ప్రతి సినిమాకి తన పాత్రకి తగ్గట్టుగా మారుతూ, తనని తాను ప్రూవ్ చేసుకుంటున్న హీరో రామ్ పోతినేని. తనదైన మార్క్ కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా స్కంద. ఈ సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : స్కంద
- నటీనటులు : రామ్ పోతినేని, శ్రీలీల, సయీ మంజ్రేకర్.
- నిర్మాత : శ్రీనివాస చిత్తూరి
- దర్శకత్వం : బోయపాటి శ్రీను
- సంగీతం : ఎస్ తమన్
- విడుదల తేదీ : సెప్టెంబర్ 28, 2023

స్టోరీ :
ఒక కోర్టు సీన్ తో సినిమా మొదలవుతుంది. ఒక వ్యాపారవేత్త (శ్రీకాంత్) కొంత మంది వ్యక్తుల వల్ల సమస్యలు ఎదుర్కొంటాడు. దీని వల్ల అతని కుటుంబం అంతా కూడా ఇబ్బందుల్లో పడుతుంది. మరొక పక్క రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మధ్య గొడవలు అవుతూ ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు (శ్రీలీల) కాలేజ్ లో చదువుతూ ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి తమ్ముడు (ప్రిన్స్) ఈ రాజకీయ విషయాలు అన్నీ చూసుకుంటూ ఉంటాడు.

దగ్గుబాటి రాజా, శ్రీకాంత్ స్నేహితులు అవ్వడంతో, దగ్గుబాటి రాజా కొడుకు అయిన హీరో (రామ్ పోతినేని) శ్రీకాంత్ ని, శ్రీకాంత్ కూతురుని (సయీ మంజ్రేకర్) వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల నుండి కాపాడాలి అనుకుంటాడు. ఆ ఇబ్బందుల నుండి వారిని హీరో ఎలా కాపాడాడు? అసలు వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తులు ఎవరు? ప్రభుత్వం ఇందులో ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉంది? చీఫ్ మినిస్టర్ వల్ల వీళ్లు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :
గత కొద్ది సంవత్సరాల నుండి సరైన హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న హీరో రామ్ పోతినేని. సినిమాకి సినిమాకి తనని తాను మార్చుకునే విధానం బాగున్నా కూడా మిగిలిన విషయాల్లో లోపాలు ఉండడం వల్ల ఆ సినిమాలు ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోవట్లేదు. ఇప్పుడు ఈ సినిమా మీద ప్రేక్షకులకి అంచనాలు బాగా ఉన్నాయి. ఇంక సినిమా కథ విషయానికి వస్తే ఒక మాస్ కమర్షియల్ టెంప్లేట్ సినిమాల్లో దాదాపు రెగ్యులర్ గా చూసే కథ.

బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ తో సినిమా ముందుకి వెళుతుంది. ప్రతి బోయపాటి సినిమాలో ఉన్నట్టుగానే కాస్త లౌడ్ గా ఉండే హీరో, ఇద్దరు హీరోయిన్లు, ఒక పెద్ద కుటుంబం, ఆ కుటుంబంలో కొన్ని పాత్రల్లో మనకి తెలిసిన పెద్ద పెద్ద నటీనటులు, థియేటర్లు దద్దరిలేలా ఉండే తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఈ సినిమా కూడా ఇలాగే ఉంది. టేకింగ్ విషయానికి వస్తే, ఇది కూడా ఒక కమర్షియల్ సినిమాని హ్యాండిల్ చేసినట్టే ఉంది.

కాకపోతే బోయపాటి సినిమాలో రామ్ పోతినేని కాబట్టి కాస్త కొత్తగా అనిపిస్తుంది. అంతే కాకుండా ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఒక్క ట్విస్ట్ కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఒక పాయింట్ తర్వాత అవి మోతాదుకి మించి ఉన్నాయి అని అర్థం అయిపోతాయి. కొన్ని అయితే మరీ లాజిక్ లేకుండా ఉంటాయి. ఒక టైంలో ప్రేక్షకులు వీటిని ఎంజాయ్ చేసినా కూడా ఇప్పుడు మైండ్ సెట్ మారింది కాబట్టి వీటిలో తప్పులనే ఎక్కువగా వెతుకుతున్నారు.

సెకండ్ హాఫ్ లో బోయపాటి టెంప్లేట్ సినిమా లాగానే ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమా ఎలా ఉన్నా కూడా ప్రతి సినిమాకి రామ్ పోతినేని తన వైపు నుండి చేస్తున్న కృషి చాలా బాగుంది. ఈ సినిమా కోసం తనని తాను మార్చుకున్న విధానం కూడా అలాగే ఉంది. అంతే కాకుండా డాన్స్ విషయంలో కూడా చాలా మెరుగు అయ్యారు. అంతకుముందు చాలా బాగా చేసేవారు, కానీ ఈ సినిమాకి ఇంకా ఇంప్రూవ్ అయ్యారు.

శ్రీలీలకి పెద్దగా చెప్పుకోదగ్గ పాత్ర ఏమీ దొరకలేదు. ఒక కమర్షియల్ సినిమాలో ఉండే మామూలు హీరోయిన్ పాత్ర. తన పాత్ర వరకు తను బానే నటించారు. మరొక హీరోయిన్ సయీ మంజ్రేకర్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. సీనియర్ నటుడు దగ్గుబాటి రాజా, గౌతమి, శ్రీకాంత్, ఇంద్రజ వంటి నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు.

సినిమాలో పాటలు చెప్పుకోదగ్గ గొప్పగా ఏమీ లేవు. పాటలు విన్నప్పుడే యావరేజ్ అని ప్రేక్షకులు కామెంట్స్ చేశారు. సినిమాలో చూసిన తర్వాత కూడా అలాగే అనిపిస్తాయి. కొన్ని పాటలు మాత్రం చిత్రీకరించిన విధానం బాగుంది. సంతోష్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. కానీ కొన్ని సీన్స్ లో, అందులోనూ ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో మాత్రం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- రామ్ పోతినేని
- నిర్మాణ విలువలు
- ఇంటర్వెల్ కి ముందు వచ్చే ట్విస్ట్
- సినిమాటోగ్రఫీ
ప్లస్ పాయింట్స్ :
- రొటీన్ కమర్షియల్ టెంప్లేట్
- లాజిక్ లేని సీన్స్
- మోతాదుకి మించిన యాక్షన్ సీన్స్
- తెలిసిపోయే కథనం
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
లాజిక్ పక్కన పెట్టి, అసలు ఆ పదం ఒకటి ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోయి, రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినా పర్వాలేదు రామ్ పోతినేని కోసం చూద్దాం అనుకునే వారికి, లేదా మాస్ మసాలా సినిమాలు ఎంజాయ్ చేసే వారికి స్కంద సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : ఒక్కరు కూడా తగ్గట్లేదు ఎందుకు..? ఇంత మొండితనంగా ఉండడానికి కారణం ఏంటి..?



మహేష్ గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించాయి. ఇటీవల నాగార్జున కూడా తాను నటిస్తున్న నా సామీరంగా మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లుగా చెప్పేశారు. అలా సంక్రాంతి రేస్ లో మూడు సినిమాలు చేరాయి. నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ చిత్రాలు క్రిస్మస్ రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు.
కానీ అనూహ్యంగా హాయ్ నాన్న,సైంధవ్ సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఈగిల్, విజయ్ దేవరకొండ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తునట్లుగా ప్రకటించారు. దీంతో గుంటూరు కారం లాంటి పెద్ద సినిమా సంక్రాంతి బరిలో ఉండగా, ఇన్ని సినిమాలు ఎందుకు పోటీ పడుతున్నాయి అనేది చర్చకు దారి తీసింది. ఇలా ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇలా చేయడానికి కారణం ప్రభాస్ సలార్ సినిమా అని తెలుస్తోంది.
సలార్ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 28 అని సంవత్సరం క్రితమే ప్రకటించింది. దాంతో చాలా సినిమాలు ఆ డేట్ కు దరిదాపుల్లో రాకుండా ప్లాన్ చేసుకున్నాయి. తీరా ఆ మూవీ విడుదల పోస్ట్ పోన్ కావడంతో షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్రాలన్ని డిసెంబర్ నెలలో క్రిస్మస్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాయి. అయితే సలార్ డిసెంబర్ 22న రిలీజ్ అవుతుందని వార్తలు వస్తుండడంతో ఇప్పటికే క్రిస్మస్ కు రిలీజ్ రెడీ అయిన మీడియం బడ్జెట్ చిత్రాలు గందరగోళంలో పడ్డాయి. దాంతో సంక్రాంతికి రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
2018 (అందరూ హీరోలే) ఈ చిత్రం ఎమోషనల్ సర్వైవల్ స్టోరీ. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2018లో కేరళ చరిత్రలోనే అత్యంత దారుణమైన వరదలు వచ్చాయి. వరదల వల్ల ప్రత్యక్షంగా బాధలు అనుభవించిన ప్రజలు, దాని బారిన పడిన వారు ఇప్పటికీ ఆ గాయాల భరిస్తున్నారు. కొందరు ప్రాణాలు, మరికొందరు ఇళ్లు, మరికొందరు జీవనోపాధి కోల్పోయారు. అయినా మానవత్వంతో అందరూ కలిసి ఈ కష్టం నుండి బయటపడ్డానికి సహాయం చేయడానికి చేతులు కలిపారు.
ఇదే విషయాన్ని దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్, 2018 లో చూపించే ప్రయత్నం చేసారు. ఈ మూవీ కథ అరువిక్కుళం అనే గ్రామంలో మొదలవుతుంది. ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ చూపించి ఆర్మీని వదిలి, దుబాయ్కి వెళ్లి బ్రతకలనుకునే పాత్రలో టొవినో థామస్. లాల్, నారాయణ్, ఆసిఫ్లతో జాలర్ల కుటుంబం. ఒక గర్భిణీ స్త్రీ, అంగ వైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు, ఒక అంధుడు ఇలా అనేక పాత్రలు ఉన్నాయి. నెమ్మదిగా, రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటం. కొన్ని గంటల్లో పరిస్థితి వర్షాలతో కేరళ రాష్రం వరదలతో ముంచెత్తడం.
ఆ క్రమంలో వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి రెస్క్యూ టీమ్ తో పాటు మత్స్యకారులు సాయం చేయడం, స్థానికులు అందించిన సహాయం, హెలికాప్టర్ రెస్క్యూ, దాదాపు ప్రతిదీ, అప్పటి పరిస్థితులను కళ్ళ ముందుకు తెస్తుంది. ఈ చిత్రంలో టోవినో థామస్, లాల్, ఆసిఫ్ అలీ, ఇంద్రన్స్, నరేన్, కుంచకో బోబన్, అపర్ణ బాలమురళి వంటి స్టార్స్ నటించారు. వారి నటన పై ప్రశంసలు కురుస్తున్నాయి.
మే 5 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మల్టీప్లెక్స్లలో తక్కువగా, చిన్న స్క్రీన్లలో సినిమా మొదటి షో నుండి ప్రదర్శించడం ప్రారంభమైంది. అయితే మౌత్ టాక్ తో సాయంత్రానికి మల్టీప్లెక్స్లు అన్నిట్లోనూ ఈ మూవీ వేశారు. టిక్కెట్లు దొరక్క తిరిగొచ్చిన వారు కూడా చాలా మంది ఉన్నారు. దీనితో కేరళ అంతటా అదనపు షోలు కూడా వేశారు.
దేశ వ్యాప్తంగా హైప్ ఉన్న చిత్రాలలో లియో ఒకటి. ఈ మూవీ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే సడెన్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కాన్సిల్ చేయడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే లియో యూనిట్ దీనిపై వివరణ ఇస్తూ, ఈవెంట్ పాస్ లకు విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల వాటిని అందుకోలేకపోతున్నట్టు, ఆడియెన్స్ ఎక్కువగా వస్తారనే అంచనతో కంట్రోల్ చేయడం కష్టంగా అనిపిస్తోందని, అందువల్లే ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్పారు.
ఫ్యాన్స్ కోరిక మేరకు అప్డేట్లు ఇస్తూనే ఉంటాం. అందరూ ఊహిస్తున్నట్టుగా మా పై ఏ పార్టీ ఒత్తిడీ లేదు. అని వివరణ ఇచ్చింది. ఈ వివరణ పై నెట్టింట్లో ట్రోల్స్ మొదలైపోయింది. ఈ రిజన్స్ ఫ్యాన్స్ కోపాన్ని చల్లార్చడం లేదు. ఈవెంట్ సడెన్ గా క్యాన్సిల్ కావడంతో పలు సందేహాలు ఉన్నాయని మండిపడుతున్నారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు హీరో ఉదయనిధికి చెందిన రెడ్ జాయింట్ కు లియో పంపిణి రైట్స్ ఇవ్వకపోవడం వల్లే ఉద్దేశపూర్వకంగా పర్మిషన్స్ రాకుండా చేశారని టాక్. ప్రతీ మూవీలోషేర్, లేదా ప్రధానమైన ఏరియా రైట్స్ ను అడుగుతున్నారట. తమ కంపెనీకి రైట్స్ ఇవ్వని చిత్రాలను ఏదో విధంగా వేధింపులకు గురి చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా హైప్ ఉన్న ‘లియో’ మూవీకి కేరళలో తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది.
రిలీజ్ కు ముందే కేరళ వాసులు, ముఖ్యంగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఫ్యాన్స్ ‘ లియో ‘ మూవీని బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు. దీనికి కారణం ఏమిటంటే, గతంలో వచ్చిన ‘జిల్లా’ మూవీలో విజయ్ దళపతి, మోహన్లాల్ కలిసి నటించారు. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత మూవీలో మోహన్లాల్ యాక్టింగ్ ను కొందరు విజయ్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు విజయ్ ‘లియో’ మూవీని కేరళలో రిలీజ్ చేయనివ్వమని మోహన్ లాల్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ఫ్యాన్స్ కి, మోహన్ లాల్ ఫ్యాన్స్ నెట్టింట్లో వాగ్వాదానికి దిగారు.





















మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ మూవీ ముందువరకు అగ్రెసివ్ యంగ్ హీరోగా, లవర్ బాయ్ లా కనిపించారు. కానీ ఈ చిత్రంలో కంప్లీట్ డిఫరెంట్ విశ్వక్ సేన్ కనిపిస్తాడు. ఫలక్నుమా దాస్, రాజా వారు రాణి గారు సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేసిన విద్యాసాగర్ చింత అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటించిన నటీ నటుల నటన ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి.
ఈ మూవీలో ఫోటోగ్రాఫర్ గా నటించిన యాక్టర్ పేరు రాజ్కుమార్ కసిరెడ్డి. పలు తెలుగు సినిమాలలో నటించారు. రాజ్కుమార్ 1992లో జనవరి 12న జన్మించారు. నటన పై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాజ్కుమార్ కెరీర్ 2019 లో రాజా వారు రాణి గారు మూవీతో ప్రారంభం అయ్యింది. ఈ మూవీలో చౌదరి క్యారెక్టర్ లో నటించి, గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఫలక్నుమా దాస్ లో నటించారు.
ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా రాజ్కుమార్ బ్లడీమేరీ, రంగరంగ వైభవంగా, స్టాండప్ రాహుల్, అర్జున ఫల్గుణ, సీతా రామం, చిత్తం మహారాణి, బెదురులంక 2012, రంగబలి వంటి సినిమాలలో నటించి, అలరించారు. సైమా 2023 అవార్డ్స్ లో ఉత్తమ కామెడీ నటుడు కేటగిరీలో రాజ్కుమార్ కసిరెడ్డి అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకి నామినేట్ అయ్యారు. దుల్కర్ సల్మాన్ నటించబోయే లక్కీ భాస్కర్ మూవీలో కూడా నటిస్తున్నారు.