అఖండ మూవీ సెన్సేషనల్ హిట్ అనంతరం డైరెక్టర్ బోయపాటి శ్రీను, యంగ్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘స్కంద’. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీకి నేషనల్ లెవెల్ లో హైప్ తీసుకు రావడంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ ముఖ్యమైన పాత్రను పోషించాయి. మూవీ రిలీజ్ కు ముందు విడుదలైన రెండు ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీలోని రెండు సీన్స్ పై నెట్టింట్లో ట్రోల్స్ మొదలు అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన మూవీ స్కంద. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, శరత్ లోహితస్వ, సాయి మంజ్రేకర్, గౌతమి, ఇంద్రజ, మురళి శర్మ, ప్రిన్స్ కీలక పాత్రలలో నటించారు. మూవీ రిలీజ్ కు ముందు వచ్చిన రెండు ట్రైలర్లలో హీరో రామ్ రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించారు. రెండో ట్రైలర్ అయితే గూస్బంప్స్ తెచ్చింది.
యాక్షన్ డ్రామా మరియు మాస్ ఎలిమెంట్స్తో రిలీజ్ చేసిన ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ గా ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూసిన ఆడియెన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్కంద మూవీలోని రెండు సన్నివేశాల పై నెటిజెన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఒక సన్నివేశం ఏమిటంటే, హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్. రామ్, శ్రీలీల పెయిర్ బాలేదని, అలాగే వారి మధ్య వచ్చే సీన్స్ అసలు బాలేదని కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ చెప్పే డైలాగ్స్, స్కూల్ అమ్మాయి లేదా టీనేజర్ కి ఇచ్చినట్టు ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. మరో సన్నివేశంలో హీరో చాలా హ-త్యలు చేస్తాడు అని చెప్తారు. అన్ని హ-త్యలు చేస్తే పోలీసులు హీరోని పట్టుకోరా అని ట్రోల్ చేస్తున్నారు.
Also Read: SKANDA REVIEW : “రామ్ పోతినేని” ఈ సినిమాతో హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

పెదకాపు ట్రైలర్ చూసినవారంత షాక్ అయ్యారు. ఒకప్పుడు క్లాస్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఇలాంటి మాస్ మూవీని ఎలా తీస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఈ మూవీ రేపు విడుదల కానుంది. దాంతో రిలీజ్ కు 2 రోజుల ముందే బుధవారం నాడు సినీ సెలబ్రిటీల కోసం ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రీమియర్ షోకు వెళ్ళిన సినీ సెలబ్రిటీలు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు పీఆర్వోలు, మూవీ క్రిటిక్స్ కూడా ఈ సినిమాని చూశారట.
వీళ్లంతా సోషల్ మీడియా ఎక్స్ ద్వారా పెదకాపు సినిమా పై తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. మూవీ చూసిన వారంతా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారని, మూవీని రస్టిక్గా తీశారని కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీలోని క్యారెక్టర్స్, డైలాగులు, విజువల్స్, కొన్ని సీన్స్ ఇప్పటికీ మైండ్ లో తిరుగుతున్నాయని ఒకరు ఎక్స్లో రాసుకొచ్చారు.
మరొకరు మాకూ ఒక వెట్రిమారన్ ఉన్నాడని అనిపిస్తోందని అన్నారు. ఇంకొకరు తెలుగులో గొప్ప కెమెరామేన్ ఉన్నారని ఛోటా కె నాయుడు తన వర్క్తో గుర్తు చేశారని సినీ జర్నలిస్ట్ రాసుకొచ్చారు. కొన్ని షాట్స్, ఫ్రేమ్స్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువే అని ప్రశంసించారు. మిక్కీ జే మేయర్ ఈ మూవీకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారట. టెక్నీషియన్స్ అంతా బెస్ట్ వర్క్ ఇచ్చారని రాసుకొచ్చారు.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
రణ్బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటిస్తున్న మూవీ యానిమల్. కొన్ని రోజులుగా ఈ మూవీలోను కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. రణ్బీర్ కపూర్ పుట్టినరోజు (సెప్టెంబర్ 28) సందర్భంగా ఈ మూవీ టీజర్ను మూవీయూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్లకి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో రణ్బీర్ కపూర్ ను ‘యానిమల్’ లా వయలెంట్గా చూపించారు.
టీజర్ను చూస్తే, తండ్రీ కుమారుల మధ్య ఎమోషన్ కనిపిస్తోంది. అయితే ఒక టిపికల్ స్టోరీలా అనిపిస్తుంది. ఈ మూవీలో విలన్ ఎవరు అనే విషయం మాత్రం అంత స్పష్టంగా తెలియలేదు. రణ్ బీర్ కపూర్ కొన్ని చోట్ల చాలా కూల్గా, కొన్ని చోట్ల చాలా వయలెంట్గా కనిపించాడు. రణ్ బీర్ కపూర్ చెప్పిన డైలాగ్స్ మూవీ పై ఆసక్తిని పెంచేస్తున్నాయి.
యానిమల్ టీజర్ విజువల్స్, సంగీతం, బిజీఎం ఇలా ప్రతిదీ అందరినీ ఆశ్చర్య పడేలా చేస్తున్నాయి. అంతర్జాతీయ స్టాండర్డ్లో ‘యానిమల్’ మూవీ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, యానిమల్ టీజర్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
watch video :

















మహేష్ గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించాయి. ఇటీవల నాగార్జున కూడా తాను నటిస్తున్న నా సామీరంగా మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లుగా చెప్పేశారు. అలా సంక్రాంతి రేస్ లో మూడు సినిమాలు చేరాయి. నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ చిత్రాలు క్రిస్మస్ రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు.
కానీ అనూహ్యంగా హాయ్ నాన్న,సైంధవ్ సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఈగిల్, విజయ్ దేవరకొండ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తునట్లుగా ప్రకటించారు. దీంతో గుంటూరు కారం లాంటి పెద్ద సినిమా సంక్రాంతి బరిలో ఉండగా, ఇన్ని సినిమాలు ఎందుకు పోటీ పడుతున్నాయి అనేది చర్చకు దారి తీసింది. ఇలా ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇలా చేయడానికి కారణం ప్రభాస్ సలార్ సినిమా అని తెలుస్తోంది.
సలార్ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 28 అని సంవత్సరం క్రితమే ప్రకటించింది. దాంతో చాలా సినిమాలు ఆ డేట్ కు దరిదాపుల్లో రాకుండా ప్లాన్ చేసుకున్నాయి. తీరా ఆ మూవీ విడుదల పోస్ట్ పోన్ కావడంతో షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్రాలన్ని డిసెంబర్ నెలలో క్రిస్మస్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాయి. అయితే సలార్ డిసెంబర్ 22న రిలీజ్ అవుతుందని వార్తలు వస్తుండడంతో ఇప్పటికే క్రిస్మస్ కు రిలీజ్ రెడీ అయిన మీడియం బడ్జెట్ చిత్రాలు గందరగోళంలో పడ్డాయి. దాంతో సంక్రాంతికి రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
2018 (అందరూ హీరోలే) ఈ చిత్రం ఎమోషనల్ సర్వైవల్ స్టోరీ. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2018లో కేరళ చరిత్రలోనే అత్యంత దారుణమైన వరదలు వచ్చాయి. వరదల వల్ల ప్రత్యక్షంగా బాధలు అనుభవించిన ప్రజలు, దాని బారిన పడిన వారు ఇప్పటికీ ఆ గాయాల భరిస్తున్నారు. కొందరు ప్రాణాలు, మరికొందరు ఇళ్లు, మరికొందరు జీవనోపాధి కోల్పోయారు. అయినా మానవత్వంతో అందరూ కలిసి ఈ కష్టం నుండి బయటపడ్డానికి సహాయం చేయడానికి చేతులు కలిపారు.
ఇదే విషయాన్ని దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్, 2018 లో చూపించే ప్రయత్నం చేసారు. ఈ మూవీ కథ అరువిక్కుళం అనే గ్రామంలో మొదలవుతుంది. ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ చూపించి ఆర్మీని వదిలి, దుబాయ్కి వెళ్లి బ్రతకలనుకునే పాత్రలో టొవినో థామస్. లాల్, నారాయణ్, ఆసిఫ్లతో జాలర్ల కుటుంబం. ఒక గర్భిణీ స్త్రీ, అంగ వైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు, ఒక అంధుడు ఇలా అనేక పాత్రలు ఉన్నాయి. నెమ్మదిగా, రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటం. కొన్ని గంటల్లో పరిస్థితి వర్షాలతో కేరళ రాష్రం వరదలతో ముంచెత్తడం.
ఆ క్రమంలో వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి రెస్క్యూ టీమ్ తో పాటు మత్స్యకారులు సాయం చేయడం, స్థానికులు అందించిన సహాయం, హెలికాప్టర్ రెస్క్యూ, దాదాపు ప్రతిదీ, అప్పటి పరిస్థితులను కళ్ళ ముందుకు తెస్తుంది. ఈ చిత్రంలో టోవినో థామస్, లాల్, ఆసిఫ్ అలీ, ఇంద్రన్స్, నరేన్, కుంచకో బోబన్, అపర్ణ బాలమురళి వంటి స్టార్స్ నటించారు. వారి నటన పై ప్రశంసలు కురుస్తున్నాయి.
మే 5 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మల్టీప్లెక్స్లలో తక్కువగా, చిన్న స్క్రీన్లలో సినిమా మొదటి షో నుండి ప్రదర్శించడం ప్రారంభమైంది. అయితే మౌత్ టాక్ తో సాయంత్రానికి మల్టీప్లెక్స్లు అన్నిట్లోనూ ఈ మూవీ వేశారు. టిక్కెట్లు దొరక్క తిరిగొచ్చిన వారు కూడా చాలా మంది ఉన్నారు. దీనితో కేరళ అంతటా అదనపు షోలు కూడా వేశారు.
దేశ వ్యాప్తంగా హైప్ ఉన్న చిత్రాలలో లియో ఒకటి. ఈ మూవీ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే సడెన్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కాన్సిల్ చేయడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే లియో యూనిట్ దీనిపై వివరణ ఇస్తూ, ఈవెంట్ పాస్ లకు విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల వాటిని అందుకోలేకపోతున్నట్టు, ఆడియెన్స్ ఎక్కువగా వస్తారనే అంచనతో కంట్రోల్ చేయడం కష్టంగా అనిపిస్తోందని, అందువల్లే ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్పారు.
ఫ్యాన్స్ కోరిక మేరకు అప్డేట్లు ఇస్తూనే ఉంటాం. అందరూ ఊహిస్తున్నట్టుగా మా పై ఏ పార్టీ ఒత్తిడీ లేదు. అని వివరణ ఇచ్చింది. ఈ వివరణ పై నెట్టింట్లో ట్రోల్స్ మొదలైపోయింది. ఈ రిజన్స్ ఫ్యాన్స్ కోపాన్ని చల్లార్చడం లేదు. ఈవెంట్ సడెన్ గా క్యాన్సిల్ కావడంతో పలు సందేహాలు ఉన్నాయని మండిపడుతున్నారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు హీరో ఉదయనిధికి చెందిన రెడ్ జాయింట్ కు లియో పంపిణి రైట్స్ ఇవ్వకపోవడం వల్లే ఉద్దేశపూర్వకంగా పర్మిషన్స్ రాకుండా చేశారని టాక్. ప్రతీ మూవీలోషేర్, లేదా ప్రధానమైన ఏరియా రైట్స్ ను అడుగుతున్నారట. తమ కంపెనీకి రైట్స్ ఇవ్వని చిత్రాలను ఏదో విధంగా వేధింపులకు గురి చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా హైప్ ఉన్న ‘లియో’ మూవీకి కేరళలో తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది.
రిలీజ్ కు ముందే కేరళ వాసులు, ముఖ్యంగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఫ్యాన్స్ ‘ లియో ‘ మూవీని బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు. దీనికి కారణం ఏమిటంటే, గతంలో వచ్చిన ‘జిల్లా’ మూవీలో విజయ్ దళపతి, మోహన్లాల్ కలిసి నటించారు. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత మూవీలో మోహన్లాల్ యాక్టింగ్ ను కొందరు విజయ్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు విజయ్ ‘లియో’ మూవీని కేరళలో రిలీజ్ చేయనివ్వమని మోహన్ లాల్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ఫ్యాన్స్ కి, మోహన్ లాల్ ఫ్యాన్స్ నెట్టింట్లో వాగ్వాదానికి దిగారు.