పెళ్లంటే నూరేళ్ళ పంట. ఆ పంట ప్రతిఫలాన్ని నూరేళ్లు అనుభవించాలంటే మాత్రం భార్య భర్తల మధ్య సఖ్యత తప్పనిసరిగా ఉండాలి. భార్య భర్త లిద్దరు కీచులాడుకున్నా, కిచకిచలాడుకున్నా వారిద్దరి మధ్య అన్యోన్యత ఉంటె ఏ సంసారం నావ అయిన తీరం చేరిపోతుంది. అయితే, పెళ్లి అయిన కొత్తలో ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది.

representative image
ఒకరి వ్యక్తిత్వాలు ఒకరికి అర్ధం అయిన తరువాత వారిద్దరి మధ్య మరింత ప్రేమ పెరుగుతుంది. అయితే అర్ధం కాకపొతేనే తంటా మొదలవుతుంది. అయితే, ఓ భర్త మాత్రం తన భార్య సంగతి అర్ధం అయ్యాక మనసు విరిగిపోయింది అని చెబుతున్నాడు. తనకేమి చేయాలో తెలియడం లేదని సలహా ఇవ్వాలని కోరుతున్నాడు.. ఈరోజుల్లో.. మహిళా సాధికారత కి, మహిళా అధికార వాంఛ కి మధ్య తేడా ఉండడం లేదు. సాధికారిత పేరిట.. చాలా మంది అమ్మాయిలు తమ హక్కుల్ని దుర్వినియోగం చేస్తున్నారు. భర్త ప్రేమ గా ఉంటున్నా..అధికారం చెలాయించే భార్యలు చాలా మందే ఉన్నారు.

representative image
నా భార్య కూడా అలానే ఇబ్బందులు పెట్టేది. దగ్గరికెళ్ళినప్పుడల్లా చిరాకు పడుతూ ఉండేది. అయిన దానికి, కాని దానికి గొడవలు పెట్టుకునేది. ఈ గొడవల వలన ఆమెతో కనీసం మనస్పూర్తి గా కనీసం మాట్లాడలేకపోయేవాడిని. నేను తనను ఎంత ప్రేమ గా చూసుకుంటున్నా తన ఫామిలీ మెంబెర్స్ కి మాత్రం నేను కష్టాలు పెడుతున్నట్లు చెప్పేది. లేని పోనీ అబద్ధాలను అప్పటికప్పుడు అల్లేసేది. దీనితో నాకు మనసు విరిగిపోయింది. ఇలా ఏడాది గడిచిపోయింది.

representative image
ఓ సారి ఆమె తన ఫ్రెండ్స్ ప్రెగ్నంట్ అయ్యారని తెలుసుకుని..తనకు కూడా పిల్లలు కావాలని కోరుకుంది. అప్పటి నుంచి నాకు దగ్గరవ్వాలని ప్రయత్నించేది. తనకి నచ్చినప్పుడు నాకు దగ్గరవడం.. నేను దగ్గరికెళ్తే మాత్రం కసురుకోవడం చేసేది. కొన్ని రోజులకు నాక్కూడా అర్ధం అయిపొయింది. కేవలం పిల్లల కోసమే తాను నా దగ్గరకి వస్తోందన్న సంగతి అర్ధం అయ్యాక మనసు ముక్కలైంది.

representative image
మనసు పంచుకోలేనపుడు.. శరీరం పంచుకుని ఏమి లాభం..? బయట అందరితో గొప్పలు చెప్పుకుని.. నా మనసుని మాత్రం అర్ధం చేసుకోలేని మనిషి తో ప్రేమ ను పంచుకోగలనా..? సఖ్యతే లేని మా ఇద్దరికి పిల్లలు పుడితే..వారి పరిస్థితి మరింత అధ్వాన్నం అవుతుంది. డివోర్స్ తీసుకుందామనుకుంటే.. ఆమె ను చూస్తేనే భయమేస్తోంది. ఏ అభాండాలు మీద వేస్తుందో అని.. కుటుంబ పరువు పోతుంది.. నాకు ఏమి చేయాలో తెలియడం లేదు.. ఈ సమస్య నుంచి బయటపడటానికి తగిన పరిష్కారం ఇవ్వగలరు.
Note: Images used in this post are for reference purposes only. They are not the actual characters.

2.దిలీప్ కుమార్
3.దేవ్ ఆనంద్
4.రాజ్ కుమార్
5.జానీ వాకర్
6.బాల్రాజ్ సాహ్ని
7.అమోల్ పాలేకర్
8.అమ్రిష్ పూరి
9.శివాజీ సతమ్


‘కల్కి 2898 ఏడి’ గ్లింప్స్ లో కనిపించిన కోలీవుడ్ యాక్టర్ పేరు పశుపతి. ఇతను తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు. తమిళంలో అనేక సినిమాలలో నటించి, మెప్పించాడు. పశుపతి నటించిన చాలా పాత్రలకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రధాన పాత్రలో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కామెడీ పాత్రలలో నటించిన విలక్షణ నటుడు పశుపతి.
పశుపతి చెన్నైలోని వన్నందురైలో 1967లో జన్మించారు. 1984లో, చెన్నైలోని ” కూత్తు-పి-పట్టరై ” అనే థియేటర్ గ్రూప్లో చేరాడు. సినిమాల్లో నటించడం మొదలుపెట్టేవరకు అక్కడే ఉన్న పశుపతికి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న యాక్టర్ నాజర్తో స్నేహం ఏర్పడింది. నాజర్ ద్వారా పశుపతి కమల్ హాసన్కి పరిచయం అయ్యాడు. అలా కమల్ హాసన్ నటిస్తున్న మరుదనాయగంలో విలన్ పాత్రకి సెలెక్ట్ అయ్యాడు. అదే పశుపతి మొదటి సినిమా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది.
ఆ తరువాత వేరే చిత్రాలలో అవకాశాలు రావడంతో నటిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. పశుపతి కెరీర్ లో ఎన్నో అవార్డులను అందుకున్నాడు. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యారు. డైరెక్ట్ తెలుగు సినిమాలలో కూడా నటించారు. మొదటిసారి రవితేజ హీరోగా 2003లో వచ్చిన ‘వీడే’ మూవీలో సీనియర్ నటి నళిని స్వర్ణక్కగా నటించగా, ఆమె తమ్ముడిగా పశుపతి నటించాడు. ఆ తరువాత ఆంధ్రావాలా, నేనున్నాను, అనామిక, మలుపు, రాజా విక్రమార్క పశుపతి నటించారు.












