Ads
ఐపీఎల్ 2020 లో నిన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు కి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 226/6 తో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. చివరిలో రాజస్థాన్ రాయల్స్ 18 బంతుల్లో 51 పరుగులు చేయాల్సి ఉండగా 18 వ ఓవర్ వేసిన కాట్రెల్ బౌలింగ్ లో రాహుల్ తెవాటియా (53: 41 బంతుల్లో 7×6) వరుసగా 6, 6, 6, 6, 0, 6 చేశారు. తర్వాత మహ్మద్ షమీ బౌలింగ్లో జోప్రా ఆర్చర్ (13 నాటౌట్: 3 బంతుల్లో 2×6) స్కోర్ చేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (106: 50 బంతుల్లో 10×4, 7×6) చేశారు.
Video Advertisement
మయాంక్ అగర్వాల్ సెంచరీ కొట్టారు. ఇంక మరో ఓపెనర్ కే ఎల్ రాహుల్ (69: 54 బంతుల్లో 7×4, 1×6) చేయగా నికోలస్ పూరన్ (25 నాటౌట్: 8 బంతుల్లో 1×4, 3×6), గ్లెన్ మాక్స్వెల్ (13 నాటౌట్: 9 బంతుల్లో 2×4) స్కోర్ చేశారు . దాంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జుట్టు 2 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేయర్స్ సంజు శాంసన్ (85: 42 బంతులలో 4×4, 7×6), స్టీవ్ స్మిత్ (50: 27 బంతుల్లో 7×4, 2×6) స్కోర్ చేశారు.
watch video:
Can anybody explain this from Nicolas Pooran? HOLY SHIT 🤯#KXIPvsRR pic.twitter.com/d6lwPDGrPA
— Dipesh Pandit (@Thejuly23rdd) September 27, 2020
also watch:
This is the best save I have seen in my life. Simply incredible!! 👍#IPL2020 #RRvKXIP pic.twitter.com/2r7cNZmUaw
— Sachin Tendulkar (@sachin_rt) September 27, 2020
End of Article