సుధా మూర్తి పరిచయం అక్కర్లేని ఈ మాతృమూర్తి గురించి తెలుసుకోవాల్సిన, నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, భర్త అయిన నారాయణమూర్తి కోసం తన కెరీర్ ని త్యాగం చేసిన వ్యక్తి సుధా మూర్తి. భర్త వేలకోట్ల అధిపతి అయినప్పటికీ ఆమె సాధారణ జీవితాన్ని గడపడానికే ఇష్టపడతారు. తను చీరలు కూడా చాలా తక్కువ ఖరీదు చీరలు కట్టుకోవటానికి ఇష్టపడతారు.

పదివేల రూపాయలు పెట్టి చీర కొంటే పదివేల సార్లు కట్టుకోము కదా, 2000 ఖర్చు చేసే చేరుకుంటే 20 సార్లు లేదా 30 సార్లు లేదా 50 సార్లు కట్టుకుంటాము. నిజానికి ఖరీదు తక్కువ అయినదాన్నే ఎక్కువగా ఉపయోగిస్తామని ఆమె చెబుతారు. అవసరానికి మించిన వస్తువులు ఉండవలసిన అవసరం లేదు అంటారు 73 ఏళ్ల సుధా మూర్తి. ఈమె గత 30 సంవత్సరాలుగా తనకోసం ఒక్క చీర కూడా కొనుక్కోలేదంటే ఆమె సింప్లిసిటీ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.

అప్పుడప్పుడు ఎన్జీవోలు, స్నేహితులు ఇచ్చిన చీరలను మాత్రమే ఆమె కట్టుకుంటారు. ఆమె చీరలు కొనుక్కోకపోవడానికి ఆమె చేసిన ప్రతిజ్ఞ కారణం. వారణాసిలో ఆమె షాపింగ్ లోని వదులుకుంటాను అని ప్రతిజ్ఞ చేసింది. తనకి షాపింగ్ అంటే చాలా ఇష్టం అంట, కాశీకి వెళ్ళినప్పుడు మనసుకు నచ్చినది వదిలేయమంటే షాపింగ్ ని వదిలేసాను అని 2018 లో ఆమె ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
తన భర్త 36,690 కోట్ల ఆస్తికి వారసుడు అందులో ఆమె 775 కోట్లు షేర్ ఉంది. ఆమె అల్లుడు అమెరికా ప్రెసిడెంట్. ఇంతటి ఆస్తి ఉన్న ఆమె సింపుల్ లైఫ్ని లీడ్ చేయడం నిజంగా ఆమె ఉన్నత భావాలకి నిదర్శనం. ప్రస్తుతం సుధా మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయురాలు, రచయిత కూడా అని అందరికీ తెలిసిందే. ఈమె చేసిన సమాజసేవలకు 2006లో పద్మశ్రీ అవార్డు, 2023లో పద్మభూషణ్ అవార్డు ఆమెను వరించింది.



1594లో 4వ ఖలీఫా హజరత్, హైదర్ అలీ పేరిట ఈ నగరంను నిర్మించాడు. ఉద్యాన వనాలు, సరస్సులకు హైదరాబాద్ పేరు గాంచింది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే హైదరాబాద్ అన్ని రకాల వసతులు ఉన్న రాజదాని. అప్పటికే శాసనసభా భవనం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, విమానాశ్రయం వంటి అనేక సౌకర్యాలు ఏర్పడి ఉన్నాయి.
1956లో భాషల వారీగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినపుడు, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు మాట్లాడే భాషల వారిగా, తెలుగు ప్రాంతం తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్లో, మరాఠీ ప్రాంతం మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే ప్రాంతం కర్ణాటకలో విలీనం చేశారు.అల ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరబాద్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర రాజధానిగా మారింది. అయితే భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు హైదరాబాద్ రాష్ట్రం సకల వసతులతో ఉండేది.అప్పటి హైదరాబాద్ యొక్క అరుదైన ఫోటోలను ఇప్పుడు చూద్దాం..
#3 హైదరాబాద్ నగరానికి ప్రవేశ వంతెన..
#4 నిజాం వ్యక్తిగత ఏనుగు
#5 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, రాయల్ బాక్స్ నుండి (బహుశా పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్లో) దళాల కవాతు
#6 నిజాం గార్డ్ కట్టు
#7 నిజాం చౌమహేల ప్యాలెస్
#9 చౌమహేల ప్యాలెస్ లోపలి భాగం
#10 మక్కా మసీదు
#11 మోజమ్ జాహీ మార్కెట్ప్లేస్ భవనం
#12 హైదరాబాద్ రాజకుటుంబానికి చెందిన ప్యాలెస్
#13 చార్మినార్:






ప్రముఖ మలయాళ నటుడు హీరోగా నటించిన సినిమా ‘ఇరట్టా’. థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరోయిన్ అంజలి కీలక పాత్రలో నటించింది. కథ విషయానికి వస్తే, కేరళలో  వాగమన్ అనే ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్లో జరిగే ఒక కార్యక్రమానికి మినిస్టర్ అతిథిగా వస్తుండడంతో పోలీసులు ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంతలో తుపాకీ పేలిన సౌండ్ రావడంతో అందరూ అక్కడికి వెళ్ళి చూస్తారు. అక్కడ ఏఎస్ఐ వినోద్ (జోజు జార్జి) చనిపోయి ఉంటాడు.
 ఎవరు వినోద్ చంపారో తెలియదు. దాంతో పోలీస్ స్టేషన్ ను లాక్ చేసి, అక్కడ ఉన్నవారిని బయటకు వెళ్లనియకుండా చేసి, విచారిస్తూ ఉంటారు. వినోద్ చనిపోయిన సంగతి వినోద్ కవల సోదరుడు అయిన డీఎస్పీ ప్రమోద్ (జోజు జార్జి సెకండ్ రోల్) కు తెలుస్తుంది. వెంటనేప్రమోద్ అక్కడికి చేరుకుంటాడు? ఇంతకీ వినోద్ను చంపింది ఎవరు? ప్రమోద్, వినోద్ లు మధ్య గొడవ ఏంటి ? మాలిని (అంజలి) ఎవరు? అనేది మిగతా కథ.
రోజు పేపర్ లో కానీ, న్యూస్ లో కానీ కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ చూస్తుంటాము. దర్శకుడు రోహిత్ ఎంజీ కృష్ణన్ అలాంటి వార్తలలో ఒక పాయింట్ తీసుకుని, ఆ పాయింట్ చుట్టూ క్రైమ్ థ్రిల్లర్ ను రాసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వినోద్ చనిపోయే సీన్తోనే మూవీ  ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పోలీసులు అనుమానితులను విచారించగా, ఒక్కొక్కొరు వినోద్తో వారికున్న గొడవల గురించి చెప్పడం. ఫ్లాష్బ్యాక్ తో వినోద్ హత్య వెనుక కారణాలను రివీల్ చేయడం ఆకట్టుకుంటుంది. 
ఆఖరికి వినోద్ను ప్రమోద్ హత్య చేసినట్లుగా అనుమానించడంతో ప్రమోద్ ఆ కేసును ఛాలెంజింగ్గా తీసుకుంటాడు. ప్రమోద్ మిస్టరీని చేధించే సన్నివేశాలను డైరెక్టర్ ఊహలకు అందని విధంగా రాసుకున్నారు. జోజో జార్జ్ ఈ మూవీని నిర్మించారు. డ్యూయల్లో రోల్లో  జోజు జార్జ్ నట విశ్వరూపం చూపించాడు. అంజలికి ఒక్క డైలాగ్ ఉండదు. మిగిలినవారు తమ పాత్రకు తగ్గట్టు నటించారు. రెగ్యులర్ గా వచ్చే క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలతో పోలిస్తే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ను అందించే సినిమా. క్లైమ్యాక్స్ లో ట్విస్ట్ మాత్రం ఆడియెన్స్ మనసుల నుండి సులభంగా పోదు.



