ్వాన్ 71 , మహ్మద్ నవాజ్ 42 పరుగులు చేయడంతో గెలుపు పాక్ సొంతమైంది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్, బిష్ణోయ్, ఆర్ష్దీప్, హార్దిక్, చాహల్ తలా వికెట్ సాధించారు.
18, 19 ఓవర్లలో భారత బౌలర్లు రవి బిష్ణోయి, భువనేశ్వర్ కుమార్ వైడ్ లు వేయడం, అర్షదీప్ క్యాచ్ మిస్ చేయడం ఇండియా ఓడిపోవడానికి కారణాలు అయ్యాయి. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. “పాక్ ప్లేయర్స్ తమ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచారని.. ఈ మ్యాచ్లో తాము చేసిన తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకుంటామని పేర్కొన్నాడు.” ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ ట్రెండ్ అయ్యాయి. అవి ఒక లుక్ వేయండి.
#1.
@2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
#11.
#12.
#13.
#14.
#15.
#16.
#17.
#18.
#19.
#20.
#21.
End of Article