Home Sports Adda IPL 2024 : ఈసారి ఐపీఎల్ అమలులోకి రానున్న3 కొత్త నియమాలు ఇవే..! ఎఫెక్ట్ పడేది బ్యాటర్ల మీదేనా..?

IPL 2024 : ఈసారి ఐపీఎల్ అమలులోకి రానున్న3 కొత్త నియమాలు ఇవే..! ఎఫెక్ట్ పడేది బ్యాటర్ల మీదేనా..?

by Mohana Priya

ఇండియన్ ప్రీమియర్ లీగ్, అంటే ఐపీఎల్ 2024 ఇవాళ సాయంత్రం నుండి మొదలవుతుంది. దీని కోసం ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. ఎంతో మంది సెలబ్రిటీలు మ్యాచ్ కి ముందు జరిగే వేడుకలో పాల్గొంటున్నారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్ గా చేయాలి అని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లో కొన్ని కొత్త నిబంధనలు రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

new rules in ipl 2024

#1 బౌన్సర్ రూల్

ఈసారి ఒకటే ఓవర్ లో 2 బౌన్సర్లు విసిరే రూల్ అమలులోకి తీసుకొచ్చారు. గత సీజన్లలో అయితే ఒక ఓవర్ లో ఒక బౌన్సర్ మాత్రమే విసరడానికి పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం దీన్ని మార్చారు. ఈ నిబంధన వల్ల బౌలర్లకి లాభం జరుగుతుంది. సాధారణంగా అయితే, గతంలో రెండవ బౌన్సర్ ని నో బాల్ కిందకి తీసుకునేవారు. కానీ ఈసారి 6 బంతుల్లో 2 బౌన్సర్లు ఉంటాయి. దాంతో బౌలర్లు అక్కడ ఉన్న పరిస్థితిని పరిగణించి బౌన్సర్లని ఉపయోగించే అవకాశం ఉంటుంది.

new rules in ipl 2024

#2 స్మార్ట్ రిప్లై సిస్టం

డెసిషన్ రివ్యూ సిస్టం తీసేసి ఈసారి స్మార్ట్ రిప్లై సిస్టం ని పెట్టారు. ఫీల్డ్ మొత్తంలో 8 హాక్-ఐ కెమెరాలని ఏర్పాటు చేసి, దాని ద్వారా అక్కడ జరుగుతున్న దృశ్యాలని చిత్రీకరిస్తారు. దీని ద్వారా వివిధ యాంగిల్స్ లో రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా హాక్-ఐ ఆపరేటర్లు స్ప్లిట్ స్క్రీన్ వాడతారు. వివిధ కోణాల నుండి వీటి ద్వారా ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఒకవేళ ఫీల్డర్ బౌండరీ లైన్ లో క్యాచ్ పట్టుకుంటే, ఫీల్డర్ కాలు బౌండరీ లైన్ కి తగిలిందా? ఒకవేళ తగిలితే పాదంలో ఏ భాగం తగిలింది? అనే విషయాన్ని కూడా థర్డ్ అంపైర్, స్ప్లిట్ స్క్రీన్స్ ని ఉపయోగించి ఇంకా పరిశీలనతో ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. థర్డ్ అంపైర్ వీటి సహాయంతో నిర్ణయాన్ని వెంటనే ప్రకటిస్తారు.

ipl 2024 bcci srs new decision

 

#3. నో స్టాప్ క్లాక్

అయితే, ఈసారి ఐసీసీ మరొక నిబంధన కూడా తీసుకొచ్చింది. దాని పేరు నో స్టాప్ క్లాక్. కానీ ఈ నిబంధనని అమలు చేయట్లేదు. ఈ నిబంధన చూసుకుంటే, ఒకవేళ ఓవర్ పూర్తయితే, థర్డ్ అంపైర్ టైమర్ మొదలు పెడతారు. 60 సెకండ్లు ముగిసేలోపు బౌలింగ్ జట్టు ఇంకొక ఓవర్ మొదలు పెట్టాలి. ఒకవేళ లేదు అంటే 2 సార్లు హెచ్చరిస్తారు. అయినా సరే ఇచ్చిన సమయంలోపు ఓవర్ వేయకపోతే 5 పరుగుల పెనాల్టీ పడుతుంది. ఈసారి అయితే ఐపీఎల్ లో ఈ రూల్ అమలు చేయట్లేదు. కానీ టీ20 వరల్డ్ కప్ సమయానికి ఈ రూల్ అమలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ సీజన్ కోసం పైన చెప్పిన 2 నిబంధనలు మాత్రం కచ్చితంగా అమలులోకి తీసుకొచ్చారు.

ALSO READ : IPL 2024 : జడేజాని కాదని రుతురాజ్‌కి కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారు? 2022లో అలా జరిగినందుకేనా?

You may also like