స్విగ్గి గురించి తెలియని వారు ఉండరని చెప్పవచ్చు. ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ మరియు డెలివరీ ప్లాట్ఫారమ్. కస్టమర్లను వారి స్థానిక రెస్టారెంట్లతో కనెక్ట్ చేస్తుంది. ఆగస్ట్ 2014లో మొదలైన స్విగ్గి క్రమంగా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా ఉపయోగించే ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్లలో స్విగ్గి ఒకటి.
అయితే స్విగ్గిలో డెలివరీ బాయ్గా పార్ట్ టైమ్ పని చేసేవారు ఎక్కువగా ఉన్నారు. తమకు అనుకూలమైన సమయంలో పార్ట్ టైమ్ జాబ్ చేయడానికి చాలామంది చూస్తున్నారు. అయితే డెలివరీ బాయ్ జీతం ఏనాట ఉంటుందో? డెలివరీ బాయ్ ఒక ఆర్డర్కి ఎంత సంపాదిస్తాడు? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం..
ఇటీవల కాలంలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేసేవారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. పార్ట్ టైమ్ జాబ్స్ లో తమకు అనుకూలమైన సమయాలలో చేయగల జాబ్ లలో డెలివరీ బాయ్ జాబ్ ఒకటి. ప్రస్తుతం అనేక ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ సంస్థలు ఉన్నాయి. వీటిలో స్విగ్గీ కూడా ఒకటి. ఇందులో డెలివరీ బాయ్గా పార్ట్ టైమ్ జాబ్ చేసేవారి పనివేళలు రాత్రి 7 గంటల నుండి అర్ధరాత్రి ఒంటిగంట వరకు మొత్తం పని గంటలు 5 గంటల 25 నిముషాల వరకు ఫుడ్ ఆర్డర్ ను డెలివరీ చేయాల్సి ఉంటుంది.
15 ఆర్డర్ల కు 750 రూపాయలు, 20 ఆర్డర్ల కు 1100 రూపాయలు, 25 ఆర్డర్ల కు 1500 రూపాయలు, 32 ఆర్డర్లు డెలివరీ చేసినట్లయితే 2000 రూపాయలు సంపాదించవచ్చు. ఎన్ని ఎక్కువ ఆర్డర్లు డెలివరీ చేస్తే అంత ఎక్కువ మనీ సంపాదించవచ్చు. సాధారణంగా స్విగ్గి పార్ట్ టైమ్ ఉద్యోగాల చేసేవారి జీతం రూ. 7000-15,000 వరకు ఉంటుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఫుడ్ ఆర్డర్ చేసుకునేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ డెలివరీ బాయ్ ఉద్యోగాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. దాంతో పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకునవారికి, వారి అనుకూలమైన సమయాలలో చేసే అవకాశం ఉండడంతో పార్ట్ టైమ్ డెలివరీ బాయ్ జాబ్ వైపుకు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు.
Also Read: 1965 నాటి “హోటల్ బిల్” చూసారా..? అప్పటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

స్వాతంత్ర్యం మరియు రెండు దేశాల విభజన తరువాత నుండి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పోటీతత్వం అనేక అంశాలలో కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఉన్న సమయంలో ఇటు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడతారు. అయితే ఈ రెండు జట్ల తరుపున ముగ్గురు పంజాబీ క్రికెటర్లు ఆడారనే విషయం చాలామందికి తెలియదు.
1.అబ్దుల్ హఫీజ్ కర్దార్
2. అమీర్ ఎలాహి
3. గుల్ మహ్మద్:
1946 నుండి 1955 వరకు, అతను భారత క్రికెట్ జట్టులో సభ్యుడు. భారతదేశం తరఫున ఎనిమిది టెస్టులు ఆడిన తర్వాత, అతను లాహోర్కు వలస వెళ్లి అక్కడ నివసించాడు. గుల్ 1956లో కరాచీలో ఆస్ట్రేలియాతో జరిగిన ఒక టెస్టులో పాకిస్థాన్ తరపున ఆడాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక సంచలనం. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా, తన దైన రీతిలో నటిస్తూ, సినిమా సినిమాకి అభిమానులను, క్రేజ్ ను పెంచుకుంటూ పవర్ స్టార్ గా ఎదిగారు. సినిమాల కన్నా పవన్ వ్యక్తిత్వంతో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో సైతం పవన్ ను అభిమానించే హీరోలు ఎంతో మంది ఉన్నారు. పాలిటిక్స్ లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్, జనసేనానిగా ప్రజల సమస్యల పై తన గొంతు వినిపిస్తున్నారు. ఇటు ఇండస్ట్రీలోనూ వరస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
ఇది ఇలా ఉంటే కోరాలో “పవన్ కళ్యాణ్ గారు మన తెలుగు సినిమాకి దొరికిన అదృష్టం, కాదంటారా?” అనే ప్రశ్నను అడుగగా,
పవన్ కళ్యాణ్ కి కానీ ఇప్పటి యువ హీరోస్ ఎవరికైనా కానీ తెలుగు సినిమాకి దొరికిన అదృష్టం అనే స్థాయి లేదు అని అందరికీ తెలుసు. ఆన్సర్స్ రాసే వాళ్ళు కొంచెం అది కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఒక వేళ అలా అనాల్సి వస్తే ఒక సీనియర్ ఎన్టీఆర్, ఏయన్నార్ , కృష్ణ , చిరంజీవి లాంటి వాళ్లకి మాత్రమే ఆ స్థాయి వుంది” అని చెప్పుకొచ్చారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రిష జంటగా నటించిన సినిమా అతడు. ఈ మూవీ థియేటర్లలో కన్నా బుల్లితెర పై ఎక్కువ విజయాన్ని సాధించింది. స్టార్ మా ఛానెల్ ఈ మూవీ పై పెట్టిన పెట్టుబడి కన్నా, ఊహించని స్థాయిలో ఆదాయం వచ్చిందని ఇండస్ట్రీ లో టాక్. ఇటీవలే ఈ మూవీ వెయ్యి సార్లు కన్నా ఎక్కువగా ప్రసారం అయిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ మూవీని సీనియర్ నటుడు మురళీ మోహన్ తన సొంత బ్యానర్ అయిన జయభేరి ప్రొడక్షన్స్ పైన నిర్మించారు.
మురళీ మోహన్ నటుడు మాత్రమే కాదు. నిర్మాత, వ్యాపార వేత్త కూడా విజయం సాధించాడు. నటుడుగా సినిమాలలో ఆర్జించిన డబ్బును రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టి విజయం సాధించారు. జయభేరి అనే నిర్మాణ సంస్థ స్థాపించి పలు సినిమాలను నిర్మించాడు. కానీ అతడు మూవీ తరవాత మళ్ళీ మురళీ మోహన్ చిత్రాలను నిర్మించలేదు. మురళీ మోహన్ అతడు మూవీ తరువాత సినిమాలను ఆపడానికి గల కారణాలను ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
అతడు మూవీ సమయంలో రాజకీయంగా తాను బిజీగా మారిపోయానని మురళీ మోహన్ తెలిపారు. ఒక మూవీని నిర్మించేటప్పుడు సెట్ లో నిర్మాత ఉండి, అన్నింటినీ దగ్గరుండి చూసుకోవాలని, మేనేజర్లను నమ్ముకోకూడదని అన్నారు. అందుబాటులో ఉండలేని కారణం వల్లనే ఆ మూవీ తర్వాత జయభేరి బ్యానర్ లో మరే సినిమాలు నిర్మించలేదని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. మళ్ళీ తన బ్యానర్ లో సినిమాలు నిర్మించాలని ఆలోచిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.
విజయ్ సేతుపతి, నల్లంది, యోగీబాబు నటించిన కడసీ వ్యవసాయి మూవీ కథ విషయానికి వస్తే, ఇది వ్యవసాయాన్ని నమ్ముకున్న ఒక రైతు కథ. అడవికి సమీపంగా ఉన్న ఒక పల్లెటూరులో వర్షాలు లేక కరువు వస్తుంది. దాంతో రైతులు తమ భూముల్ని అమ్ముకుంటారు. కానీ మల్లయ్య(నల్లంది) అనే 85 ఏళ్ల వృద్దుడు తన తాతముత్తాతల నుంచి వస్తున్న భూమినే నమ్ముకుని జీవిస్తుంటాడు. మల్లయ్య తన భూమిని అమ్మడానికి అంగీకరించడు. అయితే ఊరిలోని కరువు తొలగిపోవడానికి గ్రామదేవతకు జాతర చేయాలని ఊరివారు నిర్ణయించుకుంటారు.
కానీ గ్రామ దేవతకు వరి పండించి, దానిని మొక్కుగా ఇవ్వాలి. మల్లయ్య పొలంలోని బావిలో మాత్రమే నీళ్లు ఉండడంతో ఊరివాళ్లందరూ మల్లయ్య పొలంలో వారి పండించాలని అతన్ని ప్రాధేయపడతారు. మల్లయ్య దానికి అంగీకరించి, తన పొలంలోనే వరి పంటను వేస్తాడు. అయితే నెమళ్లు మల్లయ్య పొలంలో చనిపోవడంతో మల్లయ్యనే వాటిని చంపాడని కేసు పెడతారు.
జైలుకు వెళ్ళిన మల్లయ్య ఆ కేసు నుండి ఎలా బయటికి వచ్చాడు? పోలీసులు వరి పంట బాధ్యతను ఎందుకు తీసుకున్నారు? మల్లయ్యను ఊరి ప్రజలు ఎలా నిర్దోషిగా నిరూపించారు? మరణించిన మామా కుమార్తెను తలచుకుంటూ జీవిస్తున్న రామయ్య (విజయ్ సేతుపతి) ఎవరు? అన్నదే మిగిలిన కథ. 
కేరళ రాష్ట్రంలోని అలమట్టి పట్టణంలో ఒకప్పుడు ట్రావెన్ కోర్ రాజ్యం రాజులు పాలించేవారు. వారు నివసించిన పెద్ద ఇల్లు ఇప్పటికీ ఉంది. దాని చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంది. ట్రావెన్కోర్ వంశానికి చెందిన రాజు అలమోట్టిల్ మెద చాలా క్రూరుడు. ఆ ఇంట్లో కింద ఉండే భాగంలో బంధువులు ఉండేవారు. పైన భాగంలో ఆ రాజు నివసించేవాడు. అతను బ్రిటిష్ వారికి శిస్తు కడుతూ, ఆ ప్రాంతాన్ని పాలించేవాడు. రాజు ఇంట్లో పనిచేసే వారు ఉండడానికి, ఆ ఇంటికి దూరంగా ఇల్లు ఉండేవి. రాజు తన ఉంపుడుగత్తెల కోసం కూడా ప్రత్యేకమైన ఇంటిని కాస్త దూరంలో నిర్మించాడు.
ఆ రాజు తన ఇంటి నుండి చూసినపుడు వారు కనిపించే విధంగా ఆ ఇంటిలో ఉంచేవారు. ఆ అందగత్తెలలో నాట్యం అద్భుతంగా చేసేవారిని పిలిచేవారు. అలా నాట్యం చేసి, రాజుని సంతోషపెట్టిన వారికి ఆభరణాలతో పాటు సత్కారం చేసేవాడు. అందమైన స్త్రీలు ఎక్కడ ఉన్నా, వారిని సొంతం చేసుకునే స్వభావం రాజుకు ఉండేది. ఆ క్రమంలోనే చంద్రముఖి స్టోరీ ఇక్కడే పుట్టింది. రాజు పాలించే రోజుల్లో రాజు సోదరి ఫ్యామిలీ రాజు ఇంటికి వచ్చింది. వారిని తన ఆస్థానంలో ఉండనిచ్చాడు.
కానీ రాజు అక్క, బావ అతని రాజభోగాలు, ఐశ్వర్యం చూసి అసూయపడి, రాజు ఆస్తిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని అనుకున్నారు. ఇక్కడా ఎన్నిరోజులు ఉంటాము, తమకు కొంత ఆస్తి ఇస్తే తమ జీవితం తాము జీవిస్తామని రాజును అడిగారు. అప్పుడు రాజు ఒక పెద్ద భవంతి పాటు వెయ్యి ఎకరాల భూమిని కూడా ఇచ్చాడు. అయితే వారి చేతికి మాత్రం డబ్బు ఇవ్వలేదు. రాజు వార్ధక్యంలో ఆస్తి దక్కుతుందని వారు భావించారు. అయితే రాజుకి వయసు పెరుగుతుండడంతో ఆస్తి అంతటిని తన పిల్లల పేర్ల మీద రాసి, భార్యతో కూడా సంతకం పెట్టించి, ఇచ్చాడు.
దాంతో పగ పెంచుకున్న రాజు అక్క తనకు ఆస్తి ఇవ్వలేదని, రాజును చంపాలని నిర్ణయించుకుంది. ముందుగా రాజు భార్యను స్లో పాయిజన్ తో సందేహం రాకుండా చంపేశారు. భార్య చనిపోవడంతో ఒంటరి వాడైన రాజు తోడుగా ఉండేందుకు పనివాడి పద్దెనిమిదేళ్ళ కుమార్తెను ఇంట్లో పెట్టుకున్నాడు. రాజుని ఆమె బాగా చూసుకునేది. అయితే వకసరి అక్కడికి వచ్చిన ఒక పెయింటర్ రాజు చిత్రం వేస్తానని అనడంతో, రాజు తనతో పాటు ఆ అమ్మాయి చిత్రాన్ని కూడా గీయమని చెప్తాడు. వారం రోజులు సమయం తీసుకుని పని మనిషి చిత్రాన్ని చాలా అందంగా గీస్తాడు.
ఆ చిత్రాన్ని చూసి ఆమె అందానికి ముగ్ధుడైన రాజు పనిమనిషిని ఇష్టపడతాడు. అప్పుడే ఆ ఇంటికి వచ్చిన రాజు అక్క ఈ విషయాన్ని గమనించి, పెత్తనం అంతా తన గుప్పిట్లోకి తీసుకుంది. రాజును ఎలాగైనా చంపేయాలని అనుకుంది. అనుకున్న తాదువుగా ఇద్దరినీ ఒక గదిలో పెట్టి చంపి, రాజు సంపదను అంతా ఆమె తన సంస్థానానికి చేరవేస్తుంది. ఆ తర్వాత రాజు, పనిమనిషిని చంపిన రూమ్ ను తప్ప, మిగతా ఇంటిని అంతా అందంగా తీర్చి దిద్దింది. రాజు కొడుకు అక్కడ ఒక సేవకున్ని ఉంచాడు.
అయితే ప్రతి అమావాస్యకు గది నుండి భయంకర శబ్దాలు వస్తుండడంతో అతను ఆ ఇంటిని నుండి పారిపోగా, రాజు కదుకు మరొక పనివాన్ని పంపిస్తాడు. కానీ అతనుకూడ శబ్ధాలకు భయపడి పారిపోతాడు. ఆఖరికి అక్కడ రాజు అక్క ఆ ఇంట్లోనే ఉంది. ఆ తరువాత వచ్చిన అమావాస్య రోజు రాత్రిపూట రాజు అక్క కూతురు కూడా ఇంట్లో ఉన్నప్పుడు, పని మనిషి ఆత్మ ఆమెను ఆవహించి, పని మనిషిలానే మాట్లాడుతూ రాజు అక్కను చంపేసింది. అప్పటి నుండి ఆ ఇంట్లో నుండి ప్రతి అమావాస్యకు భయంకరమైన శబ్దాలు వస్తుంటాయని అక్కడి వారు చెబుతారు. ఈ కథ ఆధారంగా చంద్రముఖి మూవీని తీశారు.
రజినీకాంత్, శ్రియ జంటగా నటించిన మూవీ శివాజి. డైరెక్టర్ శంకర్ తెరక్కేకించిన ఈ మూవీ తమిళంతో పాటు, తెలుగులోను ఏకకాలంలో విడుదల అయ్యింది. అయితే తమిళంలో కన్నా, తెలుగులోనే సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సౌత్ లో వంద కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాగా ‘శివాజీ’ అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. రజినికాంత్ లుక్సం, డైలాగ్స్, స్టైల్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఒక ఎన్నారై భారత్ కు వచ్చి, దేశంలో దాచిపెట్టిన బ్లాక్ మనీని ఎలా బయటకు రప్పించాడు. ఆ డబ్బుతో ప్రజలకు ఎలా సాయం చేశాడనే కాన్సెప్ట్ తో ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు. సందేశాత్మక కథతో రూపొందిన ఈ మూవీలో రజినికాంత్ ఒక ఎన్నారై పాత్రలో నటించారు.
రజినికాంత్ మేనమామగా పూర్తి నిడివి ఉన్న పాత్రలో వివేక్ నటించారు. అయితే ఈ మూవీని ఇప్పటికే ఎన్నోసార్లు చూసినా కానీ, వివేక్ ఏం జాబ్ చేసేవాడేనే విషయాన్ని ప్రేక్షకులు గమనించలేదు. అయితే ఈ మూవీలో వివేక్ లాయర్ గా నటించాడు. ఈ విషయం తెలిసిన నెటిజెన్లు ఇన్ని సార్లు చూసాం కాని వివేక్ ఏం చేస్తారు అనే విషయం గమనించలేదే అని కామెంట్స్ పెడుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూన్న మూవీ ఓజి. ఈ మూవీని దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ప్రియాంకా అరుళ్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే పురస్కరించుకుని ఈ మూవీ నుండి ఈరోజు 100 సెకండ్ల నిడివి ఉన్న టీజర్ ను రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే రేంజ్లో ‘హంగ్రీ చీతా’ అంటూ రిలీజ్ చేసిన టీజర్ సోషల్మీడియాను షేక్ చేస్తోంది. ముందుగా మేకర్స్ చెప్పినట్టుగానే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ లుక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, వైలైన్స్ ఊహించని రేంజ్లో చాలా పవర్ఫుల్గా ఉన్నాయి.
అర్జున్ దాస్ ఇచ్చిన వాయిస్ ఓవర్ తో ఉన్న ఈ వీడియో అంతా ఎలివేషన్లతో నిండిపోయింది. అయితే ఈ టీజర్ ఫ్లోనెస్ మధ్యలోనే ఆపేసినట్టు ఉందని, చివరి 5 సెకన్లు పర్వాలేదనిపించింది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. లైటింగ్ విజువల్స్ ఇంకా క్వాలిటీగా ఉంటే బాగుండేదని అంటున్నారు.
రాజ్ బి శెట్టి కన్నడ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ యాక్టర్ గా రాణిస్తున్నారు. ఆయన యాక్టర్ మాత్రమే కాదు దర్శకుడు మరియు రచయిత. పలు కన్నడ చిత్రాలకు దర్శకుడిగా, రచయితగా పనిచేశారు. ఈ ఏడాది టోబి అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించి, మెప్పించారు. గరుడ గమన వృషభ వాహన సినిమాతో పాపులర్ అయిన రాజ్ బి శెట్టి మొదటిసారి లీడ్ క్యారెక్టర్ పోషించిన మూవీ ‘ఒందు మొట్టేయ కథె’. 2017 లో రిలీజ్ అయిన ఈ మూవీ 30 లక్షలు బడ్జెట్ తో తెరకెక్కి, రూ. 2.5 కోట్లు కలెక్షన్స్ సాధించి కమర్షియల్గా విజయం సాధించింది. ఉత్తమ సినిమాగా అవార్డ్ అందుకుంది.
రొమాంటిక్ కామెడీమూవీగా తెరక్కేకిన ఈ మూవీ కథ విషయానికి వస్తే, 28 ఏళ్ల జనార్ధన్( రాజ్ బి శెట్టి) వృత్తిరీత్యా కన్నడ లెక్చరర్. బట్టతల మరియు సన్నగా ఉండడంవల్ల పెళ్లి సంబంధాలనని తప్పిపోతుంటాయి. జనార్ధన్ జాతకం ప్రకారం, 29 ఏళ్లలోపు అంటే ఏడాది లోపు వివాహం కాకపోతే, అతడు సన్యాసం తీసుకోవాల్సి వస్తుందని జ్యోతిష్యుడు హెచ్చరిస్తాడు. దాంతో జనార్ధన్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటాడు.
ఆ క్రమంలో సహోద్యోగి అయిన ఎకనామిక్స్ లెక్చరర్ ను లవ్ లో పడేయడానికి ట్రై చేసి ఫెయిల్ అవుతాడు.
అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల సరళ జనార్థన్ ని లవ్ చేస్తుంది. జానార్థన్కు నచ్చకపోయినా సరళతో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. కానీ అందమైన అమ్మాయినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న జనార్థన్ లావుగా ఉన్న సరళను పెళ్లి చేసుకున్నాడా? లేదంటే ఆమెతో పెళ్లి రద్దు చేసుకొని అందంగా ఉండే అమ్మాయి కోసం వెతకడం మొదలుపెడతాడా? అనేది మిగిలిన స్టోరీ.
రామ్ పోతినేని, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తూన్న మూవీ స్కంద. ఈ మూవీని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చితాన్ని సెప్టెంబర్ 15న రిలీజ్ చేయనున్నారు. మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఆద్యంతం బోయపాటి మార్క్ మాస్ హీరోయిజం, మాస్ డైలాగ్స్ తో నిండిపోయింది. అయితే ఈట్రైలర్ లో రామ్, శ్రీకాంత్ లతో పాటుగా ఒకప్పటి హీరో కనిపించారు. ఆయన పేరు దగ్గుబాటి రాజా. హీరోగా తెలుగు మరియు తమిళ భాషలలో పలు సినిమాలలో నటించి, మెప్పించారు. దగ్గుబాటి రామానాయుడు అన్న కుమారుడే దగ్గుబాటి రాజా. అప్పట్లో దగ్గుబాటి రాజా అందమైన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది.
తెలుగులో కన్నా కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలలో నటించాడు. స్టార్ హీరో అవుతాడు అని భావించారు. కానీ రాజాకు హఠాత్తుగా సినిమాలలో అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీని వదిలి, తమ ఫ్యామిలీ వ్యాపారం అయిన గ్రానైట్ బిజినెస్ లో కొనసాగాడు. ఆ మధ్యన వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించాడు. ఇందులో ఎన్టీఆర్ తమ్ముడి పాత్రలో నటించారు. మళ్ళీ స్కంద సినిమాలో కనిపించారు.