సినీ సెలబ్రెటీల పుట్టిన రోజు లేదా వారికి సంబంధించిన ప్రత్యేకమైన రోజు అయినా వారి రేర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరో, హీరోయిన్ల చిన్నప్పటి ఫొటోలు ఎక్కువగా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. స్టార్స్ సైతం అప్పుడప్పుడు వారి చిన్ననాటి ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటారు.
నెటిజన్లు తమ అభిమాన హీరోహీరోయిన్ల చిన్ననాటి ఫోటోలను చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. గత కొద్ది రోజులుగా నెట్టింట్లో త్రో బ్యాక్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో స్టార్ హీరో ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో గ్రీన్ షర్ట్ వేసుకున్న అబ్బాయి ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరో. అతనెవరో ఇప్పుడు చూద్దాం..
ఈ హీరో కోలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. కంటెంట్కు చాలా ప్రాధాన్యత ఇస్తూ, కొత్త స్టోరీలకు మద్దతిస్తూ, కథ నచ్చితే ఆ క్యారెక్టర్ కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీ అయ్యే తమిళ హీరో. రజినీ కాంత్ మరియు కమల్ హాసన్ లను కలిపితే ఆ హీరో అని అక్కడి ఆడియెన్స్ పిలుస్తారు. రీసెంట్ గా తెలుగులో హిట్ అందుకున్నాడు. హాలీవుడ్ సినిమాలో సైతం నటించాడు.
సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సినిమాలలో నటిస్తూ ఆడియెన్స్ ని మెప్పిస్తున్నాడు. ఇప్పటికే ఆ హీరో ఎవరో అర్థమై ఉంటుంది. పై ఫొటోలో ఉన్న హీరో మరెవరో కాదు సౌత్ సూపర్ స్టార్ ధనుష్. సార్ మూవీతో టాలీవుడ్ లో విజయాన్ని అందుకున్న, ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో తెలుగు సినిమా చేయనున్నారు.
పాన్ ఇండియా సినిమా కెప్టెన్ మిల్లర్తో ఆడియెన్స్ ను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీ విడుదల కాకముందే మరో రెండు చిత్రాలను పట్టాలెక్కించారు. ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమాని ప్రకటించారు. అలాగే తన స్వీయ దర్శకత్వంలో 50వ చిత్రాన్ని కూడా ధనుష్ ప్రారంభించారు.








బాలకృష్ణ ఈ మూవీ షూటింగ్ విషయంలో సీనియర్ హీరోలైన కృష్ణ, కృష్ణంరాజులకు చెందిన పార్ట్ ను ముందుగా చేద్దామని చెప్పడంట. అయితే ఆ పార్ట్ షూటింగ్ అండమాన్ దీవుల్లో ప్లాన్ చేయడంతో కుటుంబాలతో ట్రిప్ లగా సరదాగా ఉంటుందని ముగ్గురు హీరోలు తమ ఫ్యామిలీలను తీసుకొని అండమాన్ కి వెళ్లారంట. అక్కడి లొకేషన్లు బాగున్నా, ఉండేందుకు రాజీవ్ గాంధీ గెస్ట్ హౌజ్ మాత్రమే ఉందంట. తప్పక అందులోనే అందరూ అడ్జస్ట్ అయ్యారంట. ఇక అక్కడ తినడానికి ఆహారం కూడా దొరికలేదంట. వెళ్లిన రోజు తమతో పాటు తీసుకెళ్లిన బిస్కేట్లు, చిరుతిండ్లతో గడిపారంట
మరుసటి రోజు ఎక్కడి నుండో రైస్, కూరగాయలు తెప్పించుకున్నారంట. వాటితో విజయ నిర్మలగారు అద్భుతంగా వంట చేయడంతో అందరు తిన్నారట. ఇక బాలయ్య చేపలని వేటాడీ తీసుకు రావడంతో విజయ నిర్మల వాటితో చేపల పులుసు చేసిందంట. ఆ చేపల పులుసు అద్భుతంగా ఉండడంతో మూవీ యూనిట్ అందరికి రుచి చూపించారంట. అందరు లొట్టలేసుకుంటూ తిన్నారట. దాంతో తెలుగు ఇండస్ట్రీలో విజయనిర్మల గారి చేపల పులుసు ఫేమస్ అయ్యింది.
Also Read:
దుల్కర్ సల్మాన్ 2012లో ‘సెకండ్ షో’ అనే మలయాళ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది దుల్కర్ రెండవ సినిమా ‘ఉస్తాద్ హోటల్’ లో నటించాడు. ఈ చిత్రంలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. అన్వర్ రషీద్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2012కి గాను మూడు జాతీయ అవార్డులు అందుకుంది. ‘బెస్ట్ పాపులర్ సినిమా , బెస్ట్ డైలాగ్స్, యాక్టర్ తిలకన్ కి ప్రత్యేక అవార్డు వచ్చింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుని, భారీ కలెక్షన్స్ సాధించి, కమర్షియల్ గా విజయం సాధించింది. ఈ మూవీని తెలుగులో ‘జనతాహోటల్’ గా డబ్ చేసి, 2018 లో రిలీజ్ చేశారు.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఫైజల్ (దుల్కర్ సల్మాన్) నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన అబ్బాయి కావడంతో అతని తండ్రి, అక్కలు అల్లారుముద్దుగా పెంచుతారు. ఫైజల్ కి వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. దాంతో తండ్రికి తెలియకుండా విదేశాల్లో హోటల్ మేనేజ్ మెంట్ చేశాడు. కానీ ఫైజల్ తండ్రి అతనితో స్టార్ హోటల్ పెట్టించాలని భావిస్తాడు. ఫైజల్ కి తండ్రి షహానా (నిత్యామీనన్)తో పెళ్ళిచూపులు ఏర్పాటుచేస్తాడు. ఆ సమయంలో ఫైజల్ హోటల్ మేనేజ్ మెంట్ గురించి బయటపడుతుంది.
దాంతో ఫైజల్ ను తండ్రి పాస్ పోర్ట్ తీసుకుని, ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు. అప్పుడు ఫైజల్ తాతయ్య కరీంభాయ్ వద్దకు వెళ్ళి, ఆయన నడిపే “ఉస్తాద్ హోటల్”లో పనిచేస్తూ, డూప్లికేట్ పాస్ పోర్ట్ కు అప్లై చేసి, ఎదురుచూస్తుంటాడు. ఆ తరువాత తాత సహాయంతో బీచ్ బే అనే ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ గా జాయిన్ అవుతాడు. అక్కడ బీచ్ బే తమ హోటల్ ను విస్తరించడం కోసం “ఉస్తాద్ హోటల్”ను ఆక్రమించుకోబోతుందని తెలుసుకుంటాడు.
ఉస్తాద్ హోటల్ ను ఫైజల్ ఎలా కాపాడాడు ? తాత దగ్గర ఏం నేర్చుకుంటాడు ? చివరికి ఫైజల్ అనుకున్నట్టు విదేశాలకి వెళ్లాడా? లేదా అనేది మిగిలిన కథ. ఈ చిత్రంలో దుల్కర్ ఫైజల్ పాత్రలో ఒదిగిపోయారు. ఉస్తాద్ హోటల్ యాజమానిగా, ఫైజల్ తాతగా యాక్టర్ తిలకన్ జీవించారు. నిత్యామీనన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటు ఉంది.

నటి నిషా నూర్ తన గ్లామర్తో 1980లో సిల్వర్ స్క్రీన్ ను మరింత అందంగా మార్చింది. ఆమె తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో చిత్రాలలో నటిస్తూ దక్షణాదిలో స్టార్ హీరోయిన్గా రాణించింది. కమల్ హాసన్, రజనీకాంత్, భాను చందర్ లాంటి పెద్ద హీరోలతో నటించింది. అగ్ర దర్శకులు అయిన బాలచందర్, భారతీరాజా విసు, చంద్రశేఖర్ లాంటి వారితో పని చేసింది. కమల్ హాసన్ తో కలిసి ‘టిక్ టిక్ టిక్’ అనే సినిమాలో, రాజేంద్రప్రసాద్, మమ్ముట్టి, మోహన్లాల్తో పలు సినిమాలు చేసింది.
తన గ్లామర్ తో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ 1995 అనంతరం నిషా నూర్ కు ఒక్క మూవీలో కూడా అవకాశం రాలేదు. అప్పటివరకు స్టార్ స్టేటస్ పొందిన నిషా నూర్ అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించినప్పటికీ, ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో సినిమాలని వదిలిపెట్టింది. అయితే సంపాదించిన డబ్బు మొత్తం కరిగిపోవడం మొదలైంది. బతకడం కోసం పని చేయాలి. కానీ ఆమె తప్పు దారిని ఎంచుకుని, వ్యభిచార వృత్తిలోకి వెళ్ళింది.
అయితే ఒక ప్రొడ్యూసర్ వల్లే ఆ వృత్తిలోకి వెళ్ళిందనే వార్త అప్పట్లో వచ్చాయి. ఆదుకునేవారు లేకపోవడం వల్ల నిషా నూర్ అందులోనే ఉండిపోయింది. ఆమెకు తలదాచుకునే స్థలం కూడా లేక ఒక సమయంలో ఒక దర్గా బయట నిద్రించింది. ఆమె పరిస్థితి తెలిసి, ఆదుకోవడానికి ఒక తమిళ ఎన్జీవో ముందుకు వచ్చి, నిషా నూర్ కు వైద్య పరీక్షలు చేయించడంతో ఆమెకు ఎయిడ్స్ ఉన్నట్లుగా తెలిసింది. ఆ వ్యాధితో పోరాడుతూ హాస్పటల్ లోనే నిషా నూర్ 2007లో అనాధలా మరణించింది.