రామాయణ మహాభారతాలు రాముడు, కృష్ణుడు ఉన్నంతవరకు అందరికీ తెలిసిందే కానీ ఆ తరువాత ఏం జరిగింది అనే విషయం చాలామందికి తెలియదు. అలాగే మహాభారతం కూడా కురుక్షేత్రం వరకు చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఆ తరువాత పాండవులు ఏమయ్యారు, కృష్ణుడు ఎలా మరణించాడు, యదు వంశం ఎందుకు నాశనం అయింది వంటి విషయాలు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులపాటు జరుగుతుంది. దేశంలోని 80% జనాభా ఈ యుద్ధంలో మరణిస్తారు. కౌరవులందరూ మరణించడంతో యుద్ధానికి కారణమైన శ్రీకృష్ణుడిని నా వంశం నాశనమైనట్లే నీ యదువంశం కూడా త్వరలోనే నాశనం అయిపోతుందని గాంధారి శపిస్తుంది.

పాండవులు హస్తినాపుర రాజ్యానికి పాలకులవుతారు. గాంధారి శపించిన 36 సంవత్సరాల తరువాత ఆమె శాపం ప్రకారమే ద్వారకలో అలజడులు చోటు చేసుకుంటాయి. ఇక యాదవ కులం అంతమయ్యే సమయం ఆసన్నమైందని గ్రహిస్తాడు కృష్ణుడు. తపస్సు చేసుకోవడానికి దట్టమైన అడవికి వెళ్తాడు. అదే అడవిలో ఒక వేటగాడు కృష్ణుడి పాదాలని జింకగా భావించి అతనిపై బాణ ప్రయోగం చేయడంతో అక్కడే దేహాన్ని విడుస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.

ఇప్పుడు ఎవరైతే కృష్ణుడి పాదానికి బాణం వేసారో అతనే గత జన్మలో వాలి. శ్రీకృష్ణుడు ఎంతకీ కనిపించకపోవడంతో అర్జునుడు గోపాలుడి ని వెతుకుతూ వస్తుండగా అతనికి కృష్ణుడి పార్థివ దేహం కనిపిస్తుంది. అప్పటికే కృష్ణుడు మరణించి నాలుగు రోజులు కావడంతో అక్కడే తన సారధితో కలిసి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాడు అర్జునుడు. అప్పటికే ద్వారక సముద్రంలో మెల్ల మెల్లగా కలిసిపోతూ ఉంటుంది.

అదే ద్వాపర యుగానికి అంతం, కలియుగానికి ఆరంభం.ఈ సమయంలోనే ధర్మరాజు రాజ్యాన్ని అర్జునుడు కుమారుడైన పరీక్షిత్ కి అప్పగించి తన భార్య, మిగిలిన సోదరులతో కలిసి స్వర్గలోకానికి చేరేందుకు హిమాలకి వెళ్ళిపోతారు. అక్కడనుంచి స్వర్గారోహణ చేసే సమయంలో మధ్యదారిలో యమధర్మరాజు ఒక శునకంలా మారువేషంలో పాండవులతో కలిసి ప్రయాణిస్తాడు. దారిలోనే ధర్మరాజు తప్ప మిగిలిన వారందరూ ప్రాణాలు విడిచి పెట్టేస్తారు. వారికి నరకం ప్రాప్తిస్తుంది ధర్మరాజు మాత్రం స్వర్గం వరకు చేరుకుంటారు











మే 2014న ఇండియాకి 14వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోడీ పూర్తి పేరు నరేంద్ర దామోదరదాస్ మోడీ. ఆయన గుజరాత్ లో 1950లో జననం సెప్టెంబర్ 17న వాద్నగర్లో జన్మించారు. అక్కడే ఆయన సెకండరీ విద్యను కంప్లీట్ చేశారు. 8 సంవత్సరాల వయసులో ఆర్ఎస్ఎస్తో పరిచయం ఏర్పడింది. మోదీ పాఠశాల నుంచి వచ్చిన వెంటనే వాద్నగర్ స్టేషన్ దగ్గరలో ఉన్న తండ్రి టీ దుకాణానికి వెళ్లేవారు. టీ అమ్మడంలో తండ్రికి సహాయం చేసేవారు.
తన కుంటుంబం చిన్నతనంలో నిర్ణయించిన ప్రకారంగా మోడి 18 ఏళ్ల వయస్సులో, 17 ఏళ్ల వయసు ఉన్న జశోదాబెన్ మోడీని వాద్నగర్ కుల సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం అయిన వెంటనే ఆమెను, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడని తెలుస్తోంది. రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన మోదీ కుటుంబాన్ని కలిశారు. మోడి తల్లి ఒత్తిడితో, జశోదాబెన్ వారి వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి మోడి ఇంటికి వచ్చింది. కానీ మోడి ఈ ఏర్పాటును వ్యతిరేకించాడు.
తన సిద్ధాంతాల ప్రకారమే తన జీవితాన్ని కొనసాగిస్తానని వెల్లడించాడు. అంతే కాకుండా జశోదాబెన్ చదువు కోవాలని ప్రోత్సహించాడు. ఆ తరువాత ఆమెను ఎప్పుడు భార్యగా వెల్లడించలేదు. ఆ తర్వాత 1985లో బీజేపీతో కలిశారు. నాలుగు దశాబ్దాల తర్వాత చట్టబద్ధంగా ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించాల్సి రావడం, ఆయన పెళ్లి గురించి గుజరాత్ రాజకీయాలలో గుసగుసలు వినిపించడంతో జశోదాబెన్ ని భార్యగా బహిరంగంగా ఒప్పుకున్నారు. 2014 లో ఎన్నికల అఫిడవిట్లో వివాహ విషయాన్ని ప్రస్తావించడంతో అందరికీ తెలిసింది. జశోదాబెన్ మోడి ఒక రిటైర్డ్ టీచర్.












