“ఇంటింటి గృహలక్ష్మి” సీరియల్ లో కొత్త ట్విస్ట్..! ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా..?

“ఇంటింటి గృహలక్ష్మి” సీరియల్ లో కొత్త ట్విస్ట్..! ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా..?

by kavitha

Ads

ఇంటింటి గృహలక్ష్మి, స్టార్ మాలో ప్రసారం అయ్యే ఈ సీరియల్ గతంలో నెంబర్ వన్ స్థానంలో ఉండే కార్తీకదీపం సీరియల్ కి చాలా పోటీని ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఈ గృహలక్ష్మి సీరియల్ టిఆర్పి రేటింగ్ లో అయితే టాప్ 10లో స్థానం కోల్పోయింది. అదే ఛానెల్ లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి కొన్ని వారాలుగా టాప్ వన్ ప్లేస్ లో కొనసాగుతోంది.

Video Advertisement

గృహహింస కేసులో జైలు కెళ్లిన మాజీ భర్త నందుని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న తులసి కేసును రీ ఓపెన్ అయ్యేలా చేస్తుంది. ఈ విషయం తెలిసిన నందు రెండవ భార్య లాస్య ఏం చేస్తుందో? గృహలక్ష్మి సీరియల్ లో కొత్త ట్విస్ట్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇంటింటి గృహలక్ష్మి తాజా ఎపిసోడ్ లో తులసి గృహహింస కేసును రీ ఓపెన్ చేయిస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైన సాక్ష్యాన్ని కూడా పట్టుకుంటుంది. గృహహింస కేసు రీ ఓపెన్ చేశారనే విషయం తెలిసిన లాస్య, ఏదో  ఆధారం దొరికినట్టుంది. అందుకే  తులసి కేసు రీ ఓపెన్ చేయించిందని ఆలోచిస్తుండగా ఆమె కొడుకు లక్కీ తులసి ఆంటీ నాన్న గురించి అడిగిందని చెప్పడంతో షాక్ అవుతుంది. ఏం చెప్పావ్ అని అడిగితే లక్కీ నకు తెలిసింది చెప్పాను అని అంటాడు. తులసికి దొరికిన ఆధారం ఏమిటో అర్ధం అయిన లాస్య, వెంటనే ఆమె మాజీ మొదటి భర్త శేఖర్ కి కాల్ చేసి, పర్సనల్ గా మాట్లాడాలని, లొకేషన్ పంపించమని అంటుంది. వచ్చేదాకా వెయిట్ చేయమని అని అతని ఇంటికి వెళ్తుంది. ఈ ఎపిసోడ్ లవ మొదటిసారి లాస్య  మొదటి భర్త ఎంట్రీ ఇచ్చి, ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ట్విస్ట్ తో ఈ సీరియల్ మీద  ప్రేక్షకులకి మరింత ఆసక్తి పెరిగింది. లాస్య మొదటి భర్త శేఖర్ ఎంట్రీ తర్వాత ఏం జరుగుతుందో చూడాల్సిందే.

Also Read: ఇదేం ట్విస్ట్… ఇంక “గృహలక్ష్మి” తులసి కాదా..? మరి ఎవరంటే..?


End of Article

You may also like