Ads
ఐపీఎల్ 2022 వేలం జరిగింది. అన్నీ జట్లు తమ ప్లేయర్లని ప్రకటించారు. ఇందులో కొన్ని షాకింగ్ నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సీనియర్ ప్లేయర్లతో పాటు, కొంత మంది యువ ప్లేయర్లని కూడా ఎంపిక చేసారు.
Video Advertisement
ఇదే విధంగా సన్రైజర్స్ హైదరాబాద్ కూడా ముగ్గురు ప్లేయర్లని రిటైన్ చేసుకుంది. వారు బౌలర్ ఉమ్రాన్ మాలిక్, కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఇంకా అబ్దుల్ సమద్. ఈ సారి వార్నర్ స్థానంలో ఈ జాబితాలో ఒకరు చేరే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. వారు ఎవరంటే.
#1 కే ఎల్ రాహుల్
ఓపెనర్గా ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కె ఎల్ రాహుల్ ని హైదరాబాద్ జట్టు తీసుకునే అవకాశం ఉంది. రాహుల్ని టీమ్లోకి తీసుకోవడం ద్వారా వార్నర్ స్థానం భర్తీ అవ్వడమే కాకుండా టీమ్కి ఒక మంచి బ్యాట్స్మెన్ దొరికినట్లు ఉంటుంది.
#2 యుజ్వేంద్ర చాహల్
రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడిన చాహల్, టీమ్కి ప్రధాన బలంగా నిలిచారు. దాంతో ఈ వికెట్ టేకింగ్ బౌలర్పై జట్టు కన్నేసింది.
#3 శ్రేయాస్ అయ్యర్
ప్రస్తుతం ఫామ్లో ఉన్న ప్లేయర్స్ లో శ్రేయస్ ఒకరు. దాంతో ప్రతి టీమ్ శ్రేయస్ ని తీసుకోవాలి అని అనుకుంటున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్లో శ్రేయాస్ ఉంటే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు బలం చేకూరుస్తుంది అని అనుకుంటున్నారట.
#4 రవిచంద్రన్ అశ్విన్
ఒకవేల మెగా ఆక్షన్లో రషీద్ ఖాన్ మిస్ అయితే ప్రస్తుత టీ20ల్లో మంచి ఫామ్ని కొనసాగిస్తున్న అశ్విన్, హైదరాబాద్ టీమ్కి సరైన ఆప్షన్ అవుతారు.
#5 దేవదత్ పడిక్కల్
ఓపెనర్ల కోసం వెతుకుతున్న సన్రైజర్స్ కి దేవదత్ పడిక్కల్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
వీరిలో ఎవరో ఒకరిని వార్నర్ స్థానంలో తీసుకునే ఆలోచనలో జట్టు యాజమాన్యం ఉన్నట్టు సమాచారం.
End of Article