Ads
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 209 రన్స్ తేడాతో ఇండియా పై విజయం సాధించింది. ఈ టైటిల్ తో అన్ని క్రికెట్ ఫార్మాట్లలోనూ ఐసీసీ టైటిల్స్ను సాధించిన మొదటి జట్టుగా ఆస్ట్రేలియా రికార్డ్ క్రియేట్ చేసింది.
Video Advertisement
ఆస్ట్రేలియా ప్లేయర్ స్కాట్ బోలండ్ కూడా అరుదైన ఘనతను సాధించాడు. తాజాగా భారత జట్టుతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఈ ఫాస్ట్ బౌలర్ 5 వికెట్లను తీశాడు. దాంతో అతను ఈ శతాబ్దంలోనే (21 శతాబ్దం) టెస్ట్ మ్యాచ్ లలో అత్యుత్తమ బౌలింగ్ యావరేజ్ కలిగిన బౌలర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. బోలండ్ ఆడిన ఎనిమిది మ్యాచ్ ల్లో 14.57 సగటుతో ముప్పై మూడు వికెట్లు తీశాడు.
21 శతాబ్దంలో గత 22 సంవత్సరాలో బౌలింగ్ యావరేజ్ లో ఇంత తక్కువ ఉన్న బౌలర్ మరొకరు లేరు. పెసర్ స్కాట్ బోలండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో భారత జట్టు పతనాన్ని శాసించాడు. బోలండ్ ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో శ్రీకర్ భరత్, శుభ్మన్ గిల్ లను క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండవ ఇన్నింగ్స్లో కూడా బోలండ్ మరోసారి గిల్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లిలను అవుట్ చేశాడు. 34 సంవత్సరాల బోలండ్ ఇంత వరకు ఆడిన ఎనిమిది టెస్ట్ మ్యాచ్ లలోనూ ఆస్ట్రేలియా ట్రంప్ కార్డుగా నిలిచాడు. ఈ ఫాస్ట్ బౌలర్ ముఖ్యంగా ఆస్ట్రేలియా పిచ్ల మీద చెలరేగిపోతాడు.
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ పై ఆస్ట్రేలియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 444 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీంఇండియా 234 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఘోర పరాజయాన్ని చవిచూసింది. 164/3 వద్ద 5వ రోజు మ్యాచ్ ను మొదలుపెట్టిన టీంఇండియా ఎలాంటి ప్రతిఘటన చేయకుండానే చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో ముందుగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసి, 469 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. భారత్ 296 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్లో 270/8 వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. టీంఇండియా 234 రన్స్ కు ఆలౌట్ అయ్యింది.
Also Read: జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత కోట్ల వర్షం.. ఆడకుండానే 2 సార్లు ‘విజేత’ గా నిలిచిన ప్లేయర్..!
End of Article