Ads
మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత క్రికెట్ చరిత్రలో ఆయనకంటూ కొన్నిపేజీలను సృష్టించుకున్నారు. భారత్ కు 3 ఐసీసీ ట్రోఫీలు సాధించిన కెప్టెన్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ధోనీ రిటైర్మెంట్ తీసుకున్నా క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది.
Video Advertisement
దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ధోని భారత జట్టు స్టార్ గా ఎదిగాడు. ధోనీ విజయం సాధించడంలో అతని అక్క జయంతి గుప్తా పోషించిన పాత్ర గురించి చాలా మందికి తెలియదు. ధోనీ కెరీర్ లో ఆమె పాత్ర ఏమిటో? ఆమె ప్రస్తుతం ఏం చేస్తుందో? ఇప్పుడు చూద్దాం..
ఎంఎస్ ధోనీ 1981లో జూలై 7న రాంచిలో పాన్ సింగ్, దేవకీ దేవిలకు జన్మించాడు. ధోనీకి అక్క జయంతి గుప్తా మరియు అన్న నరేంద్ర సింగ్ ధోని కలరు. ధోని తండ్రి పాన్ సింగ్ చిన్న ప్రభుత్వోద్యోగిగా పని చేశారు. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఉండే కష్టాలన్నీ వారు అనుభవించారు. ధోనికి టికెట్ కలెక్టర్గా జాబ్ వచ్చినా, ధోనికి చిన్నతనం నుండే క్రికెటర్ కావాలని, ఎప్పటి కైనా దేశం కోసం ఆడాలని బలంగా కోరుకునేవాడు. ఈ విషయం తన తండ్రికితో చెప్తే, ఇవి మనకు సాధ్యం కావని వెనుకడుగు వేశారట.
అలాంటి సమయంలో తమ్ముడు ధోనీకి జయంతి గుప్తా అండగా నిలిచింది. వారి తల్లిదండ్రులకు తమ్ముడి ఆశయం గురించి నచ్చజెప్పి, వాళ్లకు అర్ధమయ్యే విధంగా చేసింది. ధోనికి ఎటువంటి సహాయం అవసరమైన ఆమె ముందుండేది. అలా ఇంట్లో వాళ్లందరిని ఒప్పించి, ధోని క్రికెటర్ గా ప్రయాణం ప్రారంభించిన సమయంలో జయంతి గుప్తా అతనికి ఆర్థికంగా, నైతికంగానూ అండగా నిలిచింది. అలా కెరీర్ మొదలు పెట్టిన ధోనీ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ క్రికెటర్లలో ఒకరిగా ఉన్నారు.
ధోనీ ఆస్తి విలువ 1000 కోట్ల పైగా ఉన్నప్పటికీ, జయంతి గుప్తా మాత్రం తక్కువ ప్రొఫైల్ను మెయింటెన్ చేస్తూ, మీడియాకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఆమె ప్రస్తుతం రాంచీలోని ఒక గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నారని నేషనల్ మీడియా కథనాలు చెబుతున్నాయి. జయంతి గుప్తా ధోని ప్రాణ మిత్రుల్లో ఒకరైన గౌతం గుప్తాను పెళ్లి చేసుకుంది. జయంతితో పాటు గౌతం కూడా దేశవాళీ క్రికెట్ ఆడే సమయంలో ధోనికి అండగా నిలచినట్లు కొన్ని వార్తా కథనాలు వెల్లడించాయి. ధోని బయోపిక్ మూవీలో కూడా జయంతి గుప్తా క్యారెక్టర్ ఉన్న విషయం తెలిసిందే.
Also Read: “ధోనీ” పాత అపాయింట్మెంట్ లెటర్ చూశారా..? అప్పట్లో ధోనీ నెలజీతం ఎంతంటే..?
End of Article