ఇటీవల కాలంలో ఎయిర్పోర్ట్ లకు పక్షుల బెడద ఎక్కువ అయ్యింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. చుట్టుపక్కల ఉండే జనావాసాలు, అపరిశుభ్రమైన పరిసరాలు, చెరువుల కారణంగా ఎయిర్పోర్ట్ లకు పక్షుల తాకిడి బాగా పెరిగింది.
రీసెంట్ గా రియాద్ నుండి హైదరాబాద్ కు వచ్చిన ఎస్వీ 744 ప్లైన్ లాండ్ అవుతున్న టైమ్ లో ఒక పక్షి ఢీకొనడంతో ఆ విమానం యొక్క ముందు భాగానికి సొట్ట ఏర్పడడం జరిగింది. ఈ ఘటన ఎయిర్పోర్ట్ లకు పక్షుల బెడద ఎంత తీవ్రంగా ఉందో చెబుతుంది. ప్రమాదం జరుగకపోయినా ఈ ఘటన పక్షుల సమస్యను ఆలోచించేలా చేస్తోంది.
ప్రతిరోజూ రాకపోకలు సాగించే నేషనల్, ఇంటర్నేషనల్ విమానాలతో నిత్యం రద్దీగా ఉండే విమానాశ్రయం చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల పక్షులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో విశాఖ ఎయిర్పోర్ట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మల్లికార్జున ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం నాడు కలెక్టరేట్ లో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మతో మరియు సివిల్ అడ్మినిస్ట్రేషన్, పోర్ట్ ట్రస్ట్, జీవీఎంసీ,ఇండియన్ నేవీ, ఎయిర్ పోర్ట్ అథారిటీ యొక్క ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించారు.
దీనిలో రన్వేలో నీటి నిల్వ, విమానాశ్రయం పరిసరాల్లో చెత్త డంపింగ్, పక్షుల వల్ల జరిగే ప్రమాదాలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ ఉన్న ప్రాంతం జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో ఉండడం వల్ల అధికంగా వ్యర్థాలు అక్కడ చేరుతున్నాయని అన్నారు. మేహాద్రి గెడ్డ కాలువలో మేకల, కోళ్ల మాంసపు వ్యర్థాలు ఎక్కువగా వేస్తున్నారని, అందువల్ల ఆ పరిసరాలు పక్షులు, కుక్కలకు ఆవాసాలుగా మారుతున్నాయని అన్నారు.
ఈ కారణంగా పక్షుల సంఖ్య పెరగడంతో విమానాల రాక, పోకలకు అవి ఆటంకం కలిగిస్తున్నాయని తెలిపారు. అందువల్ల ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మీట్ షాప్ లను తొలగించాలని, పారిశుధ్య చర్యలను తీసుకోవాలని కలెక్టర్ జీవీఎంసీ ఆఫీసర్లను ఆదేశించారు. అలాగే ఈ విషయం పై జనాలకు కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. భారీ వర్షాల సమయంలో నీరు ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళకుండా కావాల్సిన నిర్మాణాలు, పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Also Read: తిరుమలలో పిల్లలపై దాడి చేసిన చిరుతపులి ఇదేనా..? ఈ విషయాన్ని ఎలా నిర్ధారిస్తారు అంటే..?

తమిళ హీరో శివకార్తికేయన్ కు టాలీవుడ్ లో తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు. తెలుగు దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ‘ప్రిన్స్’ అనే తెలుగు సినిమాను చేశాడు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. కానీ శివకార్తికేయన్ ముందు సినిమాల కన్నా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇటీవల శివకార్తికేయన్ నటించిన ‘మహావీరుడు’ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అయ్యింది.
ఈ మూవీ మొదటి షోతోనే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మూవీ కాన్సెప్ట్ బాగున్నా, ఎగ్జిక్యూషన్ యావరేజ్ గా ఉందనే టాక్ వచ్చింది. శివకార్తికేయన్ మార్క్ కామెడితో రూపొందింది. అయితే ఈ మూవీ రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ మధ్య ఓటీటీలో సినిమాలు చూస్తూ, అందులో ఉండే పొరపాట్లను గమనించి, మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం, అవి కాస్త వైరల్ అవడం సాధారణం అయిపోయింది.
ఓటీటీలో ఈ మూవీని చూసి, ఇందులోని ఒక పొరపాటును గమనంచిన ఒక నెటిజెన్, హర్ష్ మీమర్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో దానికి సంబంధించిన వీడియోకి ‘ఎడిటింగ్ చూసుకోవాలి కదా’ అంటూ షేర్ చేశాడు. ఆ వీడియోలో బోర్డు పై ముందు తమిళంలో మా భూమి అని, వెంటనే తెలుగులోకి మారుతుంది. దీనిపై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించింది. సుశాంత్ కీలక పాత్రలో నటించాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 11న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకున్న తీవ్రమైన ట్రోలింగ్ కు గురి అయ్యింది. ఈ మూవీలోని సీన్స్ ను షేర్ చేస్తూ ఓ రేంజ్ లో నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మెహర్ రమేష్ సినిమాలకు ఇతర విషయాలతో ఉన్న కనెక్షన్స్ వెతికి పట్టుకొని మరి నెటిజెన్లు వైరల్ చేస్తున్నారు. మొన్నటి మొన్న మెహర్ రమేష్ సినిమాలు ప్లాప్ అయిన ఏడాది జరిగిన ప్రపంచ కప్ ఇండియకే వచ్చిందనే వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘నేనింతే’ సినిమాలో మెహర్ రమేష్ తీసిన షాడో మూవీ గురించి ముందే చెప్పారనే విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
నేనింతే మూవీలో బ్రహ్మానందం తీసిన మూవీ పేరు షాడో. ఆ మూవీలోని పోస్టర్ పై ఉన్న షాడో ఫాంట్, మెహర్ రమేష్ తీసిన మూవీ షాడో ఫాంట్ ఒకేలా ఉంటాయి. నేనింతే మూవీ 2008 లో రిలీజ్ అయ్యింది. ఇక మెహర్ రమేష్ తీసిన షాడో మూవీ 2013 లో రిలీజ్ అయ్యింది. దాంతో మెహర్ రమేష్ షాడో మూవీ గురించి పూరి జగన్నాధ్ నేనింతే సినిమాలో ముందే చెప్పారా అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
జైలర్ మూవీని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు. ఈ మూవీలో ప్రధాన పాత్రలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించగా, ఆయన భార్యగా రమ్యకృష్ణ, కొడుకుగా యంగ్ హీరో వసంత్ రవి, కోడలిగా మిర్నా మేనన్ నటించారు. మనవడిగా నటించిన బాలనటుడు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు. దాంతో నెటిజెన్లు ఆ అబ్బాయి ఎవరా అని నెట్టింట్లో వెతుకుతున్నారు.
ఆ బాలనటుడి పేరు రిత్విక్ అతన్ని రీతు రాక్స్ అని కూడా పిలుస్తారు. జైలర్ మూవీ కన్నా మూడు పలు సినిమాలలో రిత్విక్ నటించాడు. అతని మొదటి సినిమా O2 (ఆక్సిజన్). ఈ మూవీలో నయనతార కుమారుడి పాత్రలో నటించాడు. ఆ తరువాత కార్తీ హీరోగా నటించిన సర్దార్ మూవీలో లైలా కొడుకుగా కీలక పాత్రలో నటించాడు. ఈ అబ్బాయికి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. దాని ద్వారానే అతను సినిమాల్లోకి వచ్చాడు.
యూట్యూబ్ చైల్డ్ గా పాపులర్ అయిన రిత్విక్, తన యూట్యూబ్ ఛానెల్ ‘రీతు రాక్స్’ లో డిఫరెంట్ గెటప్లు ధరించి, నటించిన వీడియోల ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఈ ఛానెల్ ను రిత్విక్ తండ్రి జోతిరాజ్ చూసుకుంటాడు. ఆగస్ట్ 2023 నాటికి, రిత్విక్ యూట్యూబ్ ఛానెల్ రీతు రాక్స్ 2.36 మిలియన్ సబ్స్క్రైబర్ లు ఉన్నారు. అతని వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో మిలియన్ల వ్యూస్ ను సంపాదించాయి.
ప్రేమ అనేది నమ్మకం, ఎదుటి వ్యక్తి ఇచ్చే గౌరవం, కేరింగ్ లాంటి వాటితో నిలబడుతుంది. కానీ కండిషన్లు, డిమాండ్లతో ఏ బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. అయితే ఒక వ్యక్తి తన గర్ల్ఫ్రెండ్ పాటించాల్సిన 15 రూల్స్ చెప్పాడట. దానికోసం ఓ లిస్ట్ కూడా ఇచ్చాడట. ఆమె ఆ లిస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానిని చూసినవారు షాక్ అవుతున్నారు. నెటిజెన్లు అతని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ట్రోల్ చేస్తున్నారు. 

మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండవ సీజన్ కి హీరో నాని హోస్ట్ గా చేశారు. మూడవ సీజన్ నుండి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక రాబోయేగా సీజన్ కి కూడా ఆయనే హోస్ట్. బిగ్ బాస్ సీజన్ 7 ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేసిన ప్రోమోలు ఈ సీజన్ పై అంచనాలను పెంచుతున్నాయి. ఏడవ సీజన్ సరికొత్తగా ఉండబోతుందని నాగార్జున ప్రోమోలలో హింట్ ఇస్తూ, ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచారు. ఇక ఈసారి ప్రోమోలను కూడా భిన్నంగా ప్లాన్ చేశారు.
తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోమో నటించిన అమ్మాయి ఎవరా అని నెటిజెన్లు ఆరా తీస్తూ, ఆన్ లైన్ లో వెతుకుతున్నారు. అయితే తాజాగా వచ్చిన ప్రోమో కనిపించిన అమ్మాయి పేరు అలేఖ్య రెడ్డి. కొత్త నటి కాదు. ఆమె ఇప్పటికే పలు తెలుగు చిత్రాలలో నటించింది. అయితే ఆమె చేసింది ఎక్కువగా సైడ్ రోల్స్ కావడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఈ ప్రోమోతో ఆమె ప్రేక్షకుల దృష్టిలో పడడంతో ఆమె గురించి వెతుకుతున్నారు.
అలేఖ్య రెడ్డి ఇంటింటి రామాయణం, అశోక వనంలో అర్జున కల్యాణం , అర్థమైందా అర్జున్ కుమార్ వంటి చిత్రాలలో సినిమాల్లో నటించింది. అలేఖ్య రెడ్డి ఒక్క ప్రోమోలోనే నటించిందా? లేదా బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గా కూడా ఉంటుందా అనే విషయం తెలియాల్సిఉంది. ఇక రాబోయే బిగ్ బాస్ సీజన్లో దాదాపు ఇరవై మంది పోటీదారులు పాల్గొంటున్నారని సమాచారం.వీరిలో ఎక్కువగా సెలెబ్రెటీలు ఉన్నట్టు తెలుస్తోంది.
గుంటూరు కారం సినిమా ప్రారంభం అయినప్పటి నుండి ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ మూవీ పై ఎన్నో ప్రచారాలు వినిపిస్తున్నాయి. గుంటూరు కారం మూవీ షూటింగ్ కొనసాగుతుందా? ఆగిపోతుందా? అన్న విషయం సస్పెన్స్గా మారింది. ఈ మూవీ నుంచి హీరోయిన్ పూజాహెగ్డేతో పాటుగా సినిమాటోగ్రాఫర్ మధ్యలోనే మూవీ నుండి తప్పుకోవడం, షూటింగ్ కూడా పలుమార్లు వాయిదా పడుతుండడం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది.
ఈ సినిమా స్టోరీకి సంబంధించి ప్రచారాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐఎమ్డీబీ సైట్లో గుంటూరు కారం మూవీ స్టోరీకి సంబంధించిన సినాప్సిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మహేష్బాబు గుంటూరు సిటీకి డాన్గా నటిస్తున్నట్లు ఆ సినాప్సిస్ లో పేర్కొన్నారు. గుంటూరు సిటీలో జరుగుతున్న అన్యాయాల పై, అక్రమాల పై పోరాటం చేస్తున్న ఒక జర్నలిస్ట్తో సూపర్ స్టార్ మహేష్బాబు ప్రేమలో పడతాడు.
ఆమె లక్ష్యాన్ని సాధించడం కోసం ఆ డాన్ ఎలా తోడుగా నిలుస్తాడు అనేది ఈ మూవీ స్టోరీ అని ఈ సినాప్పిస్లో కనిపిస్తోంది. త్రివిక్రమ్ మహేష్బాబు క్యారెక్టర్ను సర్ప్రైజ్ ట్విస్ట్తో డిజైన్ చేసినట్లుగా దానిలో చూపించారు. ఈ విషయం నిజమా? కాదా? అనేది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. ఇక ఈ మూవీలో జర్నలిస్ట్ గా మీనాక్షిచౌదరి, మహేష్బాబుకు మరదలి పాత్రలో శ్రీలీల నటిస్తున్నట్లు తెలుస్తోంది.
సమంత, విజయ్ దేవరకొండ కలిసి మహానటి మూవీలో కనిపించారు. కానీ హీరో హీరోయిన్లుగా కాదు. ఖుషిలో వీరిద్దరూ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఇప్పటికే మూవీ యూనిట్ ప్రమోషన్స్ను మొదలు పెట్టింది. ఇటీవల నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్లో విజయ్, సమంతల డ్యాన్స్ పర్ఫామెన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ కార్యక్రమంలో సింగర్స్ పాటలు పాడి, ప్రేక్షకులను అలరించారు. అయితే మజిలీ మూవీ పాటకు సమంత ఎమోషనలైనట్లుగా తెలుస్తోంది. స్టేజీపై సింగర్ ప్రియతమా పాటను పాడుతున్న టైమ్ లో సమంత భావోద్వేగానికి లోనైంది. గత జ్ఞాపకాలు ఆ పాట ద్వారా గుర్తుకు రావడంతో వస్తున్న కన్నీళ్లు ఆపడానికి ప్రయత్నించిందని, దానికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్గా అయ్యింది. ఆ వీడియోను చూసిన సమంత ఫ్యాన్స్ ఆమె పరిస్థితి పై జాలి పడుతున్నారు. కొందరు కాలమే సమంత బాధను నయం చేస్తుందంటున్నారు.
మరికొందరు అభిమానులు సమంతను అలా చూస్తుంటే తమకు కూడా ఏడుపు వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్యను సమంత మర్చిపోలేకపోతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మజిలీ మూవీలో నాగచైతన్య, సమంత భార్యాభర్తలుగా నటించారు. వీరి పెళ్లి జరిగిన తరువాత కలిసి నటించిన మొదటి సినిమా కూడా ఇదే. ఈ చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కించాడు.
వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన మూవీ ‘గాండీవధారి అర్జున’. ఈ మూవీలో విలన్గా వినయ్ రాయ్ నటించారు. రోషిణి ప్రకాష్, అభినవ్ గోమతం, నరేన్, మనీష్ చౌదరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం మిక్కీ జె మేయర్ అందించారు.
మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ చిత్రం పై అంచనాలు పెరిగేలా చేశాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అది మాత్రమే కాకుండా సెన్సార్ సభ్యులు ఈ మూవీ పై పాజిటివ్గా స్పందించినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయని, ట్విస్టులు ఆకట్టుకుంటాయని సెన్సార్ బృందం చెప్పినట్లు సమాచారం. ఈ మూవీ తరువాత వరుణ్ తేజ్ తొలిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఆ మూవీ ‘మట్కా’ అనే టైటిల్ తో రీసెంట్ గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కరుణ కుమార్ డైరెక్షన్ చేస్తుండగా, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదే కాకుండా మరో మూవీలో కూడా వరుణ్ తేజ్ నటిస్తున్నారు. ఆ మూవీ పేరు ‘ఆపరేషన్ వాలెంటైన్’.
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ ట్రాన్స్జెండర్గా నటించిన ఈ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్లుగా రూపొందింది.ఈ సిరీస్ కథలోకి వెళ్తే, గణేశ్ (కృతిక) ఒక పోలీసు ఆఫీసర్ కుమారుడు. అతనికి చిన్నప్పటి నుండే అమ్మాయిగా మారాలనె కోరిక ఉంటుంది. స్కూల్లో టీచర్ పెద్దగా అయిన తరువాత ఏమవుతావ్?’ అని అడిగితే అమ్మను అవుతానని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఈ విషయాన్ని గణేశ్ చెప్పకుండానే ఇంట్లో వారికి అర్థమవుతుంది. ఆ తరువాత గణేష్ తల్లి చనిపోతుంది.
అప్పుడు తండ్రి గణేష్ తో నీ నిర్ణయాన్ని మార్చుకుంటేనే ఇంట్లో ఉండమని లేదంటే బయటికి వెళ్ళమని చెబుతాడు. 15 సంవత్సరాల వయసులో గణేశ్ ఇంట్లోంచి బయటకు వచ్చి, సర్జరీ ద్వారా అమ్మాయిగా మారి, గౌరి (సుస్మితా సేన్) గా పేరు మార్చుకుంటాడు. అమ్మ కావలనే తన కోరికను గౌరి నెరవేర్చుకుందా? ట్రాన్స్జెండర్లకు గుర్తింపు తీసుకురావడానికి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది? అనేది మిగతా కథ.
సుస్మితా సేన్ నటన ఇలాంటి క్యారెక్టర్ ను అంగీకరించడమే సాహసం అనుకుంటే ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారు. అనేది. ఆమె ట్రాన్స్జెండర్ పాత్రలో జీవించింది. గణేశ్ పాత్రలో కృతిక డియో, తండ్రి పాత్రలో నందు యాదవ్, మిగతా నటీనటులు కూడ బాగా నటించారు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. విజువల్స్, రవి జాదవ్ టేకింగ్ బాగుంది.