ప్రస్తుతం ప్రభాస్ అనగానే అందరికీ గుర్తుకు వస్తున్న మూవీ ఆదిపురుష్. ఇప్పటివరకు రామాయణ ఇతిహాసం ఆధారంగా ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. ఆ చిత్రాలను చూసిన ప్రేక్షకులలో భక్తి పారవశ్యం కలిగేది. అయితే ఇటీవల రిలీజ్ అయిన ‘ఆదిపురుష్’ ను మాత్రం వివాదాలు చుట్టూముట్టాయి.
‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్ ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే నెటిజెన్లు తిడుతున్నారు. రచయితను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా ఆదిపురుష్ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నారనే వార్త ఒకటి నెట్టింట్లో తిరుగుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
‘బాహుబలి’ సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. వరుసగా డీఫెరెంట్ సినిమాల్ని చేస్తున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ముడు వైవిధ్యమైన సినిమాలే. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించినా, హిట్ కాలేదని చెప్పవచ్చు. ఆదిపురుష్ సినిమా పై వస్తున్న విమర్శలు, వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రిలీజ్ అయ్యి పది రోజులు కావొస్తున్న ఏమాత్రం తగ్గడం లేదు.
సినీ, రాజకీయ ప్రముఖుల నుండి కూడా విమర్శలు వస్తున్నాయి. తాజాగా వీరంద్ర సెహ్వాగ్ కూడా ఈ మూవీ పై కామెంట్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ మూవీలో నటించిన వారెవరూ బయట కనిపించడం లేదు. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారనే అనే వార్త బయటికి వచ్చింది. ఒక వైపు ఓంరౌత్ ను నెట్టింట్లో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
మరో వైపు బ్యాన్ చేయాలనే నిరసనలు వినిపిస్తున్నాయి. ఓంరౌత్ కు జరిగేది కనిపిస్తున్నా, హీరో ప్రభాస్ ను ఆదిపురుష్ సీక్వెల్ ప్రతిపాదనతో సంప్రదించాడంట. అయితే ప్రభాస్ సున్నితంగా రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. ఈ విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా పై ఇన్ని విమర్శలు, వివాదాలు వచ్చాయి. ఇక సీక్వెల్ చేస్తే ఎన్ని సమస్యలు ఎదురవుతాయో అని ప్రభాస్ తిరస్కరించి ఉండవచ్చు అని అంటున్నారు.
Also Read: “ఆదిపురుష్” సినిమా గురించి.. ఈ నెటిజెన్ పోస్ట్ చూస్తే నవ్వాపుకోలేరు..!!

తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మక రూపొందిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం వరకు చిత్రీకరణ పూర్టి చేసుకుందని సమాచారం. ఈ సినిమా పై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రంలో నటించేవారి రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన పాత్రలు పోషిస్తున్న యాక్టర్ల పారితోషికమే రూ. 200 కోట్లు అని తెలుస్తోంది.
1. ప్రభాస్:
2. దీపికా పదుకొణె:
3. అమితాబ్ బచ్చన్:
4. కమల్ హాసన్:
5. దిశా పటానీ:
ఈ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఏఎంబీ సినిమాస్ ఒకటి. ఏఎంబీ మల్టీప్లెక్స్ కు ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మల్టీప్లెక్స్ లో రిలీజ్ అయిన సినిమాలకు బుకింగ్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. మహేష్ ఇమేజ్ ఈ మల్టీప్లెక్స్ కు ప్లస్ గా మారింది. ఏఎంబీ మల్టీప్లెక్స్ లో చాలా ప్రత్యేకతలు ఉండటంతో కొత్త సినిమాల ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. అలాగే చిత్రాలకు సంబంధించిన చిన్నచిన్న వేడుకలను కూడా ఏఎంబీ మల్టీప్లెక్స్ లో నిర్వహిస్తున్నారు.
ఇటీవల అమీర్ పేట్ లో అల్లు అర్జున్ ‘ఎఎఎ’ సినిమాస్ ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో ఎఎఎ మల్టిప్లెక్స్ ను నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఎఎఎ సినిమాస్ ను ఏఎంబీ సినిమాస్ తో పోలుస్తూ సోషల్ మీడియాలో నెటిజెన్లు తమ అభిప్రాయాలను చెప్తున్నారు. ఎఎఎ మల్టీప్లెక్స్ బాగానే ఉన్నప్పటికీ, ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ ఓ మెట్టు పైనే ఉందని ఈ రెండు మల్టీప్లెక్స్ లలో మూవీస్ చూసిన వారు కామెంట్లు చేస్తున్నారు.
ఎఎఎ సినిమాస్ మల్టీప్లెక్స్ లో ఉన్న ఎల్ఈడీ లైట్ల వెలుగు కళ్ళకు ఇబ్బంది కలిగేలా ఉందని అంటున్నారు. ఇందులో ఉన్న చిన్నచిన్న లోపాలను సరిదిద్దితే ఎఎఎ సినిమాస్ కు ఎదురు ఉండదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్ అమీర్ పేట్ లో నిర్మించడం ప్లస్ గా మారింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నాగేశ్వరరావు అనే వ్యక్తి 25 సంవత్సరాల క్రితం శ్రీనివాస్నగర్ లో ఇంటిని నిర్మించుకున్నాడు. అయితే ఆ ఇంటి ముందు రోడ్డు ఎత్తు పెరగడం వల్ల వర్షాకాలంలో వరద నీళ్లు నాగేశ్వరరావు ఇంట్లోకి వస్తున్నాయి. దాంతో ఈ సంవత్సరం వరద నీళ్ళు తన ఇంట్లోకి రాకుండా అతను చర్యలు తీసుకోవాలను కున్నాడు. అందులో భాగంగా తన ఇంటిని ఎత్తును కొన్ని అడుగులు పెంచాలని భావించాడు. ఈ పనులను ఒక కాంట్రాక్టర్ కు అప్పగించాడు. హైడ్రాలిక్ జాకీలను ఉపయోగించి నాగేశ్వరరావు ఇంటిని మెల్లగా పైకి లేపడం ప్రారంభించారు. ఈ క్రమంలో హైడ్రాలిక్ జాకీలు పక్కకు జరిగాయి. దాంతో ఆ ఇల్లు పక్కనే ఉన్న మరో బిల్డింగ్ పైన వాలింది.
ఈ బిల్డింగ్ మొత్తం పక్కనే ఉన్న బిల్డింగ్ పైన వాలడంతో పక్క బిల్డింగ్ లో ఉన్న వారంతా భయంతో బయటకు పరుగెత్తారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన జీహెచ్ఎంసీ ఆఫీసర్లు నాగేశ్వరరావు ఇంటిని పరిశీలించారు. జాకీలు పక్కకు జరగడం వల్ల బిల్డింగ్ పక్కేన ఉన్న బిల్డింగ్ పైన వాలిందని ఆఫీసర్లు తెలిపారు. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే మరమ్మతులు చేపట్టడంతో పోలీసులు నాగేశ్వరరావు పై కేసు రిజిస్టర్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు నాగేశ్వరరావు బిల్డింగ్ ని కూల్చేయాలని నిర్ణయించారు.
హనుమంతుడి డైలాగ్స్ పై తీవ్ర అభ్యంతరం రావడంతో చిత్రబృందం ఆ డైలాగ్స్ ను మార్చిన సంగతి తెలిసిందే. మూవీలోని కొన్ని సన్నివేశాల పట్ల మండిపడుతున్నారు. ముఖ్యంగా రావణుడి పాత్ర తీరు పై విమర్శలు చేస్తున్నారు. ఈ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇక ఇంద్రజిత్ సీతాదేవి గొంతు కోసినట్టు ఒక సీన్ లో చూపించారు. ఇది ఫిక్షన్. కొందరు రాజకీయ నేతలు ఏవేవో ఊహించుకుని రామాయణం మార్చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు.
తాజాగా ఈ సినిమా పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు. “ఆదిపురుష్ మూవీ చూసిన అనంతరం బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అర్థమైందంటూ” ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ ట్వీట్ పై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్ పై సెహ్వాగ్ను కొందరు ట్రోల్ చేస్తుంటే, కొందరు కాస్త బెటర్గా తీయాల్సింది అని సెహ్వాగ్ కు మద్ధతిస్తున్నారు.
ప్రభాస్ అభిమానులు సెహ్వాగ్ చేసిన కామెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ మూవీని అంగీకరించినందుకే బాహుబలి (ప్రభాస్)ను కట్టప్ప చంపాడు అనే అర్థంతో ఈ ట్వీట్ చేశారని ప్రభాస్ అభిమానులు సెహ్వాగ్ పై ఫైర్ అవుతున్నారు. అరె మీరూ మొదలుపెట్టారా అంటూ అభిమానులు తిట్టిపోస్తున్నారు.
ఆదిపురుష్ సినిమాలో ఇంద్రజిత్ పాత్రలో నటించిన యాక్టర్ పేరు వత్సల్ శేత్. 1980 లో ఆగస్టు 5న వత్సల్ సేథ్ జన్మించాడు. వత్సల్, ఉత్పల్ షాంఘ్వీ గ్లోబల్ స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తి చేసి, ముంబైలోని విలే పార్లేలోని గోకలిబాయి పునమ్చంద్ పీతాంబర్ హైస్కూల్లో తన ఇంటర్మీడియట్ ను పూర్తి చేశాడు. ముంబైలోని మిథిబాయి కాలేజీ నుండి గణితశాస్త్రంలో పట్టా పొందారు. వత్సల్ మొదట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నాడు.
కాని జస్ట్ మొహబ్బత్లో అవకాశం రావడంతో బుల్లితెరపై అడుగుపెట్టాడు. ఆ తరువాత పలు టెలివిజన్ షోలలో నటించారు. ఆ ఆతరువాత బాలీవుడ్ సినిమాలలోనూ నటించాడు. 2004లో వచ్చిన టార్జాన్: ది వండర్ కార్ అనే చిత్రంలో రాజ్ చౌదరి అనే పాత్రను చేశాడు. ఇదే అతని మొదటి సినిమా. 2014లో వచ్చిన థ్రిల్లర్ సిరీస్ ఏక్ హసీనా థీ, 2017లో లవ్-సాగా సిరీస్ హాసిల్ లో నటించి పాపులర్ అయ్యాడు. వత్సల్ నటుడు మాత్రమే కాదు మోడల్ కూడా.
2020లో వత్సల్ శేత్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో 36వ ప్లేస్ లో నిలిచాడు. వత్సల్ శేత్ తన సహనటి ఇషితా దత్తాను 2017 లో వివాహం చేసుకున్నాడు. ఈ జంట తరచు విహారయాత్రలు చేస్తూ, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమాలో ఇంద్రజిత్ గా నటించి, తెలుగు ఆడియెన్స్ కి ముందుకు వచ్చారు.
“ఆది పురుష్ మూవీ చూసారా.. చూస్తే మీ అభిప్రాయం పంచుకోగలరు” అని అడిగిన ప్రశ్నకు కిరణ్ అనే యూజర్ ఆదిపురుష్ ఇంద్రజిత్ పాత్ర ఫోటోను షేర్ చేస్తూ ఇలా సమాధానం ఇచ్చారు. “ఈ వ్యక్తి పూరీ జగన్నాధ్ చిత్రాలలో బ్యాంకాక్ లో తప్పుడు పదార్ధాలు అమ్మేవాడిలా ఉన్నాడు. రావణుడి కుమారుడు అయిన ఇంద్రజిత్ కి ఈ టాటూలు ఏంటో, ఆ హెయిర్ స్టైల్ ఏమిటో అర్ధం కావట్లేదని అన్నారు.
ఇది మాత్రమే కాకుండా దర్శకుడు ఓం రౌత్ సినిమాటిక్ లిబర్టీ పేరుతో రావణుడితో వెల్డింగ్ వర్క్, అనకొండలతో మసాజ్ చేయించుకున్నట్లు ఇలాంటివి చాలానే చేయించాడు. రామాయణ క్యారెక్టర్ల ఔచిత్యాన్ని తగ్గించేలా తెరకెక్కించాడు. ఆదిపురుష్ మూవీని సినిమాటిక్ లిబర్టీ పేరుతో రామాయణాన్ని ఇంతగా వక్రీకరించి తియ్యాలనే ఆలోచన ఓం రౌత్ ఎలా వచ్చిందో తెలియదు.
రామాయణం చదివిన వారికి ఇలాంటి సీన్స్ పంటికింద పడిన రాళ్ళలా అనిపిస్తాయి. ఆ ఇబ్బందిని పక్కన పెడితే ఆది పురుష్ మూవీ బాగుంది. ఇక ఈ మూవీ పై వస్తున్న విమర్శలు, మీమ్స్ ని పక్కనపెట్టి థియేటర్ లో చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది” అని కిరణ్ వివరించారు.
టైటానిక్ నౌక 1912లో సముద్రంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నౌక శకలాలను చూడడం కోసం పాకిస్తాన్ బిలియనీర్ షెహజాదా దావూద్, ఆయన తనయుడు సులేమాన్, బ్రిటీష్ బిజినెస్ మెన్ హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ నేవీ ఆఫీసర్ పాల్ హెన్నీ, ఓషన్ గేట్ ఫౌండర్ స్టాక్టన్ రష్ టైటాన్ జలాంతర్గామిలో ప్రయాణించారు.
ఈ అడ్వెంచర్ ట్రిప్ కు టికెట్ 2 కోట్ల పైనే ఉంటుంది. అత్యంత ఖరీదైన టూర్ అయినప్పటికీ సాహసాలు ఇష్టపడే వారు సముద్రం అడుగున ఉన్న టైటానిక్ శిథిలాలను చూడడానికి ఇష్టపడుతుంటారు. ముగ్గురు పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బందితో ఈ జలాంతర్గామి బయలుదేరింది. అయితే సముద్రం లోపలికి వెళ్లిన అనంతరం జలాంతర్గామిలో ఏదో సమస్య వచ్చింది. సిగ్నల్ కట్ అయింది. ట్రిప్ ను ప్రారంభించిన గంట 45 నిముషాల్లోనే జలాంతర్గామి కమ్యూనికేషన్ కోల్పోయింది. అయితే జలాంతర్గామిలో మరో 72 గంటలవరకు సరిపడే ఆక్సిజన్ ఉన్నట్లు సమాచారం.
జలాంతర్గామి లోపల చలి ఎక్కువయినపుడు ఆక్సీజన్ ఎక్కువ అవసరం ఉంటుందని, అందరు ఒక్కదగ్గర ఉండడం ద్వారా శరీరంలోని వేడిని ఆదా చేసుకోవచ్చని సెయింట్ జాన్స్ మెమోరియల్ యూనివర్సిటీ హైపర్బరిక్ మెడిసిన్ ఎక్స్పర్ట్ డాక్టర్ కెన్ లీడెజ్ అన్నారు. ఆక్సీజన్ నిల్వలు తగ్గిపోవడం మాత్రమే సమస్య కాదని, ఆ నౌకలో విద్యుత్ నిలిచిపోయిన ప్రమాదమే అని అన్నారు. జలాంతర్గామి లోపలి ఆక్సీజన్, కార్బన్ డయాక్సైడ్ల లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో విద్యుత్ పాత్ర ఉంటుంది.
ఆక్సీజన్ లెవెల్స్ తగ్గిపోయిన కొద్ది, కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి. అలా జరిగితే వారి కండిషన్ సీరియస్ అవుతాయి. కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరిగిన కొద్దీ బాడీ మందకొడిగా మారి, మత్తు మందు పీల్చినట్లుగా వారంతా నిద్రలోకి వెళతారని, మనిషి బ్లడ్ ఫ్లోలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ అయితే వారు హైపర్కాప్నియాకు గురవుతారు. వెంటనే ట్రీట్మెంట్ అందకపోతే చనిపోతారు’’ అని చెప్పారు.
రాకేష్ మాస్టర్ చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడి, కొరియోగ్రాఫర్ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కానీ అంతే వేగంగా ఆయన కిందికి పడిపోయారు. ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ పని చేశారు. చివరి రోజుల్లో యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలలో ఆయన చేసిన కామెంట్స్ తో రాకేష్ మాస్టర్ తన జీవితాన్ని అట్టడుగు స్థాయికి పడిపోయేలా చేసుకున్నారు.
రాకేష్ మాస్టర్ బతికి ఉన్నన్ని రోజులు యూట్యూబ్ చానెళ్లు తమ లాభం కోసం తన తండ్రిని చెడుగా చూపించారని, మాస్టర్ తనయుడు చరణ్ ఛానెళ్లను తప్పు పడుతూ, యూట్యూబ్ చానెళ్ల పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన తండ్రి చనిపోవడానికి కారణం యూట్యూబ్ చానెళ్ళే అని అన్నారు. తన తండ్రికి ఇలా జరగడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా. అనేక యూట్యూబ్ ఛానెల్స్ తన తండ్రిని స్వలాభం కోసం వాడుకున్నాయని, తన తండ్రిని చెడుగా చిత్రీకరించారని అన్నాడు.
ఆ వీడియోలను వెంటనే ఆపమని, ఇకపై ఆ వీడియోలను వేయడం మానేయమని అన్నారు. సోషల్ మీడియాలో మా ఫ్యామిలీ మెంబర్స్ ను గురించి మాట్లాడుతూ వేధించవద్దని అన్నారు. మా ఫ్యామిలికి చేసిన నష్టం చాలని చరణ్ ఆవేదనతో అన్నారు. ఎవరైనా మళ్లీ మా జీవితాల్లోకి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రాకేష్ మాస్టర్ కొద్దికాలంగా ఎవరు లేని వాడిలా అనాధశ్రమంలో జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఇక యూట్యూబ్ ఛానల్స్ లో కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఒకప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్ ఎందుకిలా అయ్యాడని అనుకున్నారు. 1500 సినిమాలకు కొరియోగ్రఫీ చేసి, చాలా సంవత్సరాలు పరిశ్రమలో ఉన్న రాకేష్ మాస్టర్ ఏమి సంపాదించుకోలేదా, అందువల్లే ఆఖరి దశలో అనాధశ్రమంలో జీవించారా అనే సందేహాలు చాలా మందికి వస్తున్నాయి.
ఆయన చనిపోవడానికి కొన్ని నెలల ముందు ఆ మహిళతో విభేదాలు రావడంతో ఆమెకు కూడా దూరమయ్యారు. ఇక ఆస్తుల విషయానికి వస్తే రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు ఆస్తులు బాగానే సంపాదించారని సమాచారం. ఆయనకు జూబ్లీహిల్స్ లో పెద్ద బంగ్లాతో పాటు, హైదరాబాద్ శివార్లలో 3 ఎకరాల ల్యాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భూమి విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. రాకేష్ మాస్టర్ ఆస్తుల విలువ దాదాపు 50 కోట్లపైనే ఉంటుందని అంటున్నారు.