వివాదాల డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ పొలిటికల్ మూవీగా ‘వ్యూహం’ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు రొటీన్ సినిమాలను చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. చాలా రోజులుగా వర్మ ‘శారీ ‘ అనే మూవీని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
రీసెంట్ గా వర్మ చీర కట్టులో ఉన్న ఒక అమ్మాయి ఫోటోను చూశాడు. ఆ అమ్మాయి ఎవరు, ఎవరికైనా తెలిస్తే చెప్పండి అని పోస్ట్ పెట్టాడు. ఆర్జీవి అడిగిన వెంటనే ఆమె గురించి వివరాలు తెలుపుతూ నెటిజెన్లు పోస్ట్ లు పెట్టారు. దాంతో ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయ్యింది. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఒక సాధారణ అమ్మాయిని కూడా స్టార్ సెలబ్రిటీగా చేయగల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని చెప్పవచ్చు. సినిమాలలో నటించడం వల్ల అమ్మాయిలు సెలబ్రిటీలుగా మారతారు. అయితే రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడిన అమ్మాయి నటించ ముందే సెలబ్రిటీగా మారుతుంది. ఇప్పటికే అలా సెలబ్రిటీ అయినవారు ఉన్నారు. అయితే తాజాగా ఒక అమ్మాయి ఆర్జీవి దృష్టిలో పడింది.
తాజాగా ఆ అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ ఐడీని తెలుసుకున్న వర్మ ఫ్యాన్స్ కు పరిచయం చేశాడు. ఆ అమ్మాయి పేరు శ్రీలక్ష్మీ సతీష్. ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడీని పోస్ట్ చేస్తూ “ఇంత వరకు చాలా మంది చీరలోని అందం గురించి చెప్పారు. కానీ నేను ఈ వీడియో చూసే వరకు నేను ఎప్పుడూ నమ్మలేదు, కానీ ఆమెను చూశాకా అర్థమైంది” అంటూ ఒక పోస్ట్ చేసి, ఆమె రీల్ వీడియోను కూడా షేర్ చేశాడు. అందులో శ్రీలక్ష్మీ సతీష్ తో శారీ (చీర) మూవీ తీస్తాను అంటూ ప్రకటించాడు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది.
ప్రస్తుతం ఈ దర్శకుడి దృష్టి శ్రీలక్ష్మి పైనే ఉందని టాక్. శ్రీలక్ష్మీ సతీష్ కూడా సినిమా అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది. ఆమె ఇన్ స్టా ఖాతాలో రీల్ వీడియోలను చూస్తుంటే, ఆమెకు హీరోయిన్ కావాలనే కోరిక ఉన్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ ఆమె గురించి ట్వీట్ చేయకముందు ఆమెకు 20 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే వర్మ ట్వీట్ చేశాక, ఆమె ఫాలోవర్లు 50 వేలకు చేరారు.
https://www.instagram.com/p/Cxp72ooyy_m/
Also Read: “చంద్రముఖి 2” మూవీలో రజనీకాంత్ పోషించిన రాజు పాత్ర చేసిన ఈ యాక్టర్ ఎవరో తెలుసా..?

17 సంవత్సరాల క్రితం తెలుగు, తమిళ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న మూవీ చంద్రముఖి. ఈ మూవీ ఆ తర్వాత అనేక భాషలలో రీమేక్ అయింది. అయితే ఇన్నేళ్ల తర్వాత చంద్రముఖి సినిమాకు సీక్వెల్ తీశారు డైరెక్టర్ పి వాసు. చంద్రముఖి 2 గా తెరకెక్కిన ఈ సీక్వెల్ లో రజినీకాంత్ పాత్రలో రాఘవ లారెన్స్ నటించారు. ఇక రజినికాంత్ పోషించిన రాజు పాత్రలో నటుడు శత్రు నటించారు.
శత్రు స్క్రీన్ నేమ్, అసలు పేరు ఎం రామకృష్ణ. శత్రు ఒడిశాలోని బార్ఘర్ జిల్లాలో సర్లా గ్రామంలో 1984లో తెలుగు మాట్లాడే కుటుంబంలో ఆగస్టు 6న జన్మించారు.రావెన్షా విశ్వవిద్యాలయంలో మైక్రోబయాలజీలో డిగ్రీని చేశాడు. రామకృష్ణ నటన పై ఉన్న ఆసక్తితో హైదరాబాద్కు వెళ్లారు. 2010లో శేఖర్ కమ్ముల తీసిన లీడర్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ తరువాత పలు సినిమాలలో చిన్న, చిన్న పాత్రలలో నటించాడు. 2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ మూవీలో హీరోయిన్ అన్నయ్య రామరాజు పాత్రలో నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
మిస్టర్, రంగస్థలం, బాహుబలి 2 లో పిండారీ గిరిజన నాయకుడుగా, అల్లు అర్జున్ హీరోగా నటించిన’పుష్ప – ది రైజ్’లో టాస్క్ఫోర్స్ డిఎస్పీ గోబిందప్పగా, సీతారామం మూవీలో లెఫ్టినెంట్ వికాస్ గా నటించాడు. 2022 లో వచ్చిన కొరమీను అనే మూవీలో ఐపీఎస్ ఆఫీసర్ మీసాల రాజుగా కీలక పాత్రలో నటించాడు. టాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించడమే కాకుండా, తమిళంలోను కొన్ని సినిమాలలో నటించి, గుర్తింపు పొందాడు. ఆ క్రమంలోనే లేటెస్ట్ గా రిలీజ్ అయిన చంద్రముఖి 2 లో వేటయ్య రాజు పాత్రలో నటించాడు.
నాజర్ అసలు పేరు మహమ్మద్ హనీఫ్. విలక్షణ నటుడు నాజర్ గురించి, ఆయన నటన గురించి ఎంత మాట్లాడుకున్న అది తక్కువే అవుతుంది. నాజర్ తమిళనాడులో మేలేరిపాక్కంలో మెహబూబ్ బాషా,ముంతాజ్లకు 1958లో మార్చి 5న జన్మించాడు. ఇండస్ట్రీకి రాకముందు నాజర్ భారత వైమానిక దళంలో పనిచేశాడు. ఆ తరువాత నటనలో శిక్షణ పొందాడు. 1985లో నాజర్ నటుడిగా కెరీర్ మొదలుపెట్టారు. అప్పటి నుండి ఇప్పటివరకు తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కలిపి దాదాపు 600 పైగా సినిమాలలో నటించారు.
కెరీర్ పరంగా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లతో అలరించిన నాజర్ కి ముగ్గురు ముగ్గురు కుమారులు. మొదటి కుమారుడు అబ్దుల్ ఫైజల్ హస్సన్, రెండో కుమారుడు లూత్ఫుద్దీన్ మరియు మూడవ కుమారుడు అబి హస్సన్. లూత్ఫుద్దీన్ కోలీవుడ్ లో యాక్టర్ గా కొనసాగుతున్నారు. ముఖ్యంగా విజయ్ దళపతి చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తారు. అయితే పెద్ద అబ్బాయి ఫైజల్ 2014 లో మేజర్ యాక్సిడెంట్ కి గురయ్యాడు. ఆ ప్రమాదంలో ఫైజల్ కుటుంబాన్ని పూర్తిగా మర్చిపోయాడు. అయితే అభిమాన హీరో అయిన విజయ్ దళపతి మాత్రమే అతనికి గుర్తున్నాడు.
టీవిలో విజయ్ దళపతి సినిమాలు గాని, పాటలు గాని వచ్చినపుడు ఫైజల్ సంతోషంగా డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడట. ఎక్సయిట్మెంట్ తో విజయ్ సినిమాలు చూస్తుంటాడట. ఇటీవల జరిగిన ఫైజల్ బర్త్ డేకు విజయ్ హాజరై ఫైజల్ ను సర్ప్రైజ్ చేసాడు. నాజర్ ఫైజల్ యాక్సిడెంట్ గురి కావడానికి కొద్ది రోజుల ముందు అతను హీరోగా ఒక సినిమాకి సన్నాహాలు చేసుకున్నారు. కానీ యాక్సిడెంట్ జరగడంతో గత తొమ్మిదేళ్లుగా బెడ్ పై, వీల్ చైర్ సాయంతో కొడుకు జీవిచడం నాజర్ ని వేదనకు గురిచేస్తోంది.







‘కుమారి శ్రీమతి’ అనే వెబ్ సిరీస్ లో నిత్యా మీనన్ లీడ్ రోల్ లో నటించగా, కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల, సీనియర్ హీరోయిన్ గౌతమి, నరేష్, అలనాటి నటి తాళ్ళూరి రామేశ్వరి, తిరువీర్,బాబూ మోహన్, ప్రేమ్ సాగర్ కీలకపాత్రలలో నటించారు. గోమఠేష్ ఉపాధ్యాయ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఏడు ఎపిసోడ్లతో రూపొందిన ఈ సిరీస్ కు యాక్టర్, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు.
ఇక కథ విషయానికి వస్తే, కుమారి శ్రీమతికి 30 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. ఆమె తల్లి పెళ్లి చేసుకోమని చెప్తూ, ఉంటుంది. అయితే తాత ఇచ్చిన ఆస్తిని ఆమె బాబాయ్ లాగేసుకుని, శ్రీమతి ఫ్యామిలిని బయటకు తోసేస్తాడు. శ్రీమతి కోర్టు వెళ్తుంది. ఆ ఇంటిని తిరిగి పొందేవరకు తాను పెళ్లి చేసుకోనని శ్రీమతి తల్లికి చెబుతుంది. కోర్టు ఆరు నెలల లోపు 38 లక్షల రూపాయలు ఇచ్చి ఆ ఇంటిని కొనుక్కోవచ్చని తీర్పు చెబుతుంది.
అయితే శ్రీమతి జీతం నెలకు రూ.13 వేలు. ఆరునెలల్లో రూ.38 లక్షలు సంపాదించడం కోసం బాగా ఆలోచించిన శ్రీమతి ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. బార్ పెట్టాలని నిర్ణయించుకుంటుంది. బార్ పెట్టి, ఊర్లో వాళ్ళను అందర్నీ బాగా తాగించి, 38 లక్షల రూపాయలు సంపాదించడానికి చాలా ఇబ్బందులు పడుతుంది. శ్రీమతి ఆ డబ్బును సంపాదించిందా? ఇంటిని దక్కించుకుందా? ఆఖరికి పెళ్లి చేసుకుందా? లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలానే నిత్యా మీనన్ కుమారి శ్రీమతిగా అద్భుతంగా నటించింది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన మూవీ స్కంద. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, శరత్ లోహితస్వ, సాయి మంజ్రేకర్, గౌతమి, ఇంద్రజ, మురళి శర్మ, ప్రిన్స్ కీలక పాత్రలలో నటించారు. మూవీ రిలీజ్ కు ముందు వచ్చిన రెండు ట్రైలర్లలో హీరో రామ్ రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించారు. రెండో ట్రైలర్ అయితే గూస్బంప్స్ తెచ్చింది.
యాక్షన్ డ్రామా మరియు మాస్ ఎలిమెంట్స్తో రిలీజ్ చేసిన ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ గా ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూసిన ఆడియెన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్కంద మూవీలోని రెండు సన్నివేశాల పై నెటిజెన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఒక సన్నివేశం ఏమిటంటే, హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్. రామ్, శ్రీలీల పెయిర్ బాలేదని, అలాగే వారి మధ్య వచ్చే సీన్స్ అసలు బాలేదని కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ చెప్పే డైలాగ్స్, స్కూల్ అమ్మాయి లేదా టీనేజర్ కి ఇచ్చినట్టు ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. మరో సన్నివేశంలో హీరో చాలా హ-త్యలు చేస్తాడు అని చెప్తారు. అన్ని హ-త్యలు చేస్తే పోలీసులు హీరోని పట్టుకోరా అని ట్రోల్ చేస్తున్నారు.
పెదకాపు ట్రైలర్ చూసినవారంత షాక్ అయ్యారు. ఒకప్పుడు క్లాస్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఇలాంటి మాస్ మూవీని ఎలా తీస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఈ మూవీ రేపు విడుదల కానుంది. దాంతో రిలీజ్ కు 2 రోజుల ముందే బుధవారం నాడు సినీ సెలబ్రిటీల కోసం ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రీమియర్ షోకు వెళ్ళిన సినీ సెలబ్రిటీలు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు పీఆర్వోలు, మూవీ క్రిటిక్స్ కూడా ఈ సినిమాని చూశారట.
వీళ్లంతా సోషల్ మీడియా ఎక్స్ ద్వారా పెదకాపు సినిమా పై తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. మూవీ చూసిన వారంతా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారని, మూవీని రస్టిక్గా తీశారని కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీలోని క్యారెక్టర్స్, డైలాగులు, విజువల్స్, కొన్ని సీన్స్ ఇప్పటికీ మైండ్ లో తిరుగుతున్నాయని ఒకరు ఎక్స్లో రాసుకొచ్చారు.
మరొకరు మాకూ ఒక వెట్రిమారన్ ఉన్నాడని అనిపిస్తోందని అన్నారు. ఇంకొకరు తెలుగులో గొప్ప కెమెరామేన్ ఉన్నారని ఛోటా కె నాయుడు తన వర్క్తో గుర్తు చేశారని సినీ జర్నలిస్ట్ రాసుకొచ్చారు. కొన్ని షాట్స్, ఫ్రేమ్స్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువే అని ప్రశంసించారు. మిక్కీ జే మేయర్ ఈ మూవీకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారట. టెక్నీషియన్స్ అంతా బెస్ట్ వర్క్ ఇచ్చారని రాసుకొచ్చారు.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
రణ్బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటిస్తున్న మూవీ యానిమల్. కొన్ని రోజులుగా ఈ మూవీలోను కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. రణ్బీర్ కపూర్ పుట్టినరోజు (సెప్టెంబర్ 28) సందర్భంగా ఈ మూవీ టీజర్ను మూవీయూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్లకి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో రణ్బీర్ కపూర్ ను ‘యానిమల్’ లా వయలెంట్గా చూపించారు.
టీజర్ను చూస్తే, తండ్రీ కుమారుల మధ్య ఎమోషన్ కనిపిస్తోంది. అయితే ఒక టిపికల్ స్టోరీలా అనిపిస్తుంది. ఈ మూవీలో విలన్ ఎవరు అనే విషయం మాత్రం అంత స్పష్టంగా తెలియలేదు. రణ్ బీర్ కపూర్ కొన్ని చోట్ల చాలా కూల్గా, కొన్ని చోట్ల చాలా వయలెంట్గా కనిపించాడు. రణ్ బీర్ కపూర్ చెప్పిన డైలాగ్స్ మూవీ పై ఆసక్తిని పెంచేస్తున్నాయి.
యానిమల్ టీజర్ విజువల్స్, సంగీతం, బిజీఎం ఇలా ప్రతిదీ అందరినీ ఆశ్చర్య పడేలా చేస్తున్నాయి. అంతర్జాతీయ స్టాండర్డ్లో ‘యానిమల్’ మూవీ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, యానిమల్ టీజర్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
watch video :






