తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు రాజీవ్ కనకాల గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు రాజీవ్ కనకాల. కాగా రాజీవ్ కనకాల యాంకర్ సుమ భర్త అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. మొదట టీవీ స్క్రీన్ తో కెరియర్ మొదలుపెట్టి బిగ్ స్క్రీన్పై నాన్ స్టాప్గా సినిమాలు చేస్తున్నారు రాజీవ్ కనకాల. రాంబంటు సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాజీవ్ కనకాల ఆ తరువాత వరుసగా స్టూడెంట్ నంబర్ 1, ఆది, నువ్వే నువ్వే, నాగ, ఫిల్మ్ బై అరవింద్, మీనాక్షి, యమదొంగ, సరిలేరు నీకెవ్వరు, పెదకాపు 1 లాంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించారు.

అంతేకాకుండా నటుడుగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇటీవలే రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల కూడా బబుల్ గమ్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కొడుకు సినిమా రిలీజ్ కి ముందు పలు రకాల ఫంక్షన్లలో ప్రమోషన్స్ లో రాజీవ్ కనకాల కనిపించారు. గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు రాజీవ్ కనకాల. చాలా లావుగా మారిపోయారు. అయితే తాను అలా మారిపోవడానికి గల కారణాలు ఏంటి అన్నది కూడా మీడియాకు వెల్లడించారు.

రాజీవ్కి ఆ మధ్య ఫుడ్ పాయిజన్ అయ్యిందట. ఆసుపత్రిలో జాయిన్ అయ్యాక సెలైన్స్, యాంటిబయాటిక్స్ ఇచ్చారట. ఆ సమయంలో ఆసుపత్రిలో ఇచ్చిన ఫుడ్ ఇంటి నుండి వచ్చిన ఫుడ్ కూడా తినేసేవారట. ఇక ఇంటికి వచ్చాక కూడా రోజూ స్వీట్స్ తినాలనిపించి రోజూ అరకిలో స్వీట్స్ తినేసేవారట. దాంతో సడెన్గా బరువు పెరిగిపోయారట. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంలో వరంగల్లో క్రికెట్ ఆడుతుండగా కాలు బెణికి నడవలేకపోయారట. ప్రస్తుతం బరువు తగ్గడానికి చాలా ప్రయత్నిస్తున్నారట. కారణం ఏదైనప్పటికీ అలా గుర్తుపట్టలేని విధంగా రాజీవ్ కనకాల మారిపోవడంతో అభిమానులు మొదట టెన్షన్ పడ్డారు ఆ తర్వాత ఆ కారణం తెలుసుకొనిఊపిరి పీల్చుకున్నారు.



మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ చితాన్ని యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ నుండి సాంగ్స్ ను, వరుస పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. మొదట జనవరి 6 న ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్రకటించారు. కానీ ఈ వేడుకను పోస్ట్ పోన్ చేశామని, త్వరలో డేట్ ప్రకటిస్తామని అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ మూవీ నుండి మెయిన్ హీరోయిన్ శ్రీలల పోస్టర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మరో హీరోయిన్ గా నటించిన కానీ మీనాక్షి చౌదరికి సంబంధించిన ఎలాంటి వివరాలు, పోస్టర్ కానీ రిలీజ్ కాలేదు. ఆమె పాత్ర ఈ మూవీలో ఎలా ఉండబోతుందని, అసలు ఆమె ఈ మూవీలో నటించిందా లేదా అని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ తాజాగా మహేష్ బాబు, మీనాక్షి ఉన్న పోస్టర్ ని విడుదల చేశారు.
ఈ పోస్టర్ లో మహేష్ కూర్చొని ఉన్నాడు. వెనుక మీనాక్షి మహేష్ బాబు పై చేతులు వేసి నిలుచుని ఉంది. ఇక ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అయ్యింది. కానీ కొందరికి మాత్రం మీనాక్షీ మహేష్ బాబుకి మసాజ్ చేస్తున్నట్లుగా కనిపించింది. దాంతో మీమర్స్ సరదాగా ఈ పోస్టర్ పై మీమ్స్ క్రియేట్ చేశారు. అవి ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. అవేమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.




ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి ఉన్న పాపులారిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. వేణు స్వామి చెప్పిన విషయాలను మొదట్లో అంతగా ఎవరు పట్టించుకోలేదు. నాగ చైతన్య, సమంతల విడాకులు, మెగా డాటర్ నిహారిక డైవర్స్ వేణు స్వామి చెప్పినట్టుగానే జరిగాయి. హీరో ప్రభాస్ గురించి కూడా వేణు స్వామి చెప్పినట్టే జరిగింది. అయ్యాయి. సలార్ రిలీజ్ ముందు కూడా ఈ మూవీ ఫ్లాప్ అవుతుందని వేణు స్వామి చెప్పారు. కానీ ఆ మూవీ భారీ వసూళ్లు సాధిస్తూ, బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామిని ట్రోల్ చేయడం తెలిసిందే.
ఈ క్రమంలో కొందరు వేణు స్వామికి నిజంగానే జాతకాలు చెప్పడం తెలిస్తే, ముందు తనని బాగు చేసుకోకుండా, జాతకాలు ఎందుకు చెప్పుతారు అంటూ కామెంట్స్ చేశారు. వేణు స్వామి ఈ ప్రశ్నకు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో జవాబు చెప్పారు. ఈ క్రమంలో వేణు స్వామి తన ఆస్తుల గురించి తొలిసారి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ తనకు ఒక పబ్ ఉందని, టైమ్ సరిపోక ఈ మధ్యే అమ్మేసినట్టు చెప్పారు.
రియల్ ఎస్టేట్, వైన్ షాప్, రేంజ్ రోవర్ కారు ఉన్నట్టుగా తెలిపారు. ‘జ్యోతిష్యం చెప్పే వాడి జాతకం బావుంటే జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటాడు అని వాగే వారికి నా సంపాదనే సమాధానం. నా రేంజ్ ఇది అని’ వేణు స్వామి చెప్పుకొచ్చారు. నేనే కాకుండా, నా భార్య వీణా కూడా సంపాదిస్తుంది. ఆమె సంగీతం ప్రావీణ్యురాలు అంటూ చెప్పుకొచ్చారు.


