ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ మెజారిటీలో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసిన ఎంతో మంది విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం లో ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో వీరి ఇంటి దగ్గర సంబరాలు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు కూడా గెలిచారు. వారిలో రెడ్డప్ప గారి మాధవి కూడా ఒకరు.

కడప నుండి పోటీ చేసిన మాధవి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఇప్పుడు మాధవి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మాధవి అందరికీ తెలిసింది ఇప్పుడే అయినా కూడా, ఎన్నో సంవత్సరాల నుండి రాజకీయాల్లో తన వంతు కృషి చేస్తున్నారు. మాధవి భర్త శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి పొలిట్ బ్యూరో మెంబర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల మాధవిని తెలుగుదేశం పార్టీ కడప ఇంచార్జ్ గా ప్రకటించారు. మాధవి 1998 నుండి క్యాంపెనింగ్ చేసేవారు. 2014 లో శ్రీనివాస రెడ్డికి ఎంపీగా టికెట్ ఇచ్చినప్పుడు మద్దతుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాధవి స్వస్థలం కర్నూల్ లోని కోయిలకుంట్ల.
కానీ మాధవి ఎక్కువ కడపలో పెరిగారు. మాధవి తండ్రి ట్రాన్స్ఫర్స్ కారణంగా మాధవి వివిధ స్కూల్స్ లో చదువుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదివారు. అందులోనే ఎం.ఏ ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. మాధవికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. అమ్మాయి విజయవాడలో డాక్టర్ చదువుతున్నారు. అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. మాధవి ఒక వ్యాపారవేత్త కూడా. శ్రీనివాస్ రెడ్డి మాధవిని ఎంతో ప్రోత్సహించారు అని మాధవి తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ పనులు తనని చూసుకోమని మాధవికి చెప్పారట.
2002 నుండి మాధవి ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవడం మొదలుపెట్టారు. 2014 లో శ్రీనివాస్ రెడ్డి రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఆఫీస్ పని చూసుకున్నారు. వీరికి ఒక ఇన్ఫ్రా కంపెనీ ఉంది. దీని నుండి రైల్వే పనులు, రోడ్ పనులు, ఇరిగేషన్ కి సంబంధించిన పనులు చేస్తూ ఉంటారు. వీటి వ్యవహారాలన్నీ కూడా మాధవి హైదరాబాద్ నుండి చూసుకున్నారు. కన్స్ట్రక్షన్ కి అయ్యే పనులు అన్నీ కూడా మాధవి చూసుకుంటారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అడుగు పెట్టి కడప ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంతో మంది ప్రముఖులు మాధవికి అభినందనలు తెలుపుతున్నారు.



నటి నిషా నూర్ తన గ్లామర్తో 1980లో సిల్వర్ స్క్రీన్ ను మరింత అందంగా మార్చింది. ఆమె తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో చిత్రాలలో నటిస్తూ దక్షణాదిలో స్టార్ హీరోయిన్గా రాణించింది. కమల్ హాసన్, రజనీకాంత్, భాను చందర్ లాంటి పెద్ద హీరోలతో నటించింది. అగ్ర దర్శకులు అయిన బాలచందర్, భారతీరాజా విసు, చంద్రశేఖర్ లాంటి వారితో పని చేసింది. కమల్ హాసన్ తో కలిసి ‘టిక్ టిక్ టిక్’ అనే సినిమాలో, రాజేంద్రప్రసాద్, మమ్ముట్టి, మోహన్లాల్తో పలు సినిమాలు చేసింది.
తన గ్లామర్ తో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ 1995 అనంతరం నిషా నూర్ కు ఒక్క మూవీలో కూడా అవకాశం రాలేదు. అప్పటివరకు స్టార్ స్టేటస్ పొందిన నిషా నూర్ అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించినప్పటికీ, ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో సినిమాలని వదిలిపెట్టింది. అయితే సంపాదించిన డబ్బు మొత్తం కరిగిపోవడం మొదలైంది. బతకడం కోసం పని చేయాలి. కానీ ఆమె తప్పు దారిని ఎంచుకుని, వ్యభిచార వృత్తిలోకి వెళ్ళింది.
అయితే ఒక ప్రొడ్యూసర్ వల్లే ఆ వృత్తిలోకి వెళ్ళిందనే వార్త అప్పట్లో వచ్చాయి. ఆదుకునేవారు లేకపోవడం వల్ల నిషా నూర్ అందులోనే ఉండిపోయింది. ఆమెకు తలదాచుకునే స్థలం కూడా లేక ఒక సమయంలో ఒక దర్గా బయట నిద్రించింది. ఆమె పరిస్థితి తెలిసి, ఆదుకోవడానికి ఒక తమిళ ఎన్జీవో ముందుకు వచ్చి, నిషా నూర్ కు వైద్య పరీక్షలు చేయించడంతో ఆమెకు ఎయిడ్స్ ఉన్నట్లుగా తెలిసింది. ఆ వ్యాధితో పోరాడుతూ హాస్పటల్ లోనే నిషా నూర్ 2007లో అనాధలా మరణించింది.




మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రుద్రవీణ’ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించింది. ప్రముఖ తమిళ నటుడు జెమిని గణేశన్ కీలక పాత్రలో నటించాడు. అన్ని ప్రశ్నలకి జవాబు దొరికే కోరాలో ‘ఇప్పటి సమాజానికి రుద్రవీణ సినిమా ఏ విధంగా అర్ధం అవుతుంది’ అని అడిగిన ప్రశ్నకి
‘మద్యపానంను మానిపించటం అనేది మూవీలో చూపించినంత సులభం కాదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 30 సంవత్సరాలకు పైగా దేశంలో, రాష్ట్రంలో ఆల్కహాల్ వినియోగ గణాంకాలను ప్రత్యేకించి చూపించనవసరం లేదేమో. ప్రస్తుతం ఉన్న సొసైటీ ఆ సన్నివేశాలను చూసి నవ్వుకుంటారేమో, భార్య పిల్లలను పట్టించుకోనివారు, ఎవరో వివాహం చేసుకోకుంటే మద్యం తాగడం మానేస్తాము అంటే అది జరగని విషయం, అందువల్ల మద్యం లేని సొసైటిని ఆశించడం పక్కన పెడదాం.
రుద్రవీణ మూవీలోని ముఖ్యమైన సమస్య అంటరానితనం. నాకు ఈ మూవీలో బాగా నచ్చిన సీన్ బిలహరి బాబాయ్ ఏమ్మా శోభన(లలిత)ను నువ్వు అంటరానిదానివి కదా అని ప్రశ్నిస్తే, కొంచెం బాధపడినా, ఏ అంటుకోవచ్చుగా అంటూ కొట్టినట్టుగా జవాబు చెప్తుంది. ఆ సన్నివేశం చిన్నతనంలో చూసి ఓహో ఇలానే ఉండాలని అనుకునేవాడిని, అలా చెప్తేనే ఊరుకుంటారని నమ్మేవాడిని.
అయితే ఆ మూవీ 80ల ఆఖరిలో వచ్చిన మూవీ కదా, ప్రస్తుతం అంటరానితనం ఏముంది అనుకుంటున్నారా? ఇటీవల జరిగిన ఇన్సిడెంట్ చూసి ఆ మూవీలో చేసినట్లు రియల్ లైఫ్ లో ప్రయత్నిస్తే 30 సంవత్సరాల అనంతరం కూడా సమస్యే అని ఋజువైంది’ అని వెల్లడించారు.
మహేష్ బాబు, కియారా అద్వానీ జంటగా నటించిన సినిమా భరత్ అనే నేను. 2018లో రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని అటు మహేష్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోయే సినిమా అని చెప్పవచ్చు. సీఎంగా మహేష్ బాబు అద్భుతంగా నటించారు. సీఎం ను ప్రేమించిన అమ్మాయిగా కియారా అద్వానీ, తండ్రిగా శరత్ కుమార్, విలన్ రోల్ లో ప్రకాష్ రాజ్ ఇలా మూవీలో దాదాపు అన్ని పాత్రలలో నటించిన వారికి పేరు వచ్చింది.
సీఎంను ప్రశ్నించే జర్నలిస్ట్ శుభోదయం సుబ్బారావు పాత్రలో నటించిన నటుడికి మంచి గుర్తింపు వచ్చింది. అతన్ని అందరు శుభోదయం సుబ్బారావుగానే గుర్తిస్తున్నారు. అంతకు ముందు పలు సినిమాలలో నటించినా, రాని గుర్తింపు ఈ మూవీతో వచ్చింది. ఈ పాత్రలో నటించిన నటుడి పేరు రాజశేఖర్ అనింగి. తెలుగు సినిమాలలో విభిన్న పాత్రలు పోషించారు. రాజశేఖర్ 2014లో వచ్చిన షురుయాత్ కా ఇంటర్వెల్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
ఆ తరువాత తెలుగులో గోవిందుడు అందరి వాడేలే, బాహుబలి: ది బిగినింగ్, స్పైడర్, భరత్ అనే నేను, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫీచర్ ఫిల్మ్స్, టీవీ సీరియల్స్, షార్ట్ ఫిల్మ్లు మరియు వెబ్సిరీస్లో నటించారు. ఇండస్ట్రీలోకి రాకముందు రాజశేఖర్ IT, బ్యాంకింగ్ మరియు ఆరోగ్య రంగంలో పనిచేశాడు.
