Ads
ఇండియా vs ఆస్ట్రేలియా మూడవ టీ 20 ఆదివారం రోజు హైదరాబాద్ లో జరిగింది. సిరీస్ నిర్ణయించే మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా 186 పరుగులు చేసింది. 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారత్ 187 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 2-1 తో దక్కించుకుంది.
Video Advertisement
ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో గ్రీన్ 52, టిమ్ డేవిడ్ 54 పరుగులు చేయగా, డేనియల్ సామ్స్ 28(నాటౌట్), జోష్ ఇంగ్లీస్ 24 పరుగులు చేశారు. భారత్ బౌలింగ్ లో అక్సర్ పటేల్ (3), భువనేశ్వర్, చాహల్, హర్షల్ పటేల్ ఒక్కోక్క వికెట్ పడగొట్టారు. భారత్ బ్యాటింగ్ లో సూర్యకుమార్ 69, కోహ్లీ 63 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 25(నాటౌట్), రోహిత్ శర్మ 14 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలింగ్ లో డేనియల్ శామ్స్ 2 వికెట్లు పడగొట్టారు.
ఉత్కంఠ భరిత మ్యాచ్ లో చివరి ఓవర్లో భారత్ గెలుపునకు 11పరుగులు కావాల్సి ఉంది. అప్పుడు విరాట్ కోహ్లీ సిక్స్ కొట్టి గెలుపు సులభం చేసారు అనుకునేలోపే 2వ బంతికి కోహ్లీ క్యాచ్ ఔట్ కావడంతో మళ్లీ ఉత్కంఠ తారస్థాయికి చేరింది. తర్వాత బాటింగ్ కి వచ్చిన దినేష్ కార్తీక్ సింగల్ తీసి హార్దిక్ పాండ్య కి స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతికి హార్దిక్ ఒక బంతి డాట్ చేయడంతో 2బంతుల్లో 4పరుగులు కావాల్సొచ్చింది. 5వ బంతికి హార్దిక్ కట్ షాట్ ఆడగా బంతి బ్యాక్ సైడ్ ఫోర్ వెళ్లింది. దీంతో గెలుపు భారత్ సొంతమైంది.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
#11.
#12.
#13.
#14.
#15.
#16.
#17.
#18.
#19.
#20.
#21.
#22.
#23.
End of Article