ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.
బాలీవుడ్ లో ఊహించని విధంగా ఈ మూవీ రూ.108 కోట్ల వసూళ్లను సాధించి, అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ‘పుష్ప 2 ‘ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అయితే పుష్ప టీమ్ ని నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తెలుగు ఇండస్ట్రీలో మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించిన హీరోగా రికార్డ్ సృష్టించిన అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 కోసం తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ నుంచి కేరళ వరకు ఉన్న ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ డబ్బింగ్ రైట్స్ కోసమే ఊహించని స్థాయిలో కోట్లు పెట్టడానికి ప్రొడ్యూసర్లు కూడా సిద్ధమవుతున్నారు. బాహుబలి, కేజిఎఫ్ సినిమాల తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటే ప్యాన్ ఇండియా సినిమాగా పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటిస్తూ, పోస్టర్ ను రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ కుర్చీ మీద కూర్చున్న ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ముఖాన్ని పూర్తిగా రివీల్ చేయకుండా, హీరో చేయి ఫోటోతోనే సస్పెన్స్ క్రియేట్ చేశారు. చూపుడు వేలుకు, ఉంగరం వేళ్ళకి రింగు ఉండగా, చిటికెన వేలు గోరుకు ఎర్రని నెయిల్ పాలిష్ తో హైలెట్ చేశారు. ఈ మూవీని 2024 ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది.
అయితే ఈ పోస్టర్ పై కొందరు నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆ మధ్యన రిలీజ్ చేసిన పోస్టర్ ని కొంచెం మార్చి అల్లు అర్జున్ డ్రెస్ చేంజ్ చేసుకున్నట్టుగా ఈ పోస్టర్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ ను సస్పెన్స్ గా ప్రకటించినపుడు ఇంకా మంచి పోస్టర్ ను ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు కదా అంటున్నారు. అది మాత్రమే కాకుండా శంకర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ కూడా అదే రోజు రిలీజ్ అన్నారు. రెండు క్లాష్ అవుతే రెండింటిలో ఏ మూవీ హిట్ అవుతుందనదే చూడాలి.
Also Read: ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి తెలుగు జాతి గౌరవాన్ని పెంచాడు..! ఎవరో తెలుసా..?

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి సినీరంగంలో టాప్ హీరోగా మాత్రమే కాకుండా తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి. రాజకీయాల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించి, తెలుగు వారి పేరును నలువైపులా వ్యాపింపజేశారు. ఆయనెవరో కాదు, నట సార్వ భౌముడిగా పేరుగాంచిన నందమూరి తారకరామారావు. తెలుగువారు ప్రేమగా అన్నగారు అని పిలుచుకునే ఎన్టీఆర్.
ఎన్టీ రామరావుగారితో ఉన్న వ్యక్తి ఆయన తాతగారు రామస్వామి చౌదరి. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏపీలోని కృష్ణ జిల్లాలో నిమ్మకూరులో నందమూరి కుటుంబంలో 1923లో మే 28న ఎన్టీ రామారావు జన్మించారు. ఎన్టిఆర్ తండ్రి పేరు లక్ష్మయ్య, తల్లి పేరు వెంకట్రావమ్మ. వీరికి ఇద్దరు పిల్లలు. వారే నందమూరి తారక రామారావు మరియు నందమూరి త్రివిక్రమరావు. ఎన్టీఆర్ చిన్నతనంలో తన తాత రామస్వామి చౌదరి వద్దనే పెరిగారు. 1928 లో హీరో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తాత బడిపంతులు అయిన గద్దె వెంకట సుబ్బయ్య దగ్గర అక్షరాలు నేర్చుకున్నారు.
పెద్దయ్యాక మనదేశం మూవీతోఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఎన్టీఆర్, ఆయన కెరీర్ లో పౌరాణిక, సాంఘిక, జానపద, సినిమాలలో ఎన్నో విభిన్న పాత్రలలో నటించి, మెప్పించారు. ఆయన తెలుగు, హిందీ, తమిళం భాషల్లో సుమారు 400 సినిమాలలో నటించారు. నిర్మాతగా, దర్శకుడిగా పని చేశారు. రాముడు, కృష్ణుడు లాంటి పౌరాణిక క్యారెక్టర్లతో తెలుగు వారి మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. రాజకీయాల్లో అడుగు పెట్టి, తెలుగుదేశం పార్టీని స్థాపించి, 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రజలకు సేవ చేశారు.
నాయట్టు సినిమా పొలిటికల్ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కింది. కుంచకో బోబన్ , జోజు జార్జ్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. జాఫర్ ఇడుక్కి , అనిల్ నెడుమంగడ్, హక్కిం షాజహాన్ కీలక పాత్రల్లో నటించారు. 2021లో రిలీజ్ అయిన ఈ మూవీకి మార్టిన్ ప్రక్కత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమాకి ఉత్తమ సినిమాగా, ఉత్తమ నటుడిగా జోజు జార్జ్, ఉత్తమ కథ మరియు ఉత్తమ ఎడిటర్ గా ఆ ఏడాది కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు వచ్చాయి.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, ముగ్గురు పోలీసుల చుట్టూ తిరిగే కథ. రాష్ట్రంలో ఎన్నికల జరిగే సమయంలో ఒక చిన్న గ్రామంలో ఒక ఎస్సై, ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్కు, ఒక వర్గానికి చెందిన మనుషుల మధ్య పోలీస్ స్టేషన్ లో చిన్న గొడవ జరుగుతుంది. అయితే ఆ గోడవకు పాలిటిక్స్ తోడవడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి.
ఈ పరిస్థితుల్లో ఎస్సై మరియు కానిస్టేబుల్స్ ప్రయాణిస్తున్న జీపు మోటార్ బైక్ ను ఢీకొడుతుంది. దాంతో బైక్ మీద ఉన్న వ్యక్తి మరణిస్తాడు. అయితే అతను బిజు అనే లోకల్ గూండా స్నేహితుడు. దాంతో జీపులోని ముగ్గురిని అరెస్ట్ చేసి, మర్డర్ కేసు పెట్టమని ఆదేశాలు వస్తాయి. దాంతో ఎస్పై, ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడి నుండి తప్పించుకుంటారు. ఆ తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భక్త కన్నప్ప మూవీలో కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ బాలీవుడ్ కి చెందిన వ్యక్తి. అతను టెలివిజన్ దర్శకుడు. ముఖేష్ కుమార్ సింగ్ బీహార్లో పుట్టి పెరిగాడు. డ్రామాటిక్ ఆర్ట్లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. అందులో ముఖేష్ కుమార్ గోల్డ్ మెడల్ అందుకున్నాడు.
ఆల్ ఇండియా రేడియో, సాంగ్ అండ్ డ్రామా డివిజన్ ఆఫ్ ఇండియా మొదలైన వాటిలో ఎన్నో నాటకాలలో నటించాడు. దర్శకత్వం వహించాడు. ముఖేష్ 2000వ సంవత్సరంలో దర్శకుడు కావడం కోసం ముంబైలో అడుగుపెట్టాడు. ముఖేష్ కెరీర్ ప్రారంభంలో శ్రీ అధికారి బ్రదర్స్తో కలిసి పనిచేశాడు. ఆ తరువాత మొదట థ్రిల్లర్ ‘సురాగ్’ కు అవకాశం పొందాడు. ఆ తరువాత అనేక ప్రసిద్ధ పౌరాణిక మరియు చారిత్రక టెలివిజన్ షోలకు దర్శకత్వం వహించాడు.
ముఖేష్ ఇండియన్ టెలివిజన్లో అతి పెద్ద షో మహాభారతానికి దర్శకత్వం వహించాడు. ఇది 100 కోట్ల టీవీ షోగా గుర్తింపు పొందింది. మేరే సాయి, చంద్ర నందిని, రజియా సుల్తాన్, హనుమాన్, బంధన్, మీరా, రామాయణం, భాగ్య విధాత, ద్వారకాధీష్ వంటి షోలతో బుల్లితెరపై మ్యాజిక్ క్రియేట్ చేశాడు. భక్త కన్నప్ప మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.



మొదట్లో ఆసక్తికరంగా సాగిన ఇంటింటి గృహలక్ష్మిని అభిమానించే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సినియర్ హీరోయిన్ కస్తూరి ప్రధాన పాత్రలో నటించిన ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ కూడా తెచ్చుకునేది. అయితే రాను రాను కథలో వచ్చిన మార్పులతో, కొత్త కొత్త క్యారెక్టర్లతో, సాగగదీసిన డైలాగ్స్ తో ప్రేక్షకుల సహనానికి పరిక్ష పెడుతున్న ఈ సీరియల్, ఆ మధ్యన సామ్రాట్ క్యారెక్టర్ ఎంట్రీతో ప్రేక్షకుల నుండి నెగెటివ్ రెస్పాన్స్, విమర్శలు తీవ్రంగా వచ్చాయి. దాంతో ఆ పాత్రను అర్ధాంతరంగా తొలగించారు.
అయితే ఈ సీరియల్ లో గత కొన్నిరోజులుగా ప్రసారం అవుతున్న ఎపిసోడ్ల పై ఆడియెన్స్ మండిపడుతున్నారు. సీరియల్స్ అంటే కుటుంబంలోని వారంతా కలిసి చూస్తారని, అందులో పిల్లలు కూడా ఉంటారని, అలాంటి సీరియల్స్ లో కూడా ఎక్స్ పోజింగ్ హద్దులు దాటుతోందని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలలో, ఓటీటీల్లో వలె అడల్ట్ కంటెంట్ చూపిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రీసెంట్ గా ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఒకవైపు సామ్రాట్ చనిపోయడని, దండ వేసిన సామ్రాట్ ఫొటోను చూస్తూ, తులసి భోరు భోరున ఏడుస్తూ కూర్చుంది. మరో వైపు తులసి కూతురు దివ్యను బీగ్రేడ్ సినిమాలలో చూపించారని కామెంట్స్ చేశారు. ఇలాంటి సన్నివేశాలు చూపిస్తే, ఆడవాళ్ళు, చిన్న పిల్లలతో ఫ్యామిలీ చూస్తారనే ఇంగితం కూడా లేదా అని తిడుతున్నారు.
ఇప్పటికి కూడా ఈ సినిమాకి రిపీట్ వాల్యూ ఉంది. అందుకే యూట్యూబ్ లో ఈ సినిమాకి సంబంధించిన కామెడీ సీన్స్ కి లక్షల్లో వ్యూస్ ఉంటాయి. ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాలో నటించారు. అప్పటి వరకు మూతపడ్డ థియేటర్లని తెరిపించి కాసుల వర్షం కురిపించిన సినిమా ఇది. ఈ సినిమాలో నవీన్ మాట్లాడిన డైలాగ్స్, మేనరిజమ్స్ విపరీతంగా ఇమిటేట్ చేస్తారు.




సినిమాల్లో చాలా ట్విస్టులు చూస్తుంటాం. కొన్నిసార్లు నిజ జీవితంలో దానికన్నా ఎక్కువ ట్విస్టులే ఊహించని విధంగా వస్తుంటాయి. దానితో ఎక్కడో ఉండాల్సిన జీవితం మారెక్కడీకో మారుతుంది. సీనియర్ హీరో కార్తీక్ లైఫ్ కూడా ఇలాంటిదే. సౌత్లో వందకు పైగా చిత్రాలలో నటించిన కార్తీక్ టాప్ హీరోగా కొనసాగుతాడని అంతా భావించారు. కానీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. కార్తీక్ అసలు పేరు మురళి కార్తికేయన్ ముత్తురామన్. ఆయన తండ్రి కోలీవుడ్ లో గొప్ప యాక్టర్ ఆర్ ముత్తురామన్. మచ్చలేని మనిషిగా పేరు గాంచారు.
నటనను తండ్రి నుండి వారసత్వంగా పొందిన కార్తీక్ భారతీరాజా దర్శకత్వం వహించిన అలైగళ్ ఒవతిల్లై అనే మూవీతో 1981లో కోలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ భారీ విజయాన్ని సాధించింది. కార్తీక్ లుక్స్, నటన మెచ్చిన దర్శకులు తమ చిత్రాలలో నటించమని వెంటపడ్డారు. అలా అతి తక్కువ టైమ్ లోనే తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. సీతాకోక చిలుక మూవీ తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తరువాత అన్వేషణ, గోపాలరావు గారి అబ్బాయి, అభినందన లాంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు. తమిళంలో సంవత్సరానికి 8-10 చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉండటంతో కార్తీక్ తెలుగులో ఎక్కువగా నటించలేకపోయాడు. అయినా తెలుగులో తక్కువ సినిమాలే చేసినా హీరో కార్తీక్ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అభినందన మూవీకి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా అందుకున్నాడు. కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుతెచ్చుకున్న తరువాత నుండే కార్తీక్ కెరీర్ పడిపోవడం మొదలైంది అంటారు.
కార్తీక్ తరచూ ఎవరో ఒక హీరోయిన్తో ఎఫైర్ పెట్టుకున్నట్టుగా వార్తలు వినిపించేవి. ఈ క్రమంలో హీరోయిన్ రాగిణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి గౌతమ్ కార్తీక్, జ్ఞాన్ కార్తీక్ ఇద్దరు పిల్లలు. అయితే ఆ తరువాత టం ఇంట్లోనే ఉంటున్న భార్య చెల్లెలు రతితో ఎఫైర్ పెట్టుకున్నట్లుగా, రతి ప్రెగ్నెంట్ అని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ తరువాత రతిని రెండవ వివాహం చేసుకున్నాడు. దాంతో కార్తీక్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కార్తీక్పై అతని తోబుట్టువులు కేసు వేశారు. తండ్రి ముత్తురామన్ ఆస్తులలో తమ హక్కును కోరుతూ కేసును వేశారు.
ఆ సమయంలో కార్తీక్ సినిమాల పై దృష్టి పెట్టలేకపోయాడు. అది కూడా ఒక కారణం. కార్తీక్ షూటింగ్ స్పాట్ ఆలస్యంగా రావడం అలవాటు, దాంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతని వల్ల రమేష్ కన్నా అనే దర్శకత్వం వహించిన తొలి మూవీ ఇప్పటికీ రిలీజ్ కు నోచుకోలేదు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కార్తీక్ ఆల్కహాల్ మరియు డ్రగ్స్ కు బానిస. ఈ చెడు వ్యసనాల వల్లే తన కెరీర్ పతనం అయ్యిందని స్వయంగా కార్తీక్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.







