చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగు పెట్టి, అంచెలంచెలుగా ఎదిగి, తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. సినిమా సినిమాకి నటన పరంగా, డాన్స్ పరంగా తనని తాను మెరుగు పరుచుకుంటూ వస్తున్నారు.
ఒక సమయంలో వరుస ఫ్లాప్ లు చూసిన ఎన్టీఆర్, ఆ తర్వాత రూట్ మార్చి కొత్తదనం ఉన్న సినిమాలని, తన పాత్రలో కూడా కొత్తదనం ఉన్న కథలని ఎంచుకుంటున్నారు. టెంపర్ తర్వాత నుండి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ, ఎన్నో మంచి పాత్రలు పోషిస్తూ, గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నారు.

ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చర్చల్లో నిలిచిన విషయం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం. ఈ విషయంపై ఎంతో మంది ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సన్నిహితులు, బంధువులు అందరూ కూడా చంద్రబాబుని కలిసి వస్తున్నారు.

ఎన్టీఆర్ కూడా చంద్రబాబు బంధువు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ విషయం మీద ఎన్టీఆర్ అసలు స్పందించకపోవడం అనేది చర్చనీయాంశమైన విషయం అయ్యింది. చాలా మంది హీరోలు ఈ విషయం మీద స్పందించలేదు. అది వేరే విషయం. కానీ బంధువు అయినా కూడా ఎన్టీఆర్ ఎందుకు అసలు మాట్లాడలేదు అని అందరూ అంటున్నారు. సోషల్ మీడియా వైదికగా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు.

అసలు ఎన్టీఆర్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అని అందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక విషయం వార్తల్లో నిలిచింది. దేవర సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం అయ్యింది అని, అందులో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు అనే వార్త ఒకటి బయటికి వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ అసలు స్పందించలేదు అని అంటున్న వారు ఈ వార్త వినంగానే కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసారు. అంతే కాకుండా కళ్యాణ్ రామ్ కూడా ఈ విషయం మీద స్పందించలేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డెవిల్ సినిమా షూటింగ్ లో ఉన్నారు.
ALSO READ : ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు..! అంతగా ఏం ఉంది ఇందులో..?

కాగా ఇటీవల ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో రిలీజ్ అయ్యి, అక్కడ భారీ వసూళ్లు రాబడుతోంది. జపాన్ లో RRR సినిమా రాబడుతున్న కలెక్షన్స్ తో లెక్కలు మొత్తం మారిపోయాయి. ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా టాప్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక జపాన్ లో RRR రిలీజ్ కు ముందు వరకు కేజీఎఫ్ 2 సినిమానే 2022లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమాగా ఉంది.
కానీ ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల వల్ల రాజమౌళి సినిమాకి ఆ రికార్డు దక్కింది. అయితే ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ 1200 కోట్ల కలెక్షన్స్ తెచ్చిందని తెలుస్తోంది. కాగా కేజీఎఫ్ 2 సినిమా 1200 కోట్లకు దగ్గరగా ఉన్నట్లు సమాచారం. అయితే కొంచెం తేడాతోనే ఆర్ ఆర్ ఆర్ టాప్ ప్లేస్ ను దక్కించుకుంది.ఇక కేజీఎఫ్ 2 సినిమా రెండవ స్థానంలో ఉంది.
రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ వస్తుందని మరోసారి రుజువైంది. ఎందుకంటే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఎవరిని ఎంచుకుంటే దాదాపు వారికే ఆస్కార్ అవార్డు వస్తాయంట. అయితే ఈ ఏడాది ఆ సంస్థ రాజమౌళిని ఉత్తమ దర్శకుడిగా ఎంచుకుంది. ఇక దీనితో రాజమౌళికి ఈసారి ఆస్కార్ అవార్డ్ వస్తుందని అందరు ఫిక్స్ అయిపోయారు. రాజమౌళి పై తెలుగు సినీ సెలెబ్రిటీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, కంగ్రాట్స్ చెబుతున్నారు. అడివి శేష్, శోభు యార్లగడ్డ వంటి వారు స్పందించారు.
మరి జక్కన్నకి ఆస్కార్ అవార్డ్ వస్తుందో, లేదో చూడాలి. రాజమౌళికి ఒకవేళ ఆస్కార్ అవార్డ్ కనుక వస్తే, భారతీయ సినీ పరిశ్రమకే అది గర్వకారణం అవుతుంది. వందేళ్ల ఇండియన్ సినిమా చరిత్రలో ఏ దర్శకుడికి ఇంత వరకు ఆస్కార్ అవార్డు రాలేదు. రాజమౌళి RRR మూవీని ఇంటర్ నేషనల్ లేవల్లో ప్రమోట్ చేశాడు. విదేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా విజయం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పన్నెండు వందల కోట్లు వసూల్ చేసింది. జపాన్లో ఈ సినిమా ఇప్పటికీ బాగానే ఆడేస్తోంది.
ఈ సినిమా పదకొండు వందలకోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అంతే కాకుండా గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపిక అయ్యింది. రాజమౌళి కూడా హాలీవుడ్లో గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం లాంటి అరుదైన గౌరవాలు దక్కాయి. అయితే గత నెలలో ‘ఆర్ఆర్ఆర్’గ్రాండ్గా జపాన్ లో విడుదల అయ్యింది. ఈ క్రమంలో అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ మరో ఫీట్ సాధించింది. బాహుబలి’ రికార్డ్స్ ని బీట్ చేసి, అక్కడ అత్యధిక కలెక్షన్లు సాధించిన 2వ ఇండియాన్ సినిమాగా నిలిచింది.
ఇదే కాకుండా అత్యంత వేగంగా మూడు వందల మిలియన్ల క్లబ్లో చేరిన ఫస్ట్ భారతీయ సినిమాగా నిలిచి,రెండవ స్థానంలో ఉన్న బాహుబలి 2 ని వెనక్కి పంపింది. జపాన్లో విడుదలైన 34 రోజుల్లోనే అక్కడి కరెన్సీలో 305 మిలియన్ల యెన్లు వసూల్ చేసింది. అంటే మన కరెన్సీలో రూ.17.9 కోట్లు. అయితే 27 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘ముత్తు’ సినిమా విడుదలై రూ.23.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ అదే సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియాన్ సినిమాగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. జపాన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇన్ని ఏళ్లు గడిచిన ఆ రికార్డ్ రజినీ కాంత్ పేరిటే ఉందంటేనే తెలుస్తోంది. ముత్తు సినిమా తరువాత రెండో స్థానంలో నిలిచింది ఆర్ఆర్ఆర్.
ఇక జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో వచ్చే ఏడాది హాలీవుడ్ లేవల్లో అడ్వంచర్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ మూవీ కోసం ప్రిపేర్ సిద్ధం అవుతుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ లో ఉన్నాడు.













































































