ఒక మనిషి జీవితంలో ఎంత కష్టపడినా, ఎంత డబ్బు సంపాదించినా, ఆరోగ్యం మాత్రం సరిగ్గా ఉండడం చాలా ముఖ్యమైన విషయం. ఆరోగ్యం అంటే కేవలం మనల్ని మనం కాపాడుకోవడం మాత్రమే కాదు. మనం మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం. మనిషి తన జీవితంలో ఎంతో ఒత్తిడికి గురవుతాడు. కొంత మంది ఇలాంటి ఒత్తిడిని ఎక్కువగా తీసుకుంటారు. అలాంటప్పుడు వారికి మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. కొంత మంది ఒక సమయం తర్వాత ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం అవ్వదు. చుట్టూ ఉన్న మనుషులు, వారికి జరిగిన సంఘటనల వల్ల వారిలో ఈ మార్పు వస్తుంది. సింగర్ సుచిత్ర పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది అని అంటున్నారు. గతంలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ సుచిత్ర పాడారు.

తెలుగులో బిజినెస్ మాన్ సినిమాలో సార్ వస్తారా పాట సుచిత్రకి చాలా పాపులారిటీ తీసుకొచ్చింది. పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు పాట పాడింది కూడా సుచిత్ర. సుచిత్ర కొంత కాలం క్రితం తన దగ్గర సెలబ్రిటీల వ్యక్తిగత ఫోటోలు ఉన్నాయి అంటూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పటి నుండి సుచిత్ర కి సింగర్ గా అవకాశాలు తగ్గడం మొదలు అయ్యాయి. సుచిత్ర భర్త కార్తీక్ కూడా, “సుచిత్ర మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదు” అని, అందుకే తను అలా మాట్లాడుతున్నారు అని చెప్పారు. ఆ తర్వాత ఆర్జేగా సుచిత్ర చేశారు. దాంతో మళ్లీ సుచిత్ర ఈ విధంగా అయినా ప్రేక్షకులని పలకరిస్తూ ఉంటారు అని అనుకున్నారు. ఇటీవల సుచిత్ర ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చర్చనీయాంశంగా మారింది.
అందులో ధనుష్ జీవితంలోని కొన్ని విషయాల గురించి మాట్లాడారు. ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ గత 14 సంవత్సరాల నుండి గొడవల్లో ఉన్నారు అని చెప్పారు. ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు అని అన్నారు. సుచిత్ర భర్త కార్తీక్, ధనుష్ తో ప్రేమలో ఉన్నారు అని అన్నారు. హీరో విజయ్ బయటకు కనిపించే అంత మంచి వ్యక్తి కాదు అని కూడా చెప్పారు. త్రిష, విజయ్ ఎలా చెప్తే అలా ఆడతారు అని అన్నారు. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది వ్యక్తుల మీద ఏదో ఒక రకంగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. “సింగర్ శ్రేయ ఘోషల్ గొంతు అంత మంచి గొంతు ఏం కాదు” అని, ఆమె గొంతులో ఏం ఉండదు అని అన్నారు. ఎన్నో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే అందరూ బాధపడుతున్నారు. సుచిత్రని చూస్తూ ఉంటే మొహం పీక్కుపోయినట్టుగా అయిపోయి, చాలా డల్ గా అనిపిస్తున్నారు.
ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అనే విషయం ఆమె ఇంటర్వ్యూలు చూస్తుంటేనే తెలుస్తోంది. అయితే ఇది ఒక ఇంటర్వ్యూ తో ఆగలేదు. ఆమె ఇంటర్వ్యూ చాలా ఫేమస్ అవడంతో, తర్వాత మరి కొంత మంది ఆమె ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. “ఆమె మాట్లాడే మాటల్లో ఎంత నిజం ఉందో తెలియదు. ఒకవేళ ఉన్నా కూడా అవి సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు. వాటితో ప్రేక్షకులకు పని లేదు. కాబట్టి ఆమె అవన్నీ కూడా చెప్పడం తప్పు” అని అందరూ అంటున్నారు. అసలు ఆమె ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ఇంటర్వ్యూలు తీసుకోవడం కరెక్ట్ కాదు ఏమో అని తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో రాహుల్ గాంధీ ఒకరు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. ఇంత వయసు వచ్చినా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోకపోవడంతో ఆయన పెళ్లి చాలా సార్లు చర్చలు జరిగాయి. ఎందుకు చేసుకోలేదు అంటూ అడుగుతూనే ఉన్నారు. దేశంలోని పలువురు ప్రముఖులు, హీరోయిన్లు సైతం రాహుల్ గాంధీని వివాహం చేసుకుంటాం అని ముందుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇంతగా చర్చకు దారితీసిన పెళ్లి గురించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా సమాధానం చెప్పారు. 2022లో సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 137 రోజుల సుదీర్ఘ పాదయాత్రను శ్రీనగర్లోని చారిత్రాత్మక లాల్ చౌక్లో ముగించారు. ఈ యాత్ర 12 రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు ఐదు నెలల్లో 4,080 కిలోమీటర్లు సాగింది.
ఆ సమయంలో రాహుల్ గాంధీ పూర్తిగా ప్రజల్లో ఉంటూ సామాన్యులను కలిసి మంచి చెడ్డలు తెలుసుకున్నారు. ఆ క్రమంలో కాలేజ్ స్టూడెంట్స్తో కూడా ముచ్చటించారు. అయితే వారిలో ఒక స్టూడెంట్ పెళ్లి గురించి రాహుల్ గాంధీని అడిగారు. ఆ ప్రశ్నకు ‘తన పనులు మరియు పార్టీ పనుల్లో పూర్తిగా నిమగ్నం అయినందువల్ల వివాహం గురించి ఆలోచించలేదని రాహుల్ గాంధీ వెల్లడించారు.














1. ఎస్. శ్రీశాంత్:
ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టు తరుపున ఆడుతున్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి జీవితకాల నిషేధానికి గురయ్యాడు. ఫిక్సింగ్ విషయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు. ఆ తరువాత దానిని 7 ఏళ్లకు తగ్గించారు.
ఆ తరువాత 2008 ఐపీఎల్ లో స్టెరాయిడ్లను ఉపయోగించి వార్తల్లో నిలిచాడు. దాంతో అతన్ని రెండు సీజన్ల పాటు నిషేధించారు. 2010లో ఇంగ్లండ్ పై జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్ లో దోషిగా రుజువు అవడంతో ఐదేళ్ల నిషేధంతో పాటు ఒక సంవత్సరం జైలు శిక్షను ప్రభుత్వం విధించింది.
అది అక్కడితో ఆగలేదు. 2006లో అతను బౌలింగ్ ను మెరుగుపరిచే డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దాంతో అతని పై రెండేళ్ల నిషేధం విధించబడింది. తరువాత కోర్టులో అప్పీల్ చేసి వచ్చిన ఆరోపణల నుంచి రిలీఫ్ పొందాడు. 2007లో T20 ప్రపంచ కప్ ఆడే సమయంలో, తన సహచరుడిని మొహమ్మద్ ఆసిఫ్ ను బ్యాట్తో కొట్టినందుకు అతను మళ్లీ జట్టు నుండి సస్పెండ్ అయ్యాడు.
2009లోసైమండ్స్ మద్యం మత్తులో రేడియో ఇంటర్వ్యూ ఇవ్వడం అతని కెరీర్లోనే అతిపెద్ద వివాదంగా నిలిచింది. చర్చ సందర్భంగా, అతను బ్రెండన్ మెకల్లమ్ను తప్పుగా పిలవడంతో సైమండ్స్ కాంట్రాక్ట్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడన్న క్లాజును సీఏ చేర్చింది. క్రికెట్ బోర్డుతో ఒప్పందం పై సంతకం చేసిన తర్వాత, రగ్బీ గేమ్లో మద్యం సేవించడంతో అతని కెరీర్ కు ముగింపు వచ్చింది.
2012 లో అతను దక్షిణాఫ్రికా జట్టులోని కొంతమంది సభ్యులకు అవమానకరమైన మెసేజ్ లను పంపాడు. వివాదానికి దారి తీసింది. అప్పటి నుండి అతనికి కోచ్ కి మధ్య దూరం ఏర్పడింది. 2014 యాషెస్లో ఇంగ్లండ్ తరఫున అద్భుత అడినప్పటికీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అతన్ని ఎంపిక చేయలేదు. పీటర్సన్, 39 ఏళ్ల మాజీ బ్యాట్స్మెన్ లలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాలని ఆండీ ఫ్లవర్ ECB కి చెప్పాడం వల్లే పీటర్సన్ ను ఎంచుకోలేదని తెలుస్తోంది. అలా అతని కెరీర్ ముగింపు దిశగా సాగింది.