కరోనా కాలంలో ఓటీటీలకు అలవాటైన ప్రేక్షకులు ఆ తరువాత థియేటర్లలో చూడాడానికి సినిమాలకు వస్తారా అనే ప్రశ్నలను, అనుమానాలను చెరిపేస్తూ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు 2022 బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్స్ సాధించి భారత సినిమా స్టామినాను పెంచాయి.
అయితే భారీ బ్లాక్ బస్టర్ లు అయిన కేజీఎఫ్ 2, RRR చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్స్ లో ఏ సినిమా టాప్ లో ఉంది. ఏ సినిమా తర్వాత అనేదానిపై ఇంకా ఊగిసలాట కొనసాగుతూనే ఉంది. ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా ఆర్ ఆర్ ఆర్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్,యశ్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ 2 మూవీ 1000 కోట్లకు పైగా రాబట్టింది. కేజీఎఫ్ 2 సినిమా ఇటు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ లో కూడా టాప్ ప్లేస్ లో నిలిచింది.
కాగా ఇటీవల ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో రిలీజ్ అయ్యి, అక్కడ భారీ వసూళ్లు రాబడుతోంది. జపాన్ లో RRR సినిమా రాబడుతున్న కలెక్షన్స్ తో లెక్కలు మొత్తం మారిపోయాయి. ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా టాప్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక జపాన్ లో RRR రిలీజ్ కు ముందు వరకు కేజీఎఫ్ 2 సినిమానే 2022లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమాగా ఉంది.
కానీ ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల వల్ల రాజమౌళి సినిమాకి ఆ రికార్డు దక్కింది. అయితే ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ 1200 కోట్ల కలెక్షన్స్ తెచ్చిందని తెలుస్తోంది. కాగా కేజీఎఫ్ 2 సినిమా 1200 కోట్లకు దగ్గరగా ఉన్నట్లు సమాచారం. అయితే కొంచెం తేడాతోనే ఆర్ ఆర్ ఆర్ టాప్ ప్లేస్ ను దక్కించుకుంది.ఇక కేజీఎఫ్ 2 సినిమా రెండవ స్థానంలో ఉంది.


రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ వస్తుందని మరోసారి రుజువైంది. ఎందుకంటే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఎవరిని ఎంచుకుంటే దాదాపు వారికే ఆస్కార్ అవార్డు వస్తాయంట. అయితే ఈ ఏడాది ఆ సంస్థ రాజమౌళిని ఉత్తమ దర్శకుడిగా ఎంచుకుంది. ఇక దీనితో రాజమౌళికి ఈసారి ఆస్కార్ అవార్డ్ వస్తుందని అందరు ఫిక్స్ అయిపోయారు. రాజమౌళి పై తెలుగు సినీ సెలెబ్రిటీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, కంగ్రాట్స్ చెబుతున్నారు. అడివి శేష్, శోభు యార్లగడ్డ వంటి వారు స్పందించారు.
మరి జక్కన్నకి ఆస్కార్ అవార్డ్ వస్తుందో, లేదో చూడాలి. రాజమౌళికి ఒకవేళ ఆస్కార్ అవార్డ్ కనుక వస్తే, భారతీయ సినీ పరిశ్రమకే అది గర్వకారణం అవుతుంది. వందేళ్ల ఇండియన్ సినిమా చరిత్రలో ఏ దర్శకుడికి ఇంత వరకు ఆస్కార్ అవార్డు రాలేదు. రాజమౌళి RRR మూవీని ఇంటర్ నేషనల్ లేవల్లో ప్రమోట్ చేశాడు. విదేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా విజయం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పన్నెండు వందల కోట్లు వసూల్ చేసింది. జపాన్లో ఈ సినిమా ఇప్పటికీ బాగానే ఆడేస్తోంది.
అయితే ఆయన దాని గురించి పట్టించుకోకుండా, దృష్టంతా షూటింగ్ పైనే పెట్టారు. ఆయన ఎప్పుడు ఆడియెన్స్ కి కథను గొప్పగా చూపించాలనే ఆలోచించారు. షూటింగ్ లో చాలా దుమ్ము ఉన్నా కూడా పని చేస్తూనే ఉన్నారు. ఆయన మూవీ అద్భుతంగా ఉండాలని ఎల్లప్పుడూ తాపత్రయపడతారు’ అని తెలిపారు. ఇక RRR మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డ్స్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి తెలుగు సినిమా స్టామినాని చాటి చెప్పింది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం నమోదు చేసింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన, రాజమౌళి దర్శకత్వం సినిమాకు విజయాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, అలియా భట్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ, ఆస్కార్ బరిలో కూడా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి గానూ దర్శక ధీరుడు రాజమౌళికి ఉత్తమ డైరెక్టర్ గా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు వచ్చింది. ఇండియా తరపున ఈ అవార్డు పొందిన తొలి డైరెక్టర్ రాజమౌళి అవడం విశేషం.
ఈ సినిమా పదకొండు వందలకోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అంతే కాకుండా గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపిక అయ్యింది. రాజమౌళి కూడా హాలీవుడ్లో గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం లాంటి అరుదైన గౌరవాలు దక్కాయి. అయితే గత నెలలో ‘ఆర్ఆర్ఆర్’గ్రాండ్గా జపాన్ లో విడుదల అయ్యింది. ఈ క్రమంలో అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ మరో ఫీట్ సాధించింది. బాహుబలి’ రికార్డ్స్ ని బీట్ చేసి, అక్కడ అత్యధిక కలెక్షన్లు సాధించిన 2వ ఇండియాన్ సినిమాగా నిలిచింది.
ఇదే కాకుండా అత్యంత వేగంగా మూడు వందల మిలియన్ల క్లబ్లో చేరిన ఫస్ట్ భారతీయ సినిమాగా నిలిచి,రెండవ స్థానంలో ఉన్న బాహుబలి 2 ని వెనక్కి పంపింది. జపాన్లో విడుదలైన 34 రోజుల్లోనే అక్కడి కరెన్సీలో 305 మిలియన్ల యెన్లు వసూల్ చేసింది. అంటే మన కరెన్సీలో రూ.17.9 కోట్లు. అయితే 27 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘ముత్తు’ సినిమా విడుదలై రూ.23.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ అదే సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియాన్ సినిమాగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. జపాన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇన్ని ఏళ్లు గడిచిన ఆ రికార్డ్ రజినీ కాంత్ పేరిటే ఉందంటేనే తెలుస్తోంది. ముత్తు సినిమా తరువాత రెండో స్థానంలో నిలిచింది ఆర్ఆర్ఆర్.
ఇక జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో వచ్చే ఏడాది హాలీవుడ్ లేవల్లో అడ్వంచర్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ మూవీ కోసం ప్రిపేర్ సిద్ధం అవుతుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ లో ఉన్నాడు.









































