వరల్డ్ కప్ గెలిచిన పరువు పొగుట్టుకున్న బంగ్లాదేశ్…మ్యాచ్ అయిపోయాక భారత్ ఆటగాళ్లపై ఘర్షణ (Video)

వరల్డ్ కప్ గెలిచిన పరువు పొగుట్టుకున్న బంగ్లాదేశ్…మ్యాచ్ అయిపోయాక భారత్ ఆటగాళ్లపై ఘర్షణ (Video)

by Megha Varna

అండర్‌-19 పురుషుల క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. ఫైనల్లో హాట్‌ ఫేవరెట్‌ ఇండియాను ఓడించి, విజేతగా నిలిచింది.  మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది.  తర్వాత  బ్యాటింగ్‌ చేసిన  బంగ్లా జట్టు చివరి వరకు శ్రమించి మూడు వికెట్ల తేడాతో గెలిచి ‘కప్పు’ను  గెలిచింది.భారత్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (121 బంతుల్లో 88; 8 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేశాడు. యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి. తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనందంలో బంగ్లాదేశ్‌ క్రికెటర్లు రెచ్చిపోయారు.

Video Advertisement

తమ జట్టు విజయం అనంతరం బంగ్లా శిబిరం నుంచి ఒక్కసారిగా ఆటగాళ్లు, జట్టు సిబ్బంది మైదానంలోకి చొచ్చుకురావడవంతో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది.టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి ఎగతాళిగా మాట్లాడారు. అసలే ఓటమి బాధలో ఉన్న మన ఆటగాళ్లకు బంగ్లా ఆటగాళ్ల చేష్టలు కోపం తెప్పించాయి. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు తోసుకునే దాకా మ్యాటర్‌ వెళ్లింది. వెంటనే స్పందించిన ఫీల్డ్‌ అంపైర్లు ఇరువురికీ నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియోను  ట్విటర్‌లో పోస్టు చేసారు .ఈ వీడియో చూసిన వారంతా ఆటగాళ్ల తీరును తప్పుబడుతున్నారు.


You may also like