Ads
భారత జట్టు ఐసీసీ ట్రోఫీని సాధించి సుమారు పది సంవత్సరాలు అవుతోంది. చివరిసారిగా ధోని కెప్టెన్సీ లో భారత జట్టు 2013లో చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఆ తర్వాత నాలుగు ఐసీసీ టోర్నీ ఫైనల్స్ లో భారత జట్టు పరాజయం పొందింది. మరికొన్నిటిలో సెమీ ఫైనల్లోనే వెనక్కి తిరిగిన సందర్భాలు ఉన్నాయి.
Video Advertisement
ధోని కెప్టెన్సీ లో భారత జట్టు 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీలను సాధించింది. ధోని తరువాత కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. కోహ్లీ తరువాత కెప్టెన్ అయిన రోహిత్ శర్మ సైతం భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీని సాధించలేకపోయాడు. తాజాగా ధోనిని కెప్టెన్గా తీసుకోవడడం వెనుక ఉన్న కారణం గురించి వెనుక ఉన్న భూపిందర్ సింగ్ వెల్లడించారు. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇటీవల జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టును నడిపించడంలో కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు. ప్రధానంగా అశ్విన్ విషయంలో మిస్టేక్ చేశాడు. భారత జట్టు ద్వైపాక్షిక ఈవెంట్స్ లో గెలిచినప్పటికీ, ఐసీసీ ట్రోఫీ విషయంలో మాత్రం విజయం సాధించలేకపోతుంది. చెప్పాలంటే ధోని వంటి కెప్టెన్ భారత జట్టు మళ్లీ దొరకలేదని చెప్పవచ్చు. ఇక ఈ నెలలో జరిగిన డబ్య్లూటీసీ ఫైనల్లో భారత జట్టు ఓటమి కెప్టెన్ గా రోహిత్ శర్మ భవితవ్యం పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇండియా మాజీ సెలెక్టర్ భూపిందర్ సింగ్ సీనియర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనిని కెప్టెన్గా ఎందుకు నియమించారో వెల్లడించాడు. ‘కెప్టెన్ ను జట్టు నుండి డైరెక్ట్ గా ఎన్నుకోకుండా, ఆ వ్యక్తి బాడీ లాంగ్వేజ్, టీమ్ ను ముందుండి నడిపించగలిగే లక్షణం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఇతర ప్లేయర్స్ తో మాట్లాడే విధానం, వంటి విషయాల్లో నైపుణ్యాలను బట్టి కెప్టెన్గా ఎన్నుకుంటారు. అలాంటి లక్షణాలను ధోని కెప్టెన్ కాకముందే చాలా సార్లు కనబర్చాడు. ఆ విషయంలో మాకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది’ అని తెలిపారు.
Also Read: ఒకప్పుడు ధోనీతో కలిసి ఆడిన క్రికెటర్… ఇప్పుడు బస్ డ్రైవర్ అయ్యాడు..! ఎవరంటే..?
End of Article