ఇటీవల కాలంలో మలయాళంలో హిట్ అయిన సినిమాలను ఎక్కువగా తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2021లో రిలీజ్ అయ్యి, అద్భుతమైన ప్రేక్షక ఆదరణ పొందిన సూపర్ హిట్ మూవీ ‘నాయట్టు’ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
చాలాకాలం క్రితమే ఈ మూవీ మొదలైనప్పటికీ, ఇటీవలే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీకి ‘కోటబొమ్మాళి PS’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఒరిజినల్ మూవీ ‘నాయట్టు’ కథ ఏమిటో? ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
నాయట్టు సినిమా పొలిటికల్ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కింది. కుంచకో బోబన్ , జోజు జార్జ్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. జాఫర్ ఇడుక్కి , అనిల్ నెడుమంగడ్, హక్కిం షాజహాన్ కీలక పాత్రల్లో నటించారు. 2021లో రిలీజ్ అయిన ఈ మూవీకి మార్టిన్ ప్రక్కత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమాకి ఉత్తమ సినిమాగా, ఉత్తమ నటుడిగా జోజు జార్జ్, ఉత్తమ కథ మరియు ఉత్తమ ఎడిటర్ గా ఆ ఏడాది కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు వచ్చాయి.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, ముగ్గురు పోలీసుల చుట్టూ తిరిగే కథ. రాష్ట్రంలో ఎన్నికల జరిగే సమయంలో ఒక చిన్న గ్రామంలో ఒక ఎస్సై, ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్కు, ఒక వర్గానికి చెందిన మనుషుల మధ్య పోలీస్ స్టేషన్ లో చిన్న గొడవ జరుగుతుంది. అయితే ఆ గోడవకు పాలిటిక్స్ తోడవడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి.
ఈ పరిస్థితుల్లో ఎస్సై మరియు కానిస్టేబుల్స్ ప్రయాణిస్తున్న జీపు మోటార్ బైక్ ను ఢీకొడుతుంది. దాంతో బైక్ మీద ఉన్న వ్యక్తి మరణిస్తాడు. అయితే అతను బిజు అనే లోకల్ గూండా స్నేహితుడు. దాంతో జీపులోని ముగ్గురిని అరెస్ట్ చేసి, మర్డర్ కేసు పెట్టమని ఆదేశాలు వస్తాయి. దాంతో ఎస్పై, ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడి నుండి తప్పించుకుంటారు. ఆ తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
Also Read: “నవీన్ పోలిశెట్టి” ఒక నాని సినిమాలో నటించారు అని మీకు తెలుసా..? ఆ సినిమా ఏంటంటే..?

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భక్త కన్నప్ప మూవీలో కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ బాలీవుడ్ కి చెందిన వ్యక్తి. అతను టెలివిజన్ దర్శకుడు. ముఖేష్ కుమార్ సింగ్ బీహార్లో పుట్టి పెరిగాడు. డ్రామాటిక్ ఆర్ట్లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. అందులో ముఖేష్ కుమార్ గోల్డ్ మెడల్ అందుకున్నాడు.
ఆల్ ఇండియా రేడియో, సాంగ్ అండ్ డ్రామా డివిజన్ ఆఫ్ ఇండియా మొదలైన వాటిలో ఎన్నో నాటకాలలో నటించాడు. దర్శకత్వం వహించాడు. ముఖేష్ 2000వ సంవత్సరంలో దర్శకుడు కావడం కోసం ముంబైలో అడుగుపెట్టాడు. ముఖేష్ కెరీర్ ప్రారంభంలో శ్రీ అధికారి బ్రదర్స్తో కలిసి పనిచేశాడు. ఆ తరువాత మొదట థ్రిల్లర్ ‘సురాగ్’ కు అవకాశం పొందాడు. ఆ తరువాత అనేక ప్రసిద్ధ పౌరాణిక మరియు చారిత్రక టెలివిజన్ షోలకు దర్శకత్వం వహించాడు.
ముఖేష్ ఇండియన్ టెలివిజన్లో అతి పెద్ద షో మహాభారతానికి దర్శకత్వం వహించాడు. ఇది 100 కోట్ల టీవీ షోగా గుర్తింపు పొందింది. మేరే సాయి, చంద్ర నందిని, రజియా సుల్తాన్, హనుమాన్, బంధన్, మీరా, రామాయణం, భాగ్య విధాత, ద్వారకాధీష్ వంటి షోలతో బుల్లితెరపై మ్యాజిక్ క్రియేట్ చేశాడు. భక్త కన్నప్ప మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.



మొదట్లో ఆసక్తికరంగా సాగిన ఇంటింటి గృహలక్ష్మిని అభిమానించే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సినియర్ హీరోయిన్ కస్తూరి ప్రధాన పాత్రలో నటించిన ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ కూడా తెచ్చుకునేది. అయితే రాను రాను కథలో వచ్చిన మార్పులతో, కొత్త కొత్త క్యారెక్టర్లతో, సాగగదీసిన డైలాగ్స్ తో ప్రేక్షకుల సహనానికి పరిక్ష పెడుతున్న ఈ సీరియల్, ఆ మధ్యన సామ్రాట్ క్యారెక్టర్ ఎంట్రీతో ప్రేక్షకుల నుండి నెగెటివ్ రెస్పాన్స్, విమర్శలు తీవ్రంగా వచ్చాయి. దాంతో ఆ పాత్రను అర్ధాంతరంగా తొలగించారు.
అయితే ఈ సీరియల్ లో గత కొన్నిరోజులుగా ప్రసారం అవుతున్న ఎపిసోడ్ల పై ఆడియెన్స్ మండిపడుతున్నారు. సీరియల్స్ అంటే కుటుంబంలోని వారంతా కలిసి చూస్తారని, అందులో పిల్లలు కూడా ఉంటారని, అలాంటి సీరియల్స్ లో కూడా ఎక్స్ పోజింగ్ హద్దులు దాటుతోందని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలలో, ఓటీటీల్లో వలె అడల్ట్ కంటెంట్ చూపిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రీసెంట్ గా ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఒకవైపు సామ్రాట్ చనిపోయడని, దండ వేసిన సామ్రాట్ ఫొటోను చూస్తూ, తులసి భోరు భోరున ఏడుస్తూ కూర్చుంది. మరో వైపు తులసి కూతురు దివ్యను బీగ్రేడ్ సినిమాలలో చూపించారని కామెంట్స్ చేశారు. ఇలాంటి సన్నివేశాలు చూపిస్తే, ఆడవాళ్ళు, చిన్న పిల్లలతో ఫ్యామిలీ చూస్తారనే ఇంగితం కూడా లేదా అని తిడుతున్నారు.
ఇప్పటికి కూడా ఈ సినిమాకి రిపీట్ వాల్యూ ఉంది. అందుకే యూట్యూబ్ లో ఈ సినిమాకి సంబంధించిన కామెడీ సీన్స్ కి లక్షల్లో వ్యూస్ ఉంటాయి. ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాలో నటించారు. అప్పటి వరకు మూతపడ్డ థియేటర్లని తెరిపించి కాసుల వర్షం కురిపించిన సినిమా ఇది. ఈ సినిమాలో నవీన్ మాట్లాడిన డైలాగ్స్, మేనరిజమ్స్ విపరీతంగా ఇమిటేట్ చేస్తారు.




సినిమాల్లో చాలా ట్విస్టులు చూస్తుంటాం. కొన్నిసార్లు నిజ జీవితంలో దానికన్నా ఎక్కువ ట్విస్టులే ఊహించని విధంగా వస్తుంటాయి. దానితో ఎక్కడో ఉండాల్సిన జీవితం మారెక్కడీకో మారుతుంది. సీనియర్ హీరో కార్తీక్ లైఫ్ కూడా ఇలాంటిదే. సౌత్లో వందకు పైగా చిత్రాలలో నటించిన కార్తీక్ టాప్ హీరోగా కొనసాగుతాడని అంతా భావించారు. కానీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. కార్తీక్ అసలు పేరు మురళి కార్తికేయన్ ముత్తురామన్. ఆయన తండ్రి కోలీవుడ్ లో గొప్ప యాక్టర్ ఆర్ ముత్తురామన్. మచ్చలేని మనిషిగా పేరు గాంచారు.
నటనను తండ్రి నుండి వారసత్వంగా పొందిన కార్తీక్ భారతీరాజా దర్శకత్వం వహించిన అలైగళ్ ఒవతిల్లై అనే మూవీతో 1981లో కోలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ భారీ విజయాన్ని సాధించింది. కార్తీక్ లుక్స్, నటన మెచ్చిన దర్శకులు తమ చిత్రాలలో నటించమని వెంటపడ్డారు. అలా అతి తక్కువ టైమ్ లోనే తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. సీతాకోక చిలుక మూవీ తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తరువాత అన్వేషణ, గోపాలరావు గారి అబ్బాయి, అభినందన లాంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు. తమిళంలో సంవత్సరానికి 8-10 చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉండటంతో కార్తీక్ తెలుగులో ఎక్కువగా నటించలేకపోయాడు. అయినా తెలుగులో తక్కువ సినిమాలే చేసినా హీరో కార్తీక్ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అభినందన మూవీకి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా అందుకున్నాడు. కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుతెచ్చుకున్న తరువాత నుండే కార్తీక్ కెరీర్ పడిపోవడం మొదలైంది అంటారు.
కార్తీక్ తరచూ ఎవరో ఒక హీరోయిన్తో ఎఫైర్ పెట్టుకున్నట్టుగా వార్తలు వినిపించేవి. ఈ క్రమంలో హీరోయిన్ రాగిణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి గౌతమ్ కార్తీక్, జ్ఞాన్ కార్తీక్ ఇద్దరు పిల్లలు. అయితే ఆ తరువాత టం ఇంట్లోనే ఉంటున్న భార్య చెల్లెలు రతితో ఎఫైర్ పెట్టుకున్నట్లుగా, రతి ప్రెగ్నెంట్ అని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ తరువాత రతిని రెండవ వివాహం చేసుకున్నాడు. దాంతో కార్తీక్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కార్తీక్పై అతని తోబుట్టువులు కేసు వేశారు. తండ్రి ముత్తురామన్ ఆస్తులలో తమ హక్కును కోరుతూ కేసును వేశారు.
ఆ సమయంలో కార్తీక్ సినిమాల పై దృష్టి పెట్టలేకపోయాడు. అది కూడా ఒక కారణం. కార్తీక్ షూటింగ్ స్పాట్ ఆలస్యంగా రావడం అలవాటు, దాంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతని వల్ల రమేష్ కన్నా అనే దర్శకత్వం వహించిన తొలి మూవీ ఇప్పటికీ రిలీజ్ కు నోచుకోలేదు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కార్తీక్ ఆల్కహాల్ మరియు డ్రగ్స్ కు బానిస. ఈ చెడు వ్యసనాల వల్లే తన కెరీర్ పతనం అయ్యిందని స్వయంగా కార్తీక్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.












