ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు చీరని కట్టుకోడాన్నే ఇష్టపడతారు. ఏ ఫంక్షన్ కి వెళ్ళినా, ఏ సినిమా షూటింగ్ అయినా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అయినా చీరలనే ప్రిఫర్ చేసేవారు. ఎందుకంటే చీరలు కట్టుకుంటే వాళ్ళు చాలా లక్షణంగా కనిపించేవారు. అలా ట్రెండ్ మారుతూ మారుతూ ఇప్పుడు హీరోయిన్లు చీరలు కట్టడమే మానేశారు. ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు పొట్టి పొట్టి డ్రస్సులతో అట్రాక్టివ్ గా కనిపిస్తున్నారు.

ఒక హీరోయిన్ చీర కట్టాలంటే సినిమాలో ఏదో పెళ్లి సన్నివేశము లేకపోతే ఏదో ఫంక్షన్స్ సీన్ ఉంటే కానీ చీర కట్టడం చాలా అరుదైపోయింది. ఇలాంటి జనరేషన్లో కూడా ఈ స్టార్ హీరోయిన్ కు చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అందులోని ఈ భామకి మోడరన్ డ్రెస్సులు అసలు నచ్చవట, చీర కట్టుకోవడంలో ఉండే కంఫర్ట్ మరే డ్రెస్ లోని రాదు అని చెప్పింది. ఇంతకీ ఎవరో తెలుసా? ఈమె మరెవరో కాదు నటి సాయి పల్లవి.

సాయి పల్లవి అంటేనే సింపుల్సిటీకి మారుపేరు. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమాలోనే చీర కట్టుకొని అందరినీ అలరించింది సాయి పల్లవి. తెలుగులో వచ్చిన ఫిదా సినిమాతో లంగా వోణీలు, చీరలలో చూడముచ్చటగా కనిపించిన సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో తనకి చీరలు కట్టుకోవడం చాలా సులువు గా వచ్చని, కేవలం మూడు నిమిషాలలోనే చీర కట్టుకోగలనని అది అంత కష్టమైన పనేం కాదు అని తెలిపింది.

సాయి పల్లవి చీరలో ఎంత ముద్దుగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా జరిగిన తన చెల్లెలి నిశ్చితార్థం లో చీర కట్టుకొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది సాయి పల్లవి. ఈమె సింప్లిసిటీకే నార్త్ లో సినిమా చేయకపోయినా చాలామంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి భామలు ఉండడం గ్రేట్ అంటూ అభిమానులు సాయి పల్లవిని తెగ పొగుడుతున్నారు.

ఫలక్నుమా ప్యాలెస్ అద్భుతమైన చరిత్ర ఉన్న ఇండియన్ వారసత్వ ప్యాలెస్లలో ఒకటి. తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన భవనాలలో ఒకటి. హైదరాబాద్ రాష్ట్ర నిజాం యొక్క అమూల్యమైన వారసత్వం. దీనిని అప్పటి హైదరాబాద్ ప్రధాని మరియు 6 వ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ బహదూర్ యొక్క బావ నవాబ్ వికార్-ఉల్-ఉమ్రా ఫలక్నుమాలో 32 ఎకరాల ప్రదేశంలో నిర్మించారు. ‘ఫలక్-నుమా’ అనేది ఉర్దూ పదం, దీనికి
సర్ వికార్ అని పేరుగాంచిన నవాబ్ వికార్-ఉల్-ఉమ్రా తన కలల అడుగుల ఎత్తైన కొండపై 1884లో మార్చి 3న పునాది రాయిని వేశారు. ఈ ప్యాలెస్ నిర్మాణం తొమ్మిది సంవత్సరాల పాటు సాగింది. దీని నిర్మాణం పూర్తిగా 1893లో పూర్తయింది. ఎంతో అందమైన ఈ ప్యాలెస్ దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. ప్యాలెస్ 1,011,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్యాలెస్ డిజైన్ను రూపొందించడానికి ఒక ఆంగ్ల ఆర్కిటెక్ట్ని పిలిచాడు. విలియం వార్డ్ మారెట్ అనే శిల్పి ఈ ప్యాలెస్ ను ‘ఆండ్రియా పల్లాడియో’ అనే శైలిలో నిర్మించాడు.
ఇక ఈ ప్యాలెస్ నిర్మాణానికి ఆ 130 సంవత్సరాల క్రితమే 40లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. ఈ ప్యాలెస్ అంతా ఇటాలియన్, ట్యూడర్ శైలుల సమ్మేళనంతో ఉన్న ప్రత్యేకమైన నిర్మాణం. ఈ ప్యాలెస్ నిర్మాణం కోసం ఇటలీ నుండి తెప్పించిన నాణ్యమైన ఇటాలియన్ పాలరాతితో కట్టారు. ఈ భవనం తేలు ఆకారంలో కనిపిస్తుంది. సర్ వకార్ రాశి వృచ్చికం అందువల్ల ఈ ప్యాలెస్ ను తేలు ఆకారంలో నిర్మించారు.
తేలు ఆకారంలో ఉన్న ప్యాలెస్ మధ్యలో ప్రధాన భవనం, గోల్ బంగ్లా, జెన్నా మహల్, వంటగది, దక్షిణ వైపు పట్టపు రాణులు, వారి చెలికత్తెల కోసం నిర్మించారు. ఫలక్ నుమా ప్యాలెస్ లోని కిటికీలకు వాడిన రంగు రంగుల అద్దాల నుంచి వచ్చే సూర్య కాంతి ప్యాలెస్ లోని గదులకు ప్రత్యేక ఆకర్షణ కలుగచేస్తాయి.
ఇంత అందమైన ప్యాలెస్ లో సర్ వికార్ 1897-98 వరకు మాత్రమే వ్యక్తిగత నివాసంగా ఉపయోగించుకున్నాడు. ఈ ప్యాలెస్ అత్యంత ఖరీదైన నిర్మాణం. దీని నిర్మాణం కోసం చేసిన అప్పులను కట్టడానికి వికార్ కు ఎంతో కాలం పట్టిందట. ఆ తర్వాత ప్యాలెస్ యాజమాన్య బాధ్యతలను 6వ నిజాంకు అప్పగించారు.
సర్ వికార్ తన భార్య ఇచ్చిన సలహా ప్రకారం అప్పటి రాజు మహబూబ్ అలీ పాషా నిజాంను ప్యాలెస్ కు ఆహ్వానించారు. ప్యాలెస్ కు వచ్చిన మహెబూబ్ అలీ పాషా ప్యాలెస్ యొక్క నిర్మాణానికి ముగ్దులయ్యారు. దానిని చూసిన తరువాత చాలా ఖరీదు అయ్యిందని, ప్యాలెస్ కట్టడం కోసం వికార్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడని తెలుసుకుని వకార్ కు అవసరమయిన ఆర్థిక సహాయం చేశారు. ఆయన అక్కడ నెలరోజుల పాటు ఉన్నారు.
సర్ వికార్ ప్యాలెస్ ను మహబూబ్ అలీ పాషాకు బహుమతిగా ఇచ్చాడు. కానీ అలీ పాషా దానిని బహుమతిగా స్వీకరించడానికి నిరాకరించాడు. ఆ ప్యాలెస్ కు తగిన మొత్తాన్ని ఇచ్చి తీసుకున్నాడు. ఆయన తరువాత ఏడో నిజాం ఈ ప్యాలెస్ను ‘రాయల్ గెస్ట్ హౌస్’ గా ఉపయోగించుకున్నారు.
ఫలక్నుమా ప్యాలెస్లోని లైబ్రరీ ఇంగ్లాండ్లోని విండ్సర్ కాజిల్ లైబ్రరీ వలె గంభీరంగా ఉంటుంది. విండ్సర్ కాజిల్ లైబ్రరీ తరహాలో రూపొందించబడింది. ఇది నిజాం కచేరీల నుండి అరుదైన మాన్యుస్క్రిప్ట్లు మరియు పుస్తకాలను కలిగి ఉంది. ప్యాలెస్ లోని గ్రంథాలయంలో ఇండియాలోని అతి అరుదైన ఖురాన్ గ్రంథాలు ఉన్నాయి.
ఇక్కడి బిలియర్డ్స్ గదిలోని బిలియర్డ్స్ టేబుల్ చాలా అరుదు అయినది. ఇలాంటి అరుదైన టేబుల్స్ ప్రపంచంలో రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఫలక్నుమా ప్యాలెస్ లో ఉంది. మరొకటి లండన్ బకింగ్హామ్ ప్యాలెస్లో ఉంది. టేబుల్ అద్భుతమైన, విలాసవంతమై నిర్మాణాన్ని కలిగి ఉంది. ప్యాలెస్ గోడల పై ఉన్న ప్రముఖుల ఫోటోలు ఆయిల్ పెయింటింగ్ తో వేశారు. ఇలాంటి ఎన్నో విశేషాలు ఫలక్ నుమా ప్యాలెస్ సొంతం అని చెప్పవచ్చు.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన 108 అడుగుల డైనింగ్ టేబుల్ లో ఒకేసారి 101 మంది కూర్చుని భోజనం చేయవచ్చు. ఈ భారీ డైనింగ్ హాల్ ఫలక్నుమా ప్యాలెస్ కు ప్రత్యేక ఆకర్షణ. దీనిని ప్రత్యేకమైన కలపతో తయారు చేశారు. ఈ టేబుల్ 80 అడుగుల పొడవు, 5.7 అడుగుల వెడల్పు, 2.7 అడుగుల ఎత్తు ఉంది. ఈ టేబుల్ తయారీకి టేకు, రోజ్ ఉడ్లను ఉపయోగించారు. చుట్టూ ఉన్న కుర్చీలకు పచ్చని రంగు కల అరుదైన లెదర్ని వాడారు.
2000 సంవత్సరం ముందు సాధారణ ప్రజలను ఫలక్ నుమా ప్యాలెస్లోకి రానివ్వలేదు. తాజ్ గ్రూప్ ఈ ప్యాలెస్ ను అద్దెకు తీసుకుని, మరింతగా ఆధునీకరించి ఫ్రాన్స్ నుండి తీసుకువచ్చిన అందమైన ఫర్నీచర్ మరియు హస్తకళా వస్తువులతో ఈ హోటల్ ను మరింత అందంగా అలంకరించారు. ఈ హోటల్ 2010 నవంబర్ లో ప్రారంభం అయ్యింది. ఈ హోటల్లో ప్రస్తుతం ఎవరైనా భోజనం చేయవచ్చు.
ఈ ఇక్కడి డైనింగ్ టేబుల్ పై భోజనం చేయాలంటే మాత్రం కనీసం 40 మంది ఉండాలి. ఈ హోటల్ బస కూడా చాలా ఖరీదు. భోజనం ధర 5 వేలు. ప్రత్యేక టేబుల్ భోజనం రూ.18వేలు. ఒకరోజు ఇక్కడ ఉండటానికి దాదాపు 46,000. ఈ ప్యాలెస్ లో 60 గదులు మరియు 22 హాళ్లు ఉన్నాయి.
మహేష్ బాబు జక్కన్నతో మొదటిసారి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ చిత్రం మహేష్ 29వ సినిమాగా రాబోతుంది. ఇక ఈ మూవీ మొదలుపెట్టక ముందే అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం అంతకుమించి ఉండేలా మహేష్ తో మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ తిరుగు తున్నాయి. ఇక రాజమౌళికి మోహన్ లాల్ అంటే చాలా అభిమానమని, తన గత చిత్రాల కోసం మోహన్ లాల్ ను జక్కన్న సంప్రదించారని వినిపిస్తోంది.
అయితే ఆ టైంలో మోహన్ లాల్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో జక్కన్న చిత్రాలకు అంగీకరించలేదు. అయితే జక్కన్న మోహన్ లాల్ కోసం ఇప్పటి నుండి సంప్రదిస్తున్నారు. కాబట్టి ఈ చిత్రంలో మోహన్ లాల్ నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొందరు మహేష్ రాజమౌళి కాంబో సినిమాలో మోహన్ లాల్ తప్పకుండా నటిస్తారని అంటున్నారు.








సాధారణంగా గవర్నమెంట్ ఉద్యోగి లంచం అడిగినప్పుడు, ఆ బాధితుడు ఏసీబీ ఆఫీసర్లకు లంచం అడిగిన విషయం చెప్పగానే వారు రంగంలోకి దిగుతారు. ఏసీబీ అధికారులు బాధితుడికి లంచం ఇవ్వడానికి కొంత డబ్బు ఇస్తారు. అయితే ఆ డబ్బు మీద ముందుగానే ఫినాప్తలిన్ పౌడర్ ను చల్లి ఇస్తారు. బాధితుడు ఫినాప్తలిన్ పౌడర్ ను చల్లిన డబ్బును లంచం అడిగిన గవర్నమెంట్ ఉద్యోగికి ఇస్తారు.
డబ్బు ఇచ్చిన వెంటనే ఆ గవర్నమెంట్ ఉద్యోగి అడిగిన డబ్బులు ఉన్నాయో లేవో తెలుసుకోవడం కోసం ఆ డబ్బును లెక్క పెడతారు. అయితే ఆ కరెన్సీ నోట్లకు ఉన్న పినాప్తలిన్ పౌడర్ సదరు ఉద్యోగి చేతులకు అంటుతుంది. వెంటనే ఏసీబీ ఆఫీసర్లు సీన్ లోకి ఎంట్రీ ఇస్తారు. లంచం తీసుకున్న గవర్నమెంట్ ఉద్యోగి చేతులను కాస్త సోడియం కార్బోనేట్ కలిపిన వాటర్ లో ముంచి తీస్తారు.
ఫినాప్తలిన్ పౌడర్ సోడియం కార్బోనేట్ కలిపిన ద్రావణంలో ముంచడంతో ఉద్యోగి చెయ్యి వెంటనే పింక్ రంగులోకి మారితుంది. అలా ఆ లంచం తీసుకున్న ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. ఏసీబీ అధికారులు పట్టుకున్న వ్యక్తితో పాటు, పింక్ కలర్ లోకి వచ్చిన ద్రావణంను కోర్టులో సాక్ష్యంగా చూపిస్తారు. అలా లంచం తీసుకున్న ఉద్యోగికి శిక్ష పడేలా ఏసీబీ అధికారులు చేస్తారు.

