ఇప్పుడు SRH, కావ్య పాప దృష్టి అంతా ఈ “కొత్త క్రికెటర్” మీదే..! ఎవరు ఇతను..?

ఇప్పుడు SRH, కావ్య పాప దృష్టి అంతా ఈ “కొత్త క్రికెటర్” మీదే..! ఎవరు ఇతను..?

by kavitha

Ads

ప్రపంచ కప్‌ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో వెస్టిండీస్ నెదర్లాండ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ఇచ్చిన టార్గెట్ 375 పరుగులను చేధించడానికి ఫీల్డ్ లోకి వచ్చిన నెదర్లాండ్స్ చతికిలపడింది. ఆ సమయంలోనే యంగ్ క్రికెటర్ ఎంట్రీ ఇచ్చాడు.

Video Advertisement

22వ ఓవర్లో బ్యాటింగ్‌ కు వచ్చి, 46వ ఓవర్ దాకా బ్యాటింగ్ చేస్తూ, 76 బాల్స్ లో 111 రన్స్ చేశాడు. దాంతో అతను ఓవర్‌ నైట్ స్టార్‌ అయ్యాడు. ఇక ఆ క్రికెటర్ ఎవరా ఆని నెట్టింట్లోఅంతా వెతకటం మొదలు పెట్టారు. అతనే తేజా నిడమనూరు, తెలుగు కుర్రాడు. తెలుగువాడు అయిన తేజా నిడమనూరు నెదర్లాండ్స్‌ కు ఎందుకు ఆడాడు అనేది ఇప్పుడు చూద్దాం..
తేజా నిడమనూరు సొంతూరు ఏపీలోని విజయవాడ. అతను 1994లో ఆగష్టు 22న విజయవాడలో జన్మించాడు. తేజా పూర్తి పేరు అనిల్ తేజాా నిడమనూరు. చిన్నతనంలోనే తేజ ఫ్యామిలీ న్యూజిలాండ్‌కు వెళ్లి, అక్కడే స్థిరపడింది. దాంతో అక్కడే తేజా క్రికెట్ నేర్చుకుని, ఆక్లాండ్ జట్టుకు డొమెస్టిక్ క్రికెట్‌ ఆడాడు. న్యూజిలాండ్‌లో చదువు పూర్తి చేసిన తేజాకు, నెదర్లాండ్స్‌ లో జాబ్ వచ్చింది. దాంతో అక్కడికి వెళ్ళాడు. నెదర్లాండ్స్‌ కి వచ్చినా, తాను ఇష్టపడే క్రికెట్‌ ఆడటం కోసం అక్కడే ఉట్రెక్ట్‌లోని కంపాంగ్ క్లబ్‌లో చేరాడు.
అలా నెదర్లాండ్స్‌ దేశవాళీ క్రికెట్ ఆడే తేజాకు జాతీయజట్టు తరుపున ఆడటం కోసం పిలుపు వచ్చింది.  నెదర్లాండ్స్ జట్టులో బాగా ఆడుతున్న తేజా పై వేరే దేశాల క్రికెట్ క్లబ్స్‌ దృష్టి పడింది. దాంతో అవి తేజ కోసం పోటీపడ్డాయి. అలా తేజా ఇంగ్లాండ్‌ క్లబ్ తరుపున ఆడటం మొదలుపెట్టాడు. అక్కడే ఆసీస్ ఆల్‌రౌండర్ టిమ్‌ డేవిడ్‌తో తేజాకు పరిచయమైంది. ఇద్దరూ ఒకే క్లబ్‌ తరుపున ఆడేవారు.
ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌కు కన్నా ముందు జరిగిన సీడబ్ల్యూసీ సూపర్ లీగ్ సిరీస్ లో నెదర్లాండ్స్ జట్టు జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడింది. తొలి వన్డేలో తేజా 110 బాల్స్ లో 96 రన్స్ చేసి నెదర్లాండ్స్ జట్టును గెలిపించాడు. 250 రన్స్ టార్గెట్ ఇచ్చిన జింబాబ్వే జట్టు గెలుస్తారని అందరు అనుకున్నారు. కానీ 7వ స్థానంలో  బ్యాటింగ్ దిగిన తేజాా నెదర్లాండ్స్ జట్టును గెలిపించి సంచలనం సృష్టించాడు. 7వ స్థానంలో బ్యాటింగ్‌ చేసి టాప్  స్కోరు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరియు అబ్దుల్ రజాక్‌ల రికార్డ్స్ ను తేజాా బ్రేక్ చేశాడు. ఇటీవల వెస్టిండీస్‌పై తేజాా సెంచరీ చేయడంతో అందరి దృష్టి తేజా పై పడింది. ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తేజాను  ఎంత డబ్బు పెట్టడానికి అయినా సొంతం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా సన్‌రైజర్స్ ఓనర్ కావ్యాపాప తేజాాను ఎలాగైనా  కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: “ధోనీ.. మిస్టర్ కూల్ కాదు..!” అంటూ… “ఇషాంత్ శర్మ” కామెంట్స్..! ఏం జరిగిందంటే..?


End of Article

You may also like