ఆ విషయం లో పాకిస్థాన్ కి మద్దతు.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నేటిజన్స్..!

ఆ విషయం లో పాకిస్థాన్ కి మద్దతు.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నేటిజన్స్..!

by Megha Varna

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా షోయబ్ మాలిక్ ని వివాహం చేసుకున్నట్లు తెలిసిన విషయమే. పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె భారత్ తరపున టెన్నిస్ ఆడుతోంది.

Video Advertisement

దుబాయ్ లో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో సానియా మీర్జా పాకిస్తాన్ కి మద్దతు ఇవ్వడంపై విమర్శలు కురుస్తున్నాయి. గురువారంనాడు ఆస్ట్రేలియా పాకిస్థాన్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగినప్పుడు సానియా మెట్రో స్టేడియం లో కనపడింది.

పైగా ఆమె ఎంతో జోష్ లో కనపడింది. సోనియా భర్త షోయబ్ మాలిక్ నిరాశపరిచినా పాకిస్తాన్ జట్టు భారీ స్కోరు చేయడంతో వారికి చీర్స్ చెప్పింది. అయితే భారత్ తరఫున టెన్నిస్ ఆడుతూ పాకిస్థాన్ జట్టుకు మద్దతు తెలపడం పై భారత క్రీడాకారులు ఆమెపై మండిపడుతున్నారు.

ప్రపంచకప్ లో భారత్ ఆడిన మ్యాచ్ లకి హాజరు కాకుండా పాకిస్థాన్ వన్డే మ్యాచ్లకు హాజరై మద్దతు తెలపడానికి తప్పుబడుతున్నారు. పైగా పలువురు నేటిజన్లు ఆమెపై కామెంట్లు కూడా చేస్తున్నారు. భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కామెంట్లు కూడా చేస్తున్నారు.


You may also like