పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన చేసిన మంచి పనులకే చాలామంది ఆయనకు అభిమానులు అయిపోయారు.
అయితే పవర్ స్టార్ మరోసారి తన మంచి మనసు చాటు కున్నారు. తనకు ఇచ్చిన రెమ్యునరేషన్ తిరిగి వెనక్కి ఇచ్చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా మారారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాల్లో కూడా నటిస్తున్నారు.అయితే ఎన్నికల వేళ కావడంతో ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.ప్రస్తుతం పవన్ హరిష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు. అటు సుజిత్తో కలిసి ఓజీ సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి తన రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.రీసెంట్ గా ఆయన సినిమా చేస్తున్న ప్రొడ్యూసర్ కి డబ్బులు అవసరం ఉంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ని మళ్లీ వెనక్కి ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది.ఆ ప్రొడ్యూసర్ మరెవరో కాదు.హరి హర వీర మల్లు సినిమా ప్రొడ్యూసర్ ఏంఏ రత్నం.

ఆయనకు కొన్ని అనివార్య కారణాల వల్ల డబ్బులు అవసరం పడితే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి లో ఉన్నప్పుడు ఆయనకి అవసరం ఉందని తెలుసుకున్న పవన్ రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశారని తెలుస్తుంది.తర్వాత తీసుకుంటానని.ఇప్పుడు మీకు అసవరం కాబట్టి మీరు తీసుకోండని పవన్ వారికి చెప్పినట్లుగా తెలుస్తుంది. ఆపదలో ఉన్నవారికి పవన్ తప్పకుండా ఆదుకుంటాడని చెప్పడానికి ఇదో మరో ఉదాహరణ అంటున్నారు ఆయన అభిమానులు.

పవన్ నటిస్తోన్న మరో సినిమా “హరిహర వీరమల్లు”. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ లుక్లో కనిపించనున్నారు. పవన్ 52వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నంచి ఓ మోషన్ మోస్టర్ను వదిలారు.భారీ బడ్జెట్తో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఇప్పటికే దాదాపు 65 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని అంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా OG.ఇక్కడ మరో విషయం ఏమంటే దర్శకుడు సుజీత్ స్వయంగా పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరో రేంజ్లో ఉన్నాయి.




















ఈ పేరు వినగానే అందరికీ ఒక గౌరవం వస్తుంది. ఆయన రచనలు గుర్తు వస్తాయి. ఆయన రాసిన నవలలు కవర్ పేజీలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఆయన రచనల్లోని పాత్రలు మనకి తడుతూ ఉంటాయి. 106 నవలలు, 3500 కథలు,1200 వ్యాసాలు, 22 సినిమాలు,9 టీవీ సీరియల్స్ ఇది 50 ఏళ్ల సాహిత్య యాత్రలో మల్లాది కృష్ణమూర్తి సాధించిన ఘనత. ఏ జోనర్ టచ్ చేయని ఆయన అందులో సూపర్ హిట్ అవుతారు. యువతరానికి, నవతరానికి , ఏ తరానికి అయినా సరే ఆయన రచనలు కిక్ ఇస్తాయి. ఆయన పెన్ కి ఏ భేదం లేదు.1970 ఆగస్టు 3 చందమామ మాస పత్రికలో మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన తొలి కథ ఉపాయశాలీ ప్రచురితమైంది.నాటి నుండి నేటి వరకు ఆయన రచనా ప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతుంది.
ఆయన రాసిన 106 నవలల్లో 22 నవలలు సినిమాలుగా రూపొందించారు.చంటబ్బాయ్, రెండు రెళ్లు ఆరు, తేనెటీగ ఇలా ఎన్నో మంచి సినిమాలకు మల్లాది వెంకట కృష్ణ మూర్తి నవలలే ఆధారం. 9 టీవీ సీరి యల్స్ ను అయన నవలల ఆధారంగానే రూపొందించారు. హాస్యం, రొమాన్స్, సస్పెన్స్, క్రైమ్ ఇలా ప్రతీది కూడా పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నాటి తరం నుండి నేటి తరం వరకు ఎందరో రచయితలకు మల్లాది ఒక ఇన్స్పిరేషన్. మల్లాది డబ్బుకి, కీర్తి ప్రతిష్టలకి ఏనాడు విలువ ఇవ్వలేదు. అందుకే ఇప్పటివరకు ఎన్ని రచనలు చేసినా కూడా ఆయన ఫోటో ఒకటి కూడా బయటికి రాలేదు, ఏ పేపర్ లోను పడలేదు.ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన కూడా ఒక్క ఫోటో కూడా బయటికి రానివ్వలేదు. ప్రస్తుతం మల్లాది వెంకటకృష్ణమూర్తి రచనలు చేస్తూనే ఆధ్యాత్మిక మార్గం వైపు పయనిస్తున్నారు.