సినిమా హీరోలు చాలా మంది సినిమాల్లోకి రాకముందు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటారు. అంటే, అంతకు ముందు లావుగా ఉండడం, సినిమాల్లోకి రావడానికి సన్నబడడం, ఇంకా నటనకు సంబంధించిన విషయాలు నేర్చుకోవడం, డాన్స్, ఫైట్స్ లాంటివి నేర్చుకోవడం చేస్తుంటారు.
కొంత మంది ఈ విషయాలన్నిటినీ చిన్నప్పటి నుంచే నేర్చుకుంటే, కొంత మంది మాత్రం సినిమాల్లోకి వచ్చే ముందు వీటిపై అవగాహన పెంచుకుంటారు.

అలా సినిమా ఇండస్ట్రీకి చెందిన కుటుంబం నుండి వచ్చిన కొంత మంది హీరోలు కూడా ఇండస్ట్రీలోకి వచ్చేముందు నటనకు సంబంధించిన విషయాలను తెలుసుకొని మేకోవర్ అయ్యారు. ఈ పైన ఫోటోలో ఉన్న వ్యక్తిని గమనించారా? ఇతను కూడా ఇటీవల ఒక సూపర్ హిట్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ హీరో రెండవ సినిమా కూడా ఇటీవల విడుదల అయ్యింది. ఈ పాటికే మీలో చాలా మందికి అతనెవరో తెలిసిపోయి ఉంటుంది. ఈ ఫోటోలో ఉన్నది ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన పంజా వైష్ణవ్ తేజ్.

ఇది కొన్ని సంవత్సరాల క్రితం మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫంక్షన్ లో తీసిన ఫోటో. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, వైష్ణవ్ తేజ్ తన చిన్నతనంలోనే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఒక పాత్రలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. తర్వాత వైష్ణవ్ హీరో అవ్వాలి అనుకోలేదు. కానీ ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించడంతో వైష్ణవ్ ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే, ఉప్పెన సినిమా 2020 మొదట్లోనే విడుదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. మధ్యలో సినిమా డిజిటల్ రిలీజ్ అవుతుంది అనే వార్తలు కూడా వచ్చాయి.

ఎన్నో ఓటీటీ సంస్థలు సినిమా విడుదలకి పెద్ద మొత్తం ఇవ్వడానికి సిద్దపడ్డాయి. కానీ ఉప్పెన సినిమా బృందం మాత్రం ఆ అవకాశాలని తిరస్కరించింది. ఈ సినిమా కేవలం థియేటర్లలో విడుదల అవ్వాలి అని సినిమా బృందం గట్టిగా నిర్ణయించుకుంది. అనుకున్నట్టుగానే ఉప్పెన సినిమా థియేటర్లలో విడుదల అయ్యి సంచలన విజయం సాధించింది. మొదటి సినిమా అయినా కూడా హీరో హీరోయిన్లు చాలా బాగా చేశారు అని ఎంతోమంది మెచ్చుకున్నారు. హీరో హీరోయిన్లు, విజయ్ సేతుపతితో పాటు సినిమా బృందం మొత్తానికి చాలా మంచి పేరు వచ్చింది.వైష్ణవ్ ఇటీవల కొండ పొలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.

సివిల్స్ సర్వీసెస్ కు ఎంపిక కావడానికి మూడు పరీక్షలను ఎదుర్కోవాలి. వాటిలో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ అభ్యర్థుల అకడమిక్ మరియు జనరల్ అవేర్నెస్ను మరియు విభిన్న అంశాలను పరీక్షించడం కోసం నిర్వహిస్తారు. ఇంటర్వ్యూను సివిల్ సర్వీసెస్ అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం మరియు స్వభావానికి సంబంధించిన పరీక్ష అని చెప్పవచ్చు. సివిల్స్ ఎగ్జామ్ ఎంత కఠినంగా ఉంటుందో, ఆ పరీక్ష పాస్ అయిన తరువాత అత్యంత క్లిష్టమైన ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రతి సంవత్సరం వేలాది మంది సివిల్స్ ఎగ్జామ్ రాస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రమే ఎంపిక అవుతుంటారు. దానికి ఎందుకంటే ఇంటర్వ్యూలోఆ దిగే ప్రశ్నలకు తర్కంతో ఆలోచిస్తే తప్ప జవాబులు చెప్పలేము. ఊహించని ప్రశ్నలు కూడా అడుగుతుంటారు. ఈ క్రమంలోనే సివిల్స్ ఇంటర్వ్యూలో ఒక యువకుడిని అడిగిన ప్రశ్న టాప్ ఐఏఎస్ ప్రశ్నల్లో ఒకటిగా నిలిచింది.
అది ఏమిటంటే, నువ్వు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. ఆమెకు చెవులు, కళ్ళు, నోరు పనిచేయవు. ఆమెను తాకకుండా ఎలా ప్రపోజ్ చేస్తావు? అని అడిగారు. ఇది లాజిక్ ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం, ఆ అబ్బాయి అంధుడు, చెవిటివాడు మరియు మూగవాడు కాదు కాబట్టి ప్రపోజ్ చేయగలడు. అయితే అతని ప్రతిపాదనను అమ్మాయి అర్థం చేసుకోవాలని చెప్పలేదు అని ఆ యువకుడు చెప్పాడు.












అరచేతిలో గీతాలు రకరకాలుగా ఉంటాయి. వీటితో పాటు గుర్తులు కూడా ఉంటాయి. అయితే అర చేతిలో రేఖల మధ్య ‘ఎక్స్’ (X) ఆకారంలో గుర్తు ఉంటే వారికి లైఫ్ లో తిరుగు ఉండదంట. ఇలాంటి గుర్తు ప్రపంచం మొత్తంలో 5 శాతం మందికి మాత్రమే ఉంటుందట. అరచేతిలో ఎక్స్ ఆకారంలో గుర్తు ఉండడం వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు చూద్దాం..
అర చేతిలో ఎక్స్ గుర్తు ఉన్నవారు అత్యంత ప్రతిభావంతులుగా ఉంటారట. ఆ వ్యక్తి సక్సెస్ బాటలో నడవడమే కాక ఇతరులను కూడా ఆ మార్గంలో నడిపిస్తారట. ఈ గుర్తు కలిగిన వ్యక్తులు ప్రపంచాన్ని కూడా జయిస్తారని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ అర చేతిలో ఈ ఎక్స్ గుర్తు ఉండేదట. అలాగే అలెగ్జాండర్ తన అరచేతి రేఖలను బలంగా నమ్మేవారంట. మాస్కోలో ఉండే హెచ్టీఐ యూనివర్సిటి సైంటిస్టులు చాలా మంది చేతి రేఖల పై పరిశోధనలు చేశారు.
అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ కు, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కు అర చేతిలో ఎక్స్ గుర్తు ఉండేదని సైంటిస్టులు తెలియజేశారు. పరిశోధనల ప్రకారం రెండు అర చేతుల్లో ఎక్స్ గుర్తు ఉంటే వారు జీనియస్ అని, బలవంతులుగా ఉండడంతోపాటు ఇతర వ్యక్తులను తేలికగా అంచనా వేయగలరట. అలాగే వీరిని మోసం చేయడం చాలా కష్టం. ఎక్స్ గుర్తు ఉన్నవారు శారీరకంగా, మానసికంగా శక్తివంతులుగా ఉంటారట. ఈ వ్యక్తులు పేరు ప్రతిష్టలు, సమాజంలో చాలా గౌరవం ఉంటుందని సదరు పరిశోధకులు చెబుతున్నారు.







డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి చేరువైన మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’లో విలన్ గా నటిస్తున్నారు. ఆయన నటించిన జనగణమన మూవీ 2022లో థియేటర్లలో రిలీజ్ అయ్యి, విజయం సాధించింది. ఈ మూవీలో సూరజ్ వెంజారమూడు, మమతా మోహన్దాస్ కీలక పాత్రలలో నటించారు.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, లెక్చరర్ సభా మరియం (మమతా మోహన్ దాస్)ను అత్యాచారం చేసి, ఆమె బాడీని కాల్చి రోడ్డు పక్కన పడేశారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఆమె పనిచేసిన యూనివర్సిటీ విద్యార్ధులు తమ లెక్చరర్ కు న్యాయం చేయాలని ఆందోళనకు దిగుతారు. సభా మరియం తల్లి న్యాయం కోసం పోరాటం ప్రారంభిస్తుంది. ఈ కేసును చేధించేందుకు ఏసీపీ సజ్జన్(సూరజ్ వెంజనమూడు) వస్తాడు. ఆ క్రమంలో ప్రత్యక్షసాక్షి చెప్పిన సాక్ష్యంతో నలుగురు నిందితులను పట్టుకుంటాడు.
సొసైటీ నుండి నిందితులను చంపేయాలనే డిమాండ్ వస్తుంది. పై నుంచి ప్రెజర్ ఎక్కువ అవడంతో ఏసీపీ సజ్జన్ వారిని మరో స్టేషన్ కు తరిలించే టైమ్ లో నిందితులను ఎన్ కౌంటర్ చేస్తాడు. అయితే ఈ ఎన్ కౌంటర్ పై హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కేసు పెడుతుంది. ఈ కేసులో లాయర్ అరవింద్ స్వామినాథన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఏసీపీ సజ్జన్ కు వ్యతిరేకంగా కేసు వాదిస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? అసలు అరవిందన్ ఎవరు? ఎందుకు ఎన్ కౌంటర్ చేశారు? సభా మరియం ఎలా చనిపోయింది? అనేది మిగిలిన కథ.
జన గణ మన మూవీలో ఎన్ని పాత్రలున్నప్పటికీ ప్రధమార్ధంలో ఏసీపీ సజ్జన్, ద్వితీయార్థం అంతా పృథ్వీరాజ్ తమ నటనతో ఆడియెన్స్ ని కట్టిపడేస్తారు. సభా మరియంగా మమతా మోహన్ దాస్ బాగా నటించింది. రోజూ చూసే వార్తల్లోని మరో యాంగిల్ ను ఆవిష్కరించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు డిజో జోస్ ఆంటోని తెరకెక్కించారు.
ఇక ఆ ఊరిలోకి వేరే ఊరి వారు వస్తే వచ్చిన వాళ్లను వచ్చినట్టే దొర చంపేస్తూంటాడు.ఈ క్రమంలో ఆ గూడెంలోని ఒక పిల్లాడికి రేడియో దొరుకుతుంది.రేడియో అంటే ఏమిటో,ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. అయితే ఆ రేడియో వల్ల గూడెంలో అల్లకల్లోలం జరిగి, అదే దేవుడిగా మారుతుంది.దీంతో తాను కాకుండా ఇంకో దేవుడు ఉండటం నచ్చని దొర అప్పుడు ఏం చేసాడు. మూఢనమ్మకాలతో బతుకుతున్న అక్కడి ప్రజలకు ఆ రేడియో ద్వారా ఓ స్కూల్ మాస్టర్ వారికి ఎలా విముక్తి కలిగించాడు అనేది మిగిలిన కథ.
ఈ సినిమాను రాజమౌళి శిష్యుడు అయిన అశ్విన్ గంగరాజు రూపొందించారు. అయితే ఈ మూవీలో నటించిన వారిలో చాలా మంది కొత్తవారు కావటం, అంతేకాకుండా సబ్ స్క్రైబర్లు తక్కువ సంఖ్యలో ఉన్న సోనీ లివ్ లాంటి ఓటీటీలో విడుదల అవడం కూడా ఆకాశవాణికి మైనస్ అయ్యిందనే చెప్పాలి.కానీ ఓటీటీలో మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఆకాశవాణి మంచి ఆప్షన్ అవుతుంది.




